రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండం - ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
AP Weather Updates 2024 : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. దీంతో ఉత్తర తమిళనాడు, కోస్తా ప్రాంతంలో పయనిస్తోంది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రాగల 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. తీరం వెంట గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెప్తున్నారు.
Heavy Rains in AP : ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది.