LIVE : తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ నేతల ప్రెస్​మీట్​

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 3:58 PM IST

Updated : Feb 6, 2024, 4:31 PM IST

thumbnail

BRS Leaders Meeting Live Today : మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 3 నెలల విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ​ కార్యాలయమైన తెలంగాణ భవన్​కు వెళ్లారు. పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని కేసీఆర్​కు స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్​కు ఆయన రావడంతో కేసీఆర్​ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కృష్ణా జలాల అంశానికి సంబంధించిన కార్యాచరణపై కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలు పాల్గొన్నారు. కృష్ణా జలాల అంశంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు, ఇతర బీఆర్ఎస్​ నాయకులు​ ఈ సమావేశంలో పాల్గొన్నారు.  నల్గొండలో ఈనెల 13న బీఆర్​ఎస్​ బహిరంగ సభ ఉందని కేసీఆర్ తెలిపారు. అనంతరం బీఆర్​ఎస్​ నేతలు పార్టీ కార్యలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో చర్చించిన అంశాలను తెలియజేస్తున్నారు. 

Last Updated : Feb 6, 2024, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.