ETV Bharat / state

"భూమి కోసం డెత్ సర్టిఫికెట్​ సృష్టించారు" - కళ్లెదుటే మనిషి ఉన్నా గోడు పట్టని అధికారులు

Land Grabbing : తన డెత్ సర్టిఫికెట్ సృష్టించి భూమి కాజేశారని కలెక్టరేట్​లో మహిళ ఫిర్యాదు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 8 minutes ago

woman_complaint_in_collectorate
woman_complaint_in_collectorate (ETV Bharat)

Woman Complaint in Collectorate on Land Grabbing: భూమిని కాజేయడానికి చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ సృష్టించారని కలెక్టరేట్​లో జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఓ మహిళ ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మావూరి చిన్నమ్మ వీఆర్​వోగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో వీఆర్​వోగా కావలికి బదిలీ చేయడంతో కొంతకాలం కావలిలో ఉన్నారు. దీనిని అదునుగా చూసుకుని స్థానికంగా ఉన్న శేషమ్మ అనే గ్రామస్థురాలు తన భూమిని కాజేసిందని ఫిర్యాదు చేశారు. మొత్తం 5 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుందని తెలిపారు. కోర్టుకు పోతే నేను చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ పుట్టించి నా కేసును కొట్టేసేలా చేశారని కన్నీటితో వివరించారు.

"భూమి కోసం డెత్ సర్టిఫికెట్​ సృష్టించారు" - కళ్లెదుటే మనిషి ఉన్నా గోడు పట్టని అధికారులు (ETV Bharat)

వేదనతో నాకు కాళ్లు, చేతులు పడిపోయాయని కొర్టుల చుట్టూ తిరగలేక పోతున్నానని వాపోయారు. రెవెన్యూ ఉద్యోగిగా పనిచేసినా తోటి రెవెన్యూ అధికారులు వద్ద మొర పెట్టుకున్నా న్యాయం జరగలేదని తెలిపారు. 2020లోనే నేను చనిపోయినట్లు కేసును తప్పుదోవపట్టించారని ఆమె ఆవేదనగా తెలిపారు. నేను బతికి ఉన్నానా, చనిపోయానా అధికారులు చెప్పాలని, విచారించి నా భూమిని నాకు ఇప్పించాలని చిన్నమ్మ కోరారు.

నేను వీఆర్వోగా చేశారు. ఆ తరువాత కావలికి బదిలీ అయ్యాను. దీనిని అదునుగా చూసుకుని స్థానికంగా ఉన్న శేషమ్మ అనే ఆమె నా భూమిని కబ్జా చేసింది. మొత్తం 5 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. కోర్టుకు పోతే నేను చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ పుట్టించి నా కేసును కొట్టేసేలా చేశారు. నాకు ఆరోగ్యం సరిగా లేక కొర్టుల చుట్టూ తిరగలేక పోతున్నాను. నేను రెవెన్యూ ఉద్యోగిగా పనిచేసినా తోటి రెవెన్యూ అధికారులు వద్ద మొర పెట్టుకున్నా న్యాయం జరగట్లేదు.- చిన్నమ్మ , విశ్రాంత వీఆర్వో

"సినీ నటి కాదంబరి కేసు" - వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు - Kadambari Jethwani Case Updates

సీబీఐ వలలో కాకినాడ కస్టమ్స్ అధికారులు - సికింద్రాబాద్​లో పట్టివేత - CBI Arrest Customs Superintendent

Woman Complaint in Collectorate on Land Grabbing: భూమిని కాజేయడానికి చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ సృష్టించారని కలెక్టరేట్​లో జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఓ మహిళ ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మావూరి చిన్నమ్మ వీఆర్​వోగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో వీఆర్​వోగా కావలికి బదిలీ చేయడంతో కొంతకాలం కావలిలో ఉన్నారు. దీనిని అదునుగా చూసుకుని స్థానికంగా ఉన్న శేషమ్మ అనే గ్రామస్థురాలు తన భూమిని కాజేసిందని ఫిర్యాదు చేశారు. మొత్తం 5 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుందని తెలిపారు. కోర్టుకు పోతే నేను చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ పుట్టించి నా కేసును కొట్టేసేలా చేశారని కన్నీటితో వివరించారు.

"భూమి కోసం డెత్ సర్టిఫికెట్​ సృష్టించారు" - కళ్లెదుటే మనిషి ఉన్నా గోడు పట్టని అధికారులు (ETV Bharat)

వేదనతో నాకు కాళ్లు, చేతులు పడిపోయాయని కొర్టుల చుట్టూ తిరగలేక పోతున్నానని వాపోయారు. రెవెన్యూ ఉద్యోగిగా పనిచేసినా తోటి రెవెన్యూ అధికారులు వద్ద మొర పెట్టుకున్నా న్యాయం జరగలేదని తెలిపారు. 2020లోనే నేను చనిపోయినట్లు కేసును తప్పుదోవపట్టించారని ఆమె ఆవేదనగా తెలిపారు. నేను బతికి ఉన్నానా, చనిపోయానా అధికారులు చెప్పాలని, విచారించి నా భూమిని నాకు ఇప్పించాలని చిన్నమ్మ కోరారు.

నేను వీఆర్వోగా చేశారు. ఆ తరువాత కావలికి బదిలీ అయ్యాను. దీనిని అదునుగా చూసుకుని స్థానికంగా ఉన్న శేషమ్మ అనే ఆమె నా భూమిని కబ్జా చేసింది. మొత్తం 5 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. కోర్టుకు పోతే నేను చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ పుట్టించి నా కేసును కొట్టేసేలా చేశారు. నాకు ఆరోగ్యం సరిగా లేక కొర్టుల చుట్టూ తిరగలేక పోతున్నాను. నేను రెవెన్యూ ఉద్యోగిగా పనిచేసినా తోటి రెవెన్యూ అధికారులు వద్ద మొర పెట్టుకున్నా న్యాయం జరగట్లేదు.- చిన్నమ్మ , విశ్రాంత వీఆర్వో

"సినీ నటి కాదంబరి కేసు" - వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు - Kadambari Jethwani Case Updates

సీబీఐ వలలో కాకినాడ కస్టమ్స్ అధికారులు - సికింద్రాబాద్​లో పట్టివేత - CBI Arrest Customs Superintendent

Last Updated : 8 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.