కాంగ్రెస్​ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తోంది : జగదీశ్​​ రెడ్డి - JAGADEESH REDDY Fires On Congress

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 5:09 PM IST

thumbnail
కాంగ్రెస్​ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తోంది : జీవన్​ రెడ్డి (ETV Bharat)

Jagadeesh Reddy Fires On CM Revanth : కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు, అబద్దాలతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వాటితోనే పాలన సాగిస్తోందని మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి అనే పేరు అబద్దానికి పర్యాయ పదంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ మెడపై కత్తిపెట్టి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమన్నా కేసీఆర్ ఒప్పుకోలేదని వెల్లడించారు. హైదరాబాద్ బీఆర్ఎస్​ భవన్‌లో మాజీ మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

అసెంబ్లీలో సభను ప్రజలను రేవంత్​రెడ్డి తప్పుదోవ పట్టించారని జగదీశ్​రెడ్డి ఆరోపించారు. సీఎం చదివిన పేపర్ అబద్దమని అది ఉదయ్ పధకానికి చెందినదని వివరణ ఇచ్చారు.ఉదయ్​కు సంబంధించిన పేపర్​లోని వాక్యాన్ని కొంత మింగి కొంతే చెప్పారన్నారు. రేవంత్​ దిగజారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే విద్యుత్ వినియోగదారులను కసాయి వాళ్లకు అప్పగించడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.