ETV Bharat / state

ఏంటీ?? డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తరహాలో డ్రగ్ టెస్టులా? - అదీ కాలేజీల్లోనా? - DRUG TESTS IN COLLEGES IN TELANGANA

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 2:10 PM IST

TGNAB on Drug Tests in Educational Institutions : మాదకద్రవ్యాల కట్టడికి టీజీన్యాబ్‌ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా యువత, విద్యార్ధులు మాదకద్రవ్యాల కోరల్లో చిక్కుకుని తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్నారు. కొన్ని నెలల వ్యవధిలో దాదాపు 12 విద్యాసంస్థల్లోకి మత్త పదార్ధాలు చేరినట్లు పోలీసులు ఆధారాలతో నిరూపించారు. యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, కార్పొరేట్‌ సంసల్లో ఆకస్మికంగా డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. క్షేత్రసాయిలో సాధ్యసాధ్యాలను చర్చించి వీలైంనంత త్వరితగతిన అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

TGNAB on Drugs in IT Companies
TGNAB on Drugs in Educational Institutions (ETV Bharat)

TGNAB Focus On Drugs Supply : మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తోంది. మాదకద్రవ్యాలను పూర్తిగా నియంత్రించేందుకు రాష్ట్రం నలువైపులా పోలీసులు, ఎక్సైజ్, నార్కొటిక్స్‌ బ్యూరో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. ఒక వైపు దాడులు నిర్వహిస్తునే మరో వైపు విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల్లో ఆకస్మిక డ్రగ్స్‌ పరీక్షలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా టీజీన్యాబ్‌ చేపట్టిన తనిఖీల్లో రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన వారిని గుర్తించి కేసు నమోదు చేశారు.

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా జనవరి ఒకటిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తరహాలో డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు. పబ్‌ల్లో స్నిఫర్‌ డాగ్స్‌తో తనిఖీలు చేపడుతున్నారు. తమ వద్ద ఉన్న కిట్స్‌తో వేడుకల్లో పాల్గొన్న వారి మూత్ర నమూనాలు తీసుకొని క్షణాల్లో డ్రగ్స్‌ తీసుకున్నారా, లేదా అని నిర్థారించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే తరహాలో విద్యాసంస్థల్లో మత్తు ఆనవాళ్లు పసిగట్టే ప్రయత్నం చేయనున్నారు. విద్యార్థుల తరగతులకు ఇబ్బంది కలగకుండా అత్యంత గోప్యంగా పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.

మత్తువలలో విద్యార్థులు : గంజాయి వినియోగించే వారిలో 4 వారాలు, కొకైన్, హెరాయిన్‌ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌ తీసుకునేవారి శరీరంలో 3 నెలల వరకు డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉంటాయి. పోలీసులు ఆకస్మికంగా జరిపే వైద్యపరీక్షల్లో మత్తుకు బానిసలైన వారిని గుర్తించి పునరావాస కేంద్రానికి తరలించి సాధారణ స్థితికి తీసుకురావచ్చని పోలీసు ఉన్నతాధికారుల భావిస్తున్నారు. విద్యాసంస్థల్లో మత్తుజాడలు చాపకిందనీరులా విద్యార్థులను కమ్మేశాయి. ఇటీవల కాలంలో టీజీన్యాబ్‌ పోలీసుల దాడుల్లో ఈ విషయం స్పష్టమైంది. అంతర్జాతీయ ప్రమాణాలున్నాయంటూ ఘనంగా ప్రకటించిన విద్యాసంస్థల్లో వందలకొద్దీ పిల్లలు మాదకద్రవ్యాలకు అలవాటుపడినట్టు పోలీసుల తనిఖీల్లో బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

చీరలు, గాజులతో డ్రగ్స్​ రవాణా : హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లోని పలు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులపై పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించడం ఆందోళన కలిగిస్తోంది. సిలబస్‌ పూర్తిచేయటం, మార్కులు, ర్యాంకులపై శ్రద్ధ చూపుతున్న ఆయా సంస్థల నిర్వాహకులు విద్యార్ధుల కదలికలను పసిగట్టలేకపోతున్నారనే విమర్శులు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కదలికలను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. రాజస్థాన్, ముంబయి, గోవా, బెంగళూరు నుంచి ప్రైవేటు బస్సులు, కొరియర్‌ సంస్థల ద్వారా నగరానికి డ్రగ్స్‌ చేరుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పచారీ సరుకులు, చీరలు, గాజులు, సౌందర్య ఉత్పత్తుల మధ్య డ్రగ్స్‌ను ఉంచి రవాణా చేస్తున్నట్టు నిర్ధారించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రైవేట్‌ బస్సుల నిర్వాహకులు, కొరియర్‌ సంస్థలకు టీజీన్యాబ్‌ మార్గదర్శకాలు జారీచేయనుంది. అంతరాష్ట్ర సర్వీసులు నిర్వహించే ప్రైవేట్ బస్సు సంస్థలు నిషేధిత పదార్ధాలు, మాదకద్రవ్యాలు గుర్తించేందుకు క్షుణ్నంగా తనిఖీలు చేయడం ఏదైనా అనుమానాస్పద వస్తువులు గుర్తిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చేలా వారికి అవగాహన కల్పించనున్నారు.

