thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 4:48 PM IST

ETV Bharat / Videos

మారుతున్న గ్రామ సచివాలయాల రంగులు - Board Colors Change Sachivalayam

Changed Secretariat Board Colors in Kadapa : రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వైసీపీ రంగుల గ్రహణం వీడుతోంది. తాజాగా ప్రభుత్వం మారడంతో వార్డు, గ్రామ సచివాలయాల రంగు కూడా మారింది. కడపలోని వార్డు, సచివాలయాలన్నిటికీ తెలుగుదేశం పార్టీ కలర్ కలిగిన బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. కొన్నింటిపై జనసేన పార్టీ జెండాలనూ ఎగురవేశారు. ఆ బోర్డులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారాయణ, కడప ఎమ్మెల్యే మాధవిల ఫొటోలను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా వార్డు సచివాలయాల రంగులు మారడంతో ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

మరోవైపు తమ ప్రభుత్వం అధికారంలో రాగానే వాలంటీర్లకు రూ. 10,000ల  గౌరవ వేతనం ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, ప్రజలకు సేవచేస్తే తాము అండగా ఉంటామని చెప్పారు. త్వరలోనే సర్కార్ ఈ వ్యవస్థపై సమీక్ష నిర్వహించి, వారిని ప్రజాసేవ కోసం వినియోగించుకునేందుకు యోచనలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.