ETV Bharat / state

బ్లాక్​లో ఐపీఎల్ టికెట్లు - క్రికెట్ లవర్స్​ ఇలాంటి వాళ్లతో జరభద్రం - IPL TICKETS SALE IN BLACK

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 11:46 AM IST

IPL 2024 Tickets Sale in Black Hyderabad : బ్లాక్​లో ఐపీఎల్​ 2024 టికెట్లను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.5 లక్షలు విలువ చేసే 100 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గురువారం జరిగిన హైదరాబాద్​ వర్సెస్​ బెంగళూరు మ్యాచ్​ నకిలీ టికెట్లు ఇన్​స్టాగ్రామ్​లో చక్కర్లు కొట్టాయి.

IPL 2024 Black Tickets in Hyderabad
IPL 2024 Black Tickets in Hyderabad

IPL 2024 Black Tickets in Hyderabad : ఐపీఎల్​ అంటేనే మస్త్​ మజా ఉండే అతి పెద్ద క్రికెట్​ క్రీడా పండగ. ఐపీఎల్​ సీజన్​ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు ముందుగా షెడ్యూల్​ చూస్తారు. ఎందుకంటే మ్యాచ్​లు ఫ్రాంఛైజీల హోం గ్రౌండ్​లలో ఆడుతున్నారేమోనని. తమ అభిమాన క్రికెటర్లను చూడాలని, ప్రత్యక్షంగా చూడాలని సగటు అభిమానులు అనుకుంటారు. అయితే వాటిలోనూ కొన్ని రసవత్తరమైన మ్యాచ్​లను క్రికెట్​ అభిమానులు నేరుగా స్టేడియాలకు వెళ్లి చూడాలని కంకణం కట్టుకుని ఉంటారు.

టికెట్​ ఖరీదు ఎంత ఎక్కువైనా కొని స్టేడియంలోకి వెళ్లి ఆటను వీక్షించాలని భావిస్తారు. ప్రేక్షకుల సరదాని కొందరు సైబర్​ నేరగాళ్లు ఆసరాగా తీసుకొని నకిలీ టికెట్లను సృష్టించి అమ్ముతున్నారు. ఇంకొందరేమో అధిక ధరలకు ఐపీఎల్​ టికెట్లను విక్రయించి కొందరు అమ్ముతున్నారు. గురువారం జరిగిన ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ టికెట్లను అధిక ధరకు బ్లాక్​లో విక్రయించిన ఇద్దరు వ్యక్తులను ఉత్తర మండలం టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన 100 ఐపీఎల్​ టికెట్లు, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్​కు ఉన్న విపరీతమైన డిమాండ్​ నేపథ్యంలో అక్రమ మార్గాల్లో టికెట్లను కొని అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు.

IPL మ్యాచ్ పవర్ ప్లే, స్ట్రాటెజిక్ టైమౌట్​- క్రికెట్ నేర్పే బిజినెస్​ పాఠాలివే!

క్రికెట్​ వాట్సాప్​ గ్రూపులు క్రియేట్​ చేసి మరీ : క్రికెట్​ వాట్సాప్​ గ్రూపులను పెట్టి సామాజిక మాధ్యమాల ద్వారా అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సన్​రైజర్స్​ హైదరాబాద్​ వర్సెస్​ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్​కు సంబంధించి టికెట్లు విక్రయిస్తుండగా వారిని పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన రమణ, హైదరాబాద్​కు చెందిన శామ్యూల్​ సుశీల్​లను అరెస్టు చేసి గోపాల్​పురం పోలీసులకు అప్పగించారు.

ఇన్​స్టాగ్రామ్​లో నకిలీ టికెట్లు ప్రత్యక్షం : మరోవైపు గురువారం రోజున హైదరాబాద్​ వర్సెస్​ బెంగళూరు(SRH vs RCB) మ్యాచ్​కు విపరీతమైన డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని టికెట్లు ఉన్నాయంటూ ఇన్​స్ట్రాగ్రామ్​లో రీల్స్​, ఫొటోలను సైబర్​ కేటుగాళ్లు ఉంచి లింక్​ను ఓపెన్​ చేయమని ఉచిత సలహా ఇచ్చారు. ఆ లింక్​ పైన క్లిక్​ చేస్తే వెంటనే వ్యక్తిగత సమాచారం, బ్యాంకులోని డబ్బులు మాయమైపోయాయి. అయితే అధికారులు ఇలాంటి మోసాలపై ముందే అవగాహన కల్పించినా కొందరు మోసపోయారు. హైదరాబాద్​ ఉప్పల్​ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్​పై రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు 35 పరుగుల తేడాతో గెలుపొందింది.

