LIVE : రాజ్‌భవన్‌లో "ఎట్‌హోం" కార్యక్రమం - RAJBHAVAN LIVE - RAJBHAVAN LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 6:55 PM IST

Updated : Aug 15, 2024, 7:03 PM IST

TELANGANA RAJBHAVAN LIVE : దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్​ జిష్ణు దేవ్ వర్మ, రాజ్‌భవన్‌లో "ఎట్‌హోం" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. పలువురి రాకతో రాజ్‌భవన్‌ సందడిగా మారింది. ఇటీవల రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్‌ వర్మ ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి.Independence Day Celebrations in Rajbhavan : రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ రాజ్‌భవన్‌లో జాతీయజెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, విద్యార్థులు హాజరయ్యారు. గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ పాఠశాల విద్యార్థులతో ముచ్ఛటించారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితంగా దేశానికి స్వాత్యంత్య్రం వచ్చిందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రతి పౌరుడు నిబద్ధతను కలిగిఉండి దేశ అభివృద్ధికి కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Last Updated : Aug 15, 2024, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.