ETV Bharat / state

సమ్మక్క - సారలమ్మలను దర్శించుకుని వస్తుండగా ప్రమాదం - బావ, బామ్మర్ది మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 2:20 PM IST

Updated : Feb 23, 2024, 2:59 PM IST

Two Young Men died in Road Accident : సమ్మక్క - సారలమ్మను దర్శనం చేసుకొని, బైక్​పై ఇంటికి తిరుగు ప్రయాణమైన ఇద్దరు యువకులను లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.

men Died in accident at yellandu
Two Young Men died in Road Accident

Two Young Men died in Road Accident : వారిద్దరూ అవివాహితులు. వరుసకు బావ - బావమరుదులు. సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుని సంతోషంగా బైక్​పై ఇంటి బాట పట్టారు. బూడిద లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించేలా చేసింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ బాధిత కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. టేకులపల్లి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముత్యాలంపాడు పంచాయతీ పడమటిగుంపునకు చెందిన మోకాళ్ల బుచ్చయ్య, భద్రమ్మ దంపతుల కుమారుడు భద్రం(32), వాసం సీతారాములు, గంగ దంపతుల కుమారుడు సాయి (23), వీరిద్దరూ బావ-బావమరుదులు. బొగ్గు లారీలపై డ్రైవర్, క్లీనర్లుగా పని చేస్తుంటారు.

ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకునేందుకు గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోళ్లపాడు బస్​స్టాప్ వద్ద వీరి వాహనాన్ని కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్న బూడిద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భద్రం తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కుడి కాలుకు తీవ్ర గాయమైంది. అతణ్ని ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన అతణ్ని ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై విచారణ చేపట్టినట్లు టేకులపల్లి ఎస్సై తెలిపారు.

విషాదం : ప్రమాదంలో చనిపోయిన ఇద్దరివీ పేద కుటుంబాలే. భద్రానికి అక్క, చెల్లి ఉన్నారు. వీరిద్దరికీ వివాహాలయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడు విగత జీవిగా మారటంతో భద్రం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో యువకుడు సాయికి వివాహమైన అక్క ఉంది.

Auto Road accident in khammam : ఇదికాగా మరో ఘటనలో ఆటో బోల్తా పడి పలువురికి తీవ్ర గాయలయ్యాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్ద కోరుకొండి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో, 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో పల్టీ కొట్టింది. తల్లాడ మండలం కుర్నవల్లి నుంచి సుమారు 15 మంది కూలీలు మిర్చి కోతకు ఆంధ్రప్రదేశ్‌లోని ఊటుకూరుకి వెళ్తుండగా ప్రమాదం చోటుచోసుకుంది. ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలు అవగా ఆరుగురిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిని కల్లూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి - దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఆటో, లారీ ఢీ- పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- అక్కడికక్కడే 9మంది మృతి

Two Young Men died in Road Accident : వారిద్దరూ అవివాహితులు. వరుసకు బావ - బావమరుదులు. సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకుని సంతోషంగా బైక్​పై ఇంటి బాట పట్టారు. బూడిద లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించేలా చేసింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ బాధిత కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. టేకులపల్లి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముత్యాలంపాడు పంచాయతీ పడమటిగుంపునకు చెందిన మోకాళ్ల బుచ్చయ్య, భద్రమ్మ దంపతుల కుమారుడు భద్రం(32), వాసం సీతారాములు, గంగ దంపతుల కుమారుడు సాయి (23), వీరిద్దరూ బావ-బావమరుదులు. బొగ్గు లారీలపై డ్రైవర్, క్లీనర్లుగా పని చేస్తుంటారు.

ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకునేందుకు గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోళ్లపాడు బస్​స్టాప్ వద్ద వీరి వాహనాన్ని కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపు వెళ్తున్న బూడిద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భద్రం తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి కుడి కాలుకు తీవ్ర గాయమైంది. అతణ్ని ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన అతణ్ని ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై విచారణ చేపట్టినట్లు టేకులపల్లి ఎస్సై తెలిపారు.

విషాదం : ప్రమాదంలో చనిపోయిన ఇద్దరివీ పేద కుటుంబాలే. భద్రానికి అక్క, చెల్లి ఉన్నారు. వీరిద్దరికీ వివాహాలయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడు విగత జీవిగా మారటంతో భద్రం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో యువకుడు సాయికి వివాహమైన అక్క ఉంది.

Auto Road accident in khammam : ఇదికాగా మరో ఘటనలో ఆటో బోల్తా పడి పలువురికి తీవ్ర గాయలయ్యాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్ద కోరుకొండి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో, 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో పల్టీ కొట్టింది. తల్లాడ మండలం కుర్నవల్లి నుంచి సుమారు 15 మంది కూలీలు మిర్చి కోతకు ఆంధ్రప్రదేశ్‌లోని ఊటుకూరుకి వెళ్తుండగా ప్రమాదం చోటుచోసుకుంది. ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలు అవగా ఆరుగురిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిని కల్లూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి - దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఆటో, లారీ ఢీ- పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- అక్కడికక్కడే 9మంది మృతి

Last Updated : Feb 23, 2024, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.