స్టేడియంలో దారుణంగా కొట్టుకున్న రోహిత్ - హార్దిక్ ఫ్యాన్స్ - వీడియో వైరల్ - IPL 2024 MI VS GT

'రెండో గెలుపునకు 30 రోజులు, మూడోది ఎప్పుడో?'- ఆర్సీబీ విజయంపై ఫన్నీ మీమ్స్​

IPL 2024 Black Tickets in Hyderabad : ఐపీఎల్​ అంటేనే మస్త్​ మజా ఉండే అతి పెద్ద క్రికెట్​ క్రీడా పండగ. ఐపీఎల్​ సీజన్​ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు ముందుగా షెడ్యూల్​ చూస్తారు. ఎందుకంటే మ్యాచ్​లు ఫ్రాంఛైజీల హోం గ్రౌండ్​లలో ఆడుతున్నారేమోనని. తమ అభిమాన క్రికెటర్లను చూడాలని, ప్రత్యక్షంగా చూడాలని సగటు అభిమానులు అనుకుంటారు. అయితే వాటిలోనూ కొన్ని రసవత్తరమైన మ్యాచ్​లను క్రికెట్​ అభిమానులు నేరుగా స్టేడియాలకు వెళ్లి చూడాలని కంకణం కట్టుకుని ఉంటారు.

టికెట్​ ఖరీదు ఎంత ఎక్కువైనా కొని స్టేడియంలోకి వెళ్లి ఆటను వీక్షించాలని భావిస్తారు. ప్రేక్షకుల సరదాని కొందరు సైబర్​ నేరగాళ్లు ఆసరాగా తీసుకొని నకిలీ టికెట్లను సృష్టించి అమ్ముతున్నారు. ఇంకొందరేమో అధిక ధరలకు ఐపీఎల్​ టికెట్లను విక్రయించి కొందరు అమ్ముతున్నారు. గురువారం జరిగిన ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ టికెట్లను అధిక ధరకు బ్లాక్​లో విక్రయించిన ఇద్దరు వ్యక్తులను ఉత్తర మండలం టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన 100 ఐపీఎల్​ టికెట్లు, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్​కు ఉన్న విపరీతమైన డిమాండ్​ నేపథ్యంలో అక్రమ మార్గాల్లో టికెట్లను కొని అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు.

IPL మ్యాచ్ పవర్ ప్లే, స్ట్రాటెజిక్ టైమౌట్​- క్రికెట్ నేర్పే బిజినెస్​ పాఠాలివే!

క్రికెట్​ వాట్సాప్​ గ్రూపులు క్రియేట్​ చేసి మరీ : క్రికెట్​ వాట్సాప్​ గ్రూపులను పెట్టి సామాజిక మాధ్యమాల ద్వారా అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సన్​రైజర్స్​ హైదరాబాద్​ వర్సెస్​ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్​కు సంబంధించి టికెట్లు విక్రయిస్తుండగా వారిని పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన రమణ, హైదరాబాద్​కు చెందిన శామ్యూల్​ సుశీల్​లను అరెస్టు చేసి గోపాల్​పురం పోలీసులకు అప్పగించారు.

ఇన్​స్టాగ్రామ్​లో నకిలీ టికెట్లు ప్రత్యక్షం : మరోవైపు గురువారం రోజున హైదరాబాద్​ వర్సెస్​ బెంగళూరు(SRH vs RCB) మ్యాచ్​కు విపరీతమైన డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని టికెట్లు ఉన్నాయంటూ ఇన్​స్ట్రాగ్రామ్​లో రీల్స్​, ఫొటోలను సైబర్​ కేటుగాళ్లు ఉంచి లింక్​ను ఓపెన్​ చేయమని ఉచిత సలహా ఇచ్చారు. ఆ లింక్​ పైన క్లిక్​ చేస్తే వెంటనే వ్యక్తిగత సమాచారం, బ్యాంకులోని డబ్బులు మాయమైపోయాయి. అయితే అధికారులు ఇలాంటి మోసాలపై ముందే అవగాహన కల్పించినా కొందరు మోసపోయారు. హైదరాబాద్​ ఉప్పల్​ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్​పై రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు 35 పరుగుల తేడాతో గెలుపొందింది.

స్టేడియంలో దారుణంగా కొట్టుకున్న రోహిత్ - హార్దిక్ ఫ్యాన్స్ - వీడియో వైరల్ - IPL 2024 MI VS GT

'రెండో గెలుపునకు 30 రోజులు, మూడోది ఎప్పుడో?'- ఆర్సీబీ విజయంపై ఫన్నీ మీమ్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.