ETV Bharat / state

'ఇంతటి కీలకమైన విషయంలో ఇంత నిర్లక్ష్యమా - కౌంటర్ దాఖలు చేసే వరకు రోజుకు రూ.1000 కట్టండి' - High Court Judgment on IAMC

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 9:31 AM IST

Telangana High Court On IAMC : ఐఏఎంసీకి భూ కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రభుత్వ కౌంటర్​ దాఖలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, కౌంటరు దాఖలు చేసే వరకు రోజుకు రూ.1000 చొప్పున చెల్లించాలని సర్కారును ఆదేశించింది.

HC Discontent Of State Govt Counter Issue
Telangana High Court On IAMC (ETV Bharat)

HC Discontent Of State Govt Counter Issue : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ఐఏఎంసీకి భూ కేటాయింపు, నిధుల కేటాయింపు, ప్రభుత్వ కేసులను ఆర్బిట్రేషన్ కేంద్రానికి పంపాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటరు దాఖలు చేసే దాకా రోజుకు రూ.వెయ్యి చొప్పున రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌లో 3.70 ఎకరాలను ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మేడియేషన్ సెంటర్​కు కేటాయిస్తూ 2021 డిసెంబరు 26న ప్రభుత్వం జీవో జారీ చేసింది.

దీంతో పాటు ఏడాదికి రూ.3 కోట్ల ఆర్థిక సాయం చేస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ, వ్యక్తిగత హోదాలో న్యాయవాది కోటి రఘునాథరావు, మరో న్యాయవాది ఏ వెంకట్రామిరెడ్డిలు గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఐఏఎంసీ తరఫు న్యాయవాది ఎం.అభినయ్ రెడ్డి కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. ఇతర ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శుల తరఫున కౌంటరు దాఖలు చేయడానికి, మరికొంత గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంతటి కీలకమైన విషయంలో కౌంటరు ఎందుకు దాఖలు చేయరని ప్రశ్నించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 20కి వాయిదా వేస్తూ, అప్పటిలోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటరు దాఖలు చేసే రోజు వరకు రోజుకు రూ.1000 చొప్పున రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఫార్మాసిటీ భూ సేకరణ ప్రక్రియపై విచారణ 2 వారాలకు వాయిదా : మరోవైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఫార్మాసిటీ భూ సేకరణ ప్రక్రియపై, ప్రభుత్వం అప్పీలుపై విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఫార్మాసిటీ భూ సేకరణ ప్రక్రియపై తాజాగా అభ్యంతరాలు సేకరించి కొనసాగించాలంటూ, సింగిల్ జడ్జి గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియలో 2013 నాటి భూసేకరణ చట్టం, పునరావాస, పునర్నిర్మాణ పథకాలకు సంబంధించిన నిబంధనలను సవాల్ చేస్తూ యాచారం మండలం మేడిగడ్డ గ్రామానికి చెందిన 72 మంది రైతులు పిటిషన్ దాఖలు చేశారు. భూసేకరణ ప్రక్రియలో పరిహారాన్ని ప్రకటిస్తూ జారీ చేసిన డిక్లరేషన్స్ నోటీసుపై అభ్యంతరాలు స్వీకరించలేదని పేర్కొన్నారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి, భూ సేకరణ ప్రక్రియను పూర్తి స్థాయిలో రద్దు చేయకుండా పరిహారం ప్రకటన నుంచి నిలిపివేస్తూ 2023 ఆగస్టుల్లో తీర్పు వెలువరించారు.

HC Discontent Of State Govt Counter Issue : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ఐఏఎంసీకి భూ కేటాయింపు, నిధుల కేటాయింపు, ప్రభుత్వ కేసులను ఆర్బిట్రేషన్ కేంద్రానికి పంపాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటరు దాఖలు చేసే దాకా రోజుకు రూ.వెయ్యి చొప్పున రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌లో 3.70 ఎకరాలను ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మేడియేషన్ సెంటర్​కు కేటాయిస్తూ 2021 డిసెంబరు 26న ప్రభుత్వం జీవో జారీ చేసింది.

దీంతో పాటు ఏడాదికి రూ.3 కోట్ల ఆర్థిక సాయం చేస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ, వ్యక్తిగత హోదాలో న్యాయవాది కోటి రఘునాథరావు, మరో న్యాయవాది ఏ వెంకట్రామిరెడ్డిలు గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఐఏఎంసీ తరఫు న్యాయవాది ఎం.అభినయ్ రెడ్డి కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. ఇతర ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శుల తరఫున కౌంటరు దాఖలు చేయడానికి, మరికొంత గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంతటి కీలకమైన విషయంలో కౌంటరు ఎందుకు దాఖలు చేయరని ప్రశ్నించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 20కి వాయిదా వేస్తూ, అప్పటిలోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటరు దాఖలు చేసే రోజు వరకు రోజుకు రూ.1000 చొప్పున రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఫార్మాసిటీ భూ సేకరణ ప్రక్రియపై విచారణ 2 వారాలకు వాయిదా : మరోవైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఫార్మాసిటీ భూ సేకరణ ప్రక్రియపై, ప్రభుత్వం అప్పీలుపై విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఫార్మాసిటీ భూ సేకరణ ప్రక్రియపై తాజాగా అభ్యంతరాలు సేకరించి కొనసాగించాలంటూ, సింగిల్ జడ్జి గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియలో 2013 నాటి భూసేకరణ చట్టం, పునరావాస, పునర్నిర్మాణ పథకాలకు సంబంధించిన నిబంధనలను సవాల్ చేస్తూ యాచారం మండలం మేడిగడ్డ గ్రామానికి చెందిన 72 మంది రైతులు పిటిషన్ దాఖలు చేశారు. భూసేకరణ ప్రక్రియలో పరిహారాన్ని ప్రకటిస్తూ జారీ చేసిన డిక్లరేషన్స్ నోటీసుపై అభ్యంతరాలు స్వీకరించలేదని పేర్కొన్నారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి, భూ సేకరణ ప్రక్రియను పూర్తి స్థాయిలో రద్దు చేయకుండా పరిహారం ప్రకటన నుంచి నిలిపివేస్తూ 2023 ఆగస్టుల్లో తీర్పు వెలువరించారు.

అనురాగ్ యూనివర్సిటీ వ్యవహారంలో చట్ట ప్రకారమే ముందుకెళ్లండి : హైడ్రా అధికారులకు హైకోర్టు ఆదేశం - High Court On Anurag Colleges

ఇకపై రెవెన్యూ నోటీసులే షోకాజ్‌ నోటీసులు - హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు - TG HIGH COURT ON REVENUE NOTICES

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.