డ్రగ్స్ సరఫరాపై టీజీన్యాబ్‌ ఉక్కుపాదం - అమ్మినా, కొన్నా కఠిన చర్యలు - TGNAB Focus On Drugs In Hyderabad

జోరా పబ్​పై నార్కోటిక్స్ దాడులు - 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

TGNAB Focus On Drugs Supply : మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తోంది. మాదకద్రవ్యాలను పూర్తిగా నియంత్రించేందుకు రాష్ట్రం నలువైపులా పోలీసులు, ఎక్సైజ్, నార్కొటిక్స్‌ బ్యూరో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు. ఒక వైపు దాడులు నిర్వహిస్తునే మరో వైపు విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల్లో ఆకస్మిక డ్రగ్స్‌ పరీక్షలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. తాజాగా టీజీన్యాబ్‌ చేపట్టిన తనిఖీల్లో రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన వారిని గుర్తించి కేసు నమోదు చేశారు.

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా జనవరి ఒకటిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తరహాలో డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు. పబ్‌ల్లో స్నిఫర్‌ డాగ్స్‌తో తనిఖీలు చేపడుతున్నారు. తమ వద్ద ఉన్న కిట్స్‌తో వేడుకల్లో పాల్గొన్న వారి మూత్ర నమూనాలు తీసుకొని క్షణాల్లో డ్రగ్స్‌ తీసుకున్నారా, లేదా అని నిర్థారించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే తరహాలో విద్యాసంస్థల్లో మత్తు ఆనవాళ్లు పసిగట్టే ప్రయత్నం చేయనున్నారు. విద్యార్థుల తరగతులకు ఇబ్బంది కలగకుండా అత్యంత గోప్యంగా పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.

మత్తువలలో విద్యార్థులు : గంజాయి వినియోగించే వారిలో 4 వారాలు, కొకైన్, హెరాయిన్‌ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌ తీసుకునేవారి శరీరంలో 3 నెలల వరకు డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉంటాయి. పోలీసులు ఆకస్మికంగా జరిపే వైద్యపరీక్షల్లో మత్తుకు బానిసలైన వారిని గుర్తించి పునరావాస కేంద్రానికి తరలించి సాధారణ స్థితికి తీసుకురావచ్చని పోలీసు ఉన్నతాధికారుల భావిస్తున్నారు. విద్యాసంస్థల్లో మత్తుజాడలు చాపకిందనీరులా విద్యార్థులను కమ్మేశాయి. ఇటీవల కాలంలో టీజీన్యాబ్‌ పోలీసుల దాడుల్లో ఈ విషయం స్పష్టమైంది. అంతర్జాతీయ ప్రమాణాలున్నాయంటూ ఘనంగా ప్రకటించిన విద్యాసంస్థల్లో వందలకొద్దీ పిల్లలు మాదకద్రవ్యాలకు అలవాటుపడినట్టు పోలీసుల తనిఖీల్లో బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

చీరలు, గాజులతో డ్రగ్స్​ రవాణా : హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లోని పలు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులపై పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించడం ఆందోళన కలిగిస్తోంది. సిలబస్‌ పూర్తిచేయటం, మార్కులు, ర్యాంకులపై శ్రద్ధ చూపుతున్న ఆయా సంస్థల నిర్వాహకులు విద్యార్ధుల కదలికలను పసిగట్టలేకపోతున్నారనే విమర్శులు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కదలికలను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. రాజస్థాన్, ముంబయి, గోవా, బెంగళూరు నుంచి ప్రైవేటు బస్సులు, కొరియర్‌ సంస్థల ద్వారా నగరానికి డ్రగ్స్‌ చేరుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పచారీ సరుకులు, చీరలు, గాజులు, సౌందర్య ఉత్పత్తుల మధ్య డ్రగ్స్‌ను ఉంచి రవాణా చేస్తున్నట్టు నిర్ధారించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రైవేట్‌ బస్సుల నిర్వాహకులు, కొరియర్‌ సంస్థలకు టీజీన్యాబ్‌ మార్గదర్శకాలు జారీచేయనుంది. అంతరాష్ట్ర సర్వీసులు నిర్వహించే ప్రైవేట్ బస్సు సంస్థలు నిషేధిత పదార్ధాలు, మాదకద్రవ్యాలు గుర్తించేందుకు క్షుణ్నంగా తనిఖీలు చేయడం ఏదైనా అనుమానాస్పద వస్తువులు గుర్తిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చేలా వారికి అవగాహన కల్పించనున్నారు.

డ్రగ్స్ సరఫరాపై టీజీన్యాబ్‌ ఉక్కుపాదం - అమ్మినా, కొన్నా కఠిన చర్యలు - TGNAB Focus On Drugs In Hyderabad

జోరా పబ్​పై నార్కోటిక్స్ దాడులు - 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.