thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 10:10 AM IST

Updated : Feb 27, 2024, 11:00 AM IST

ETV Bharat / Videos

LIVE : బయో ఆసియా సదస్సు 2024లో పాల్గొన్న సీఎం రేవంత్​ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం

Bio Asia Summit in Hyderabad : హైదరాబాద్​లో నిర్వహించే బయో ఆసియా 2024 సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ఒక ట్వీట్​ను ఎక్స్​ వేదికగా చేసింది. హైదరాబాద్​లో నిర్వహించే బయో ఆసియా 2024 సదస్సుకు గ్లోబల్​ లైఫ్​ కంపెనీల అత్యంత ప్రభావవంతమైన నాయకులను స్వాగతిస్తున్నామని సీఎంఓ కార్యాలయం ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేసింది. ఈ క్షణం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. పరిశ్రమ పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ రెడ్​ కార్పెట్​ పరుస్తున్నామని తెలిపారు. తెలంగాణను నూతన ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా తీర్చుదిద్దుతున్నామని పేర్కొంది.  ఆదివారం ప్రారంభమైన బయో ఆసియా 2024 సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి 100 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది.
Last Updated : Feb 27, 2024, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.