రాష్ట్ర ప్రభుత్వం జీవో 317ను వెంటనే సవరించాలి : బండి సంజయ్
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jan 29, 2024, 2:27 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-01-2024/640-480-20616748-thumbnail-16x9-bandi-sanjay-on-317-go.jpg)
Bandi Sanjay on GO 317 : రాష్ట్ర ప్రభుత్వం జీవో 317ను వెంటనే సవరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఈ జీవోను తెచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులను అనేక ఇబ్బందుల పాలు చేసిందని ఆరోపించారు. తద్వారా ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. దీనిని సవరించాలని ఎన్ని ఉద్యమాలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చర్లపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
GO 317 Issue in Telangana : గత కేసీఆర్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు కూడా జీవో 317ను సవరించాలని మాట్లాడారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఇప్పుడు హస్తం పార్టీ అధికారంలోకి ఉందని ఇప్పటికైనా ఆ జీవోను సవరించి బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఇందులో భాగంగా ఈరోజు సెక్రటేరియట్ ముందు ఆందోళన చేపట్టిన ఉద్యోగ ఉపాధ్యాయ ప్రతినిధులతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడే అవకాశం కల్పించి వారి సమస్యలు పరిష్కరించాలని బండి సంజయ్ పేర్కొన్నారు.