ETV Bharat / state

గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్ - ఆ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌ - పరీక్షలకు ఎట్టకేలకు తొలగిన అడ్డంకి - యథావిధిగా మెయిన్స్ పరీక్షలు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2024, 11:10 AM IST

Updated : Oct 15, 2024, 12:38 PM IST

The Telangana High Court Dismissed Group-1 Petitions
The Telangana High Court Dismissed Group-1 Petitions (ETV Bharat)

Telangana High Court Dismissed Group-1 Petitions : గ్రూప్‌-1 పరీక్షలకు అడ్డంకి తొలగింది. పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్‌ జరగనున్నాయి. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది 'కీ'లో సరైన జవాబులు ఇవ్వలేదని, ఏడు ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరిన పిటిషనర్లు దాఖలు చేయగా తాజాగా వాటిని హైకోర్టు కొట్టివేసింది.

నోటిఫికేషన్‌ చెల్లదంటూ, సమాధానాలు తప్పంటూ పిటిషన్లు : 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని వాటిని సవరించాలన్న అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో గ్రూప్‌1 నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తుచేశారు. వందల పోస్టులను భర్తీ చేయడానికి నిర్వహిస్తున్న పరీక్షలకు లక్షల మంది ప్రిలిమ్స్‌ రాశారని, టీజీపీఎస్సీ వెలువరించిన తుది 'కీ'లో కూడా 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ ప్రశ్నలను తొలగించి తాజా 'కీ'ని రూపొందించి అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని కోరారు.

గ్రూప్1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ హాల్ టికెట్లు విడుదల

వాళ్ల ఆమోదం తర్వాతే ఫలితాలు : గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ రాసిన 3 లక్షల మంది అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరగా 721 మంది భౌతికంగా, 6470 అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించినట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అభ్యంతరాలన్నింటినీ సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపించి వారి ఆమోదం తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు.

ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పులు కాదు : ప్రస్తుతం పిటిషన్లు దాఖలు చేసిన అయిదుగురిలో ఒక్కరు మాత్రమే కమిషన్‌కు అభ్యంతరాలు తెలిపారని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పులు కాదని చెప్పారు. త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నందున ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్రం నష్టం వాటిల్లుతుందన్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం టీజీపీఎస్సీకి ఉంటుందని న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనల అనంతరం పిటిషన్లను కొట్టివేసూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

గ్రూప్‌-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్‌ - పరీక్షల షెడ్యూల్​ విడుదల

తుది తీర్పునకు లోబడే గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ : హైకోర్టు - TELANGANA HC ON GROUP 4 RESERVATION

Telangana High Court Dismissed Group-1 Petitions : గ్రూప్‌-1 పరీక్షలకు అడ్డంకి తొలగింది. పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్‌ జరగనున్నాయి. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది 'కీ'లో సరైన జవాబులు ఇవ్వలేదని, ఏడు ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరిన పిటిషనర్లు దాఖలు చేయగా తాజాగా వాటిని హైకోర్టు కొట్టివేసింది.

నోటిఫికేషన్‌ చెల్లదంటూ, సమాధానాలు తప్పంటూ పిటిషన్లు : 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని వాటిని సవరించాలన్న అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో గ్రూప్‌1 నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తుచేశారు. వందల పోస్టులను భర్తీ చేయడానికి నిర్వహిస్తున్న పరీక్షలకు లక్షల మంది ప్రిలిమ్స్‌ రాశారని, టీజీపీఎస్సీ వెలువరించిన తుది 'కీ'లో కూడా 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ ప్రశ్నలను తొలగించి తాజా 'కీ'ని రూపొందించి అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని కోరారు.

గ్రూప్1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ హాల్ టికెట్లు విడుదల

వాళ్ల ఆమోదం తర్వాతే ఫలితాలు : గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ రాసిన 3 లక్షల మంది అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరగా 721 మంది భౌతికంగా, 6470 అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించినట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అభ్యంతరాలన్నింటినీ సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపించి వారి ఆమోదం తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు.

ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పులు కాదు : ప్రస్తుతం పిటిషన్లు దాఖలు చేసిన అయిదుగురిలో ఒక్కరు మాత్రమే కమిషన్‌కు అభ్యంతరాలు తెలిపారని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పులు కాదని చెప్పారు. త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నందున ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్రం నష్టం వాటిల్లుతుందన్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం టీజీపీఎస్సీకి ఉంటుందని న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనల అనంతరం పిటిషన్లను కొట్టివేసూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

గ్రూప్‌-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్‌ - పరీక్షల షెడ్యూల్​ విడుదల

తుది తీర్పునకు లోబడే గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ : హైకోర్టు - TELANGANA HC ON GROUP 4 RESERVATION

Last Updated : Oct 15, 2024, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.