ETV Bharat / state

'తెలంగాణ అభివృద్ధికి సహకరించండి' - ప్రధాని మోదీకి మరోసారి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ - CM REVANTH MEETS PM MODI TODAY

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 12:06 PM IST

Updated : Jul 4, 2024, 6:30 PM IST

CM Revanth Reddy Meets PM Modi Today : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హస్తినలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమస్యలు, విభజన హామీలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణికి నేరుగా బొగ్గు గనులు కేటాయించడం నుంచి, నవోదయ విద్యాలయాలు, బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

CM Revanth Reddy Delhi Tour
CM Revanth Reddy Delhi Tour (ETV Bharat)

CM Revanth Reddy Meets PM Modi in Delhi Today : సింగ‌రేణి ప‌రిధిలోని బొగ్గు గ‌నుల‌ను సింగ‌రేణికే కేటాయించాల‌ని, ప్ర‌స్తుతం వేలంలో పెట్టిన శ్రావ‌ణప‌ల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొల‌గించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌భుత్వ రంగంలో ఉన్న సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్‌)లో తెలంగాణ ప్ర‌భుత్వానికి 51 శాతం, కేంద్ర ప్ర‌భుత్వానికి 41 శాతం వాటాలున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. గనులు, ఖ‌నిజాభివృద్ధి నియంత్ర‌ణ చ‌ట్టంలోని (ఎంఎండీఆర్‌) సెక్ష‌న్ 11ఏ/17 (ఏ) (2) ప్ర‌కారం వేలం జాబితా నుంచి శ్రావ‌ణ‌ప‌ల్లి గ‌నిని తొల‌గించాల‌ని, అదే సెక్ష‌న్ ప్ర‌కారం గోదావ‌రి లోయ‌ బొగ్గు నిల్వ‌ల క్షేత్రం ప‌రిధిలోని కోయ‌గూడెం, స‌త్తుప‌ల్లి బ్లాక్ 3 గ‌నుల‌నూ సింగ‌రేణికే కేటాయించాల‌ని మోదీని రేవంత్ రెడ్డి కోరారు.

రాష్ట్రంలోని విద్యుదుత్ప‌త్తి కేంద్రాల అవ‌స‌రాలు తీర్చేందుకు ఈ గ‌నుల కేటాయింపు కీల‌కమైనందున, సింగ‌రేణికే వాటిని కేటాయించాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. దిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఆయ‌న నివాసంలో గురువారం మ‌ధ్యాహ్నం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌లిశారు. బొగ్గు గ‌నుల కేటాయింపు, ఐటీఐఆర్ పున‌రుద్ధ‌ర‌ణ‌, ర‌క్ష‌ణ భూముల కేటాయింపు, రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలపై మోదీతో ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు. ప్ర‌ధాన‌మంత్రి నివాసానికి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సుమారు గంట‌సేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై ప్ర‌ధాన‌మంత్రితో చ‌ర్చించారు. ప్ర‌ధాన‌మంత్రితో ముఖ్య‌మంత్రి భేటీలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పాల్గొన్నారు.

హైద‌రాబాద్‌కు ఐటీఐఆర్ పున‌రుద్ధ‌రించాలి : 2010 సంవ‌త్సరంలో నాటి యూపీఏ ప్ర‌భుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు స‌మాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్‌) మంజూరు చేసింద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఐటీ రంగంలో నూత‌న కంపెనీలు, డెవ‌ల‌ప‌ర్ల‌ను ప్రోత్స‌హించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించింద‌న్నారు. 2014 త‌ర్వాత ఐటీఐఆర్ ముందుకు సాగ‌లేద‌ని, హైద‌రాబాద్‌కు ఐటీఐఆర్ పున‌రుద్ధ‌రించాల‌ని పీఎంను సీఎం కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి​ రిక్వెస్ట్​ - స్మార్ట్​ సిటీస్​ మిషన్​ గడువు పొడిగించిన కేంద్రం - extend smart cities mission

ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకున్నా, ఇప్పటి వరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ దృష్టికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వెంట‌నే హైద‌రాబాద్‌లో ఐఐఎం మంజూరు చేయాలని, ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సరిపడా భూమి అందుబాటులో ఉంద‌ని తెలిపారు. సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో కాకుండా మ‌రెక్క‌డైనా ఐఐఎం ఏర్పాటు చేస్తామ‌న్నా ప్ర‌త్యామ్నాయంగా భూ కేటాయింపున‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి : రాష్ట్ర పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్ట‌రీకి కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. కోచ్ తయారీ కేంద్రానికి బ‌దులు కాజీపేటలో పీరియాడికల్ ఓవరోలింగ్ వర్క్​షాప్​ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింద‌ని తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ, కాజీపేటలో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్ర‌క‌టించ‌డం స‌రికాద‌న్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ప్ర‌ధాన‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.

ఇండియా సెమీ కండక్టర్ మిషన్​లో తెలంగాణను చేర్చాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో సెమీ కండక్టర్ ఫ్యాబ్స్‌ను నెల‌కొల్పేందుకు ప‌లు కంపెనీలు ఆస‌క్తి క‌న‌ప‌ర్చుతున్న‌ట్లు మోదీకి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఆయా కంపెనీల ప్రతిపాదనలు ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్ సమీక్షలో ఉన్నందున‌, ఇండియా సెమీ కండక్టర్ మిషన్​లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

"తెలంగాణను మెడికల్ టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతాం" - CM Revanth on Warangal Development

25 లక్షల ఇళ్లు కేటాయించండి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇళ్లు మంజూర‌య్యాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నాడు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో తక్కువ ఇళ్లు మంజూర‌య్యాయ‌ని వివ‌రించారు. 2024-25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింద‌ని, అందులో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విధివిధానాలను రూపొందించేందుకు సిద్ధంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

ఆ రూ.1800 కోట్లు ఇవ్వండి : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు ఐదేళ్ల‌లో తెలంగాణ‌కు రూ.2,250 కోట్లు కేటాయించింద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేశార‌ని, 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి బీఆర్‌జీఎఫ్ కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలని ప్ర‌ధాన‌మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి : రాజధాని హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్-కరీంనగర్ రహదారి, హైదరