ETV Bharat / state

క్రోధి నామ సంవత్సరంలో తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి: కిషన్‌రెడ్డి - Ugadi Celebrations at BJP Office

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 5:01 PM IST

Updated : Apr 9, 2024, 10:19 PM IST

Ugadi Celebrations at BJP Office in Hyderabad : హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. క్రోధి నామ సంవత్సరంలో తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు.

Kishan Reddy Extends Ugadi Wishes to Telugu People
Ugadi Celebrations at BJP Office in Hyderabad

క్రోధి నామ సంవత్సరంలో తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి: కిషన్‌రెడ్డి

Ugadi Celebrations at BJP Office in Hyderabad : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా ఏర్పాటుచేశారు. ఉదయం సుదర్శన హోమం నిర్వహించారు. ఈ హోమంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman), ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్​, మహేశ్వర్ రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, సైదిరెడ్డి, విజయరామారావు, పార్టీ శ్రేణులు పాల్గొని కాకునూరి సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం విన్నారు.

తెలుగు వాకిళ్లల్లో క్రోధి నామ సంవత్సరం సందడి - ఉగాది వేళ కళకళలాడుతున్న మార్కెట్లు - Ugadi Festival Celebrations 2024

కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే మళ్లీ వస్తోందని, వెలుగులను ప్రపంచానికి అందించేది భారత దేశమని కాకునూరి సూర్యనారాయణ మూర్తి తన పంచాంగ శ్రవణంలో తెలిపారు. సమాజంలో కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. వర్తమాన ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. కొత్త వ్యాధులు తలెత్తవని, ధరలు నిలకడగా ఉంటాయని తెలిపారు. శ్రీక్రోధి నామ సంవత్సరంలో తెలుగు ప్రజలు(Telugu State People) సంతోషంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆకాంక్షించారు.

Kishan Reddy Extends Ugadi Wishes to Telugu People : తెలుగు ప్రజలు ఎంతో సంతోషంగా ఉగాది పండగను జరుపుకుంటున్నారన్నారు. పంచాంగం ఆధారంగా ప్రతి హిందువు వచ్చే ఉగాది వరకు శుభకార్యాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. క్రోధి నామ సంవత్సరం ప్రాధాన్యత కల్గిందని, ఈ సంవత్సరంలో దేశంలో లోక్​సభ ఎన్నికలు జరగబోతున్నాయన్నారు.

నరేంద్రమోదీ నాయకత్వంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం(BJP Govt) రాబోతుందని పంచాంగ శ్రవణంలో తెలుసుకోవడం జరిగిందన్నారు. దేశం కోసం పని చేస్తున్న నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని కోరిన కిషన్​రెడ్డి, తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

"ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లందరికీ శ్రీక్రోధ నామ ఉగాది శుభాకాంక్షలు. అనాది కాలం నుంచి గ్రామాల్లో, దేవాలయాల దగ్గర పంచాంగ పఠనం చేసే సాంప్రదాయం ఉంది. దాన్నే మనం కూడా కొనసాగిస్తూ, ప్రతియేటా బీజేపీ కార్యాలయంలోనూ నిర్వర్తిస్తున్నాం. అలానే ఈ క్రోధి నామ సంవత్సరంలోనే దేశానికి సంబంధించిన పార్లమెంట్​ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ప్రజలంతా ఆశిస్తున్న విధంగా మళ్లీ బీజేపీ, నరేంద్ర మోదీ నాయకత్వంలో తప్పకుండా వస్తుందనే విషయాన్ని పంచాంగ పఠనంలో కూడా కొంత అర్థంచేసుకోవచ్చు."-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

ఉగాది వేళ కొత్త సంకల్పం తీసుకోవాలి - ప్రకృతితో కలిసి జీవించాలి : వెంకయ్యనాయుడు - Ugadi Fest at Swarna Bharat Trust

వసంత నవరాత్రులు ప్రారంభం- తొమ్మిది రోజులు ఇలా చేస్తే పరిపూర్ణ అనుగ్రహం! - Vasanta Navratri 2024

క్రోధి నామ సంవత్సరంలో తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి: కిషన్‌రెడ్డి

Ugadi Celebrations at BJP Office in Hyderabad : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా ఏర్పాటుచేశారు. ఉదయం సుదర్శన హోమం నిర్వహించారు. ఈ హోమంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman), ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్​, మహేశ్వర్ రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, సైదిరెడ్డి, విజయరామారావు, పార్టీ శ్రేణులు పాల్గొని కాకునూరి సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం విన్నారు.

తెలుగు వాకిళ్లల్లో క్రోధి నామ సంవత్సరం సందడి - ఉగాది వేళ కళకళలాడుతున్న మార్కెట్లు - Ugadi Festival Celebrations 2024

కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే మళ్లీ వస్తోందని, వెలుగులను ప్రపంచానికి అందించేది భారత దేశమని కాకునూరి సూర్యనారాయణ మూర్తి తన పంచాంగ శ్రవణంలో తెలిపారు. సమాజంలో కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. వర్తమాన ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. కొత్త వ్యాధులు తలెత్తవని, ధరలు నిలకడగా ఉంటాయని తెలిపారు. శ్రీక్రోధి నామ సంవత్సరంలో తెలుగు ప్రజలు(Telugu State People) సంతోషంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆకాంక్షించారు.

Kishan Reddy Extends Ugadi Wishes to Telugu People : తెలుగు ప్రజలు ఎంతో సంతోషంగా ఉగాది పండగను జరుపుకుంటున్నారన్నారు. పంచాంగం ఆధారంగా ప్రతి హిందువు వచ్చే ఉగాది వరకు శుభకార్యాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. క్రోధి నామ సంవత్సరం ప్రాధాన్యత కల్గిందని, ఈ సంవత్సరంలో దేశంలో లోక్​సభ ఎన్నికలు జరగబోతున్నాయన్నారు.

నరేంద్రమోదీ నాయకత్వంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం(BJP Govt) రాబోతుందని పంచాంగ శ్రవణంలో తెలుసుకోవడం జరిగిందన్నారు. దేశం కోసం పని చేస్తున్న నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని కోరిన కిషన్​రెడ్డి, తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

"ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లందరికీ శ్రీక్రోధ నామ ఉగాది శుభాకాంక్షలు. అనాది కాలం నుంచి గ్రామాల్లో, దేవాలయాల దగ్గర పంచాంగ పఠనం చేసే సాంప్రదాయం ఉంది. దాన్నే మనం కూడా కొనసాగిస్తూ, ప్రతియేటా బీజేపీ కార్యాలయంలోనూ నిర్వర్తిస్తున్నాం. అలానే ఈ క్రోధి నామ సంవత్సరంలోనే దేశానికి సంబంధించిన పార్లమెంట్​ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ప్రజలంతా ఆశిస్తున్న విధంగా మళ్లీ బీజేపీ, నరేంద్ర మోదీ నాయకత్వంలో తప్పకుండా వస్తుందనే విషయాన్ని పంచాంగ పఠనంలో కూడా కొంత అర్థంచేసుకోవచ్చు."-కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

ఉగాది వేళ కొత్త సంకల్పం తీసుకోవాలి - ప్రకృతితో కలిసి జీవించాలి : వెంకయ్యనాయుడు - Ugadi Fest at Swarna Bharat Trust

వసంత నవరాత్రులు ప్రారంభం- తొమ్మిది రోజులు ఇలా చేస్తే పరిపూర్ణ అనుగ్రహం! - Vasanta Navratri 2024

Last Updated : Apr 9, 2024, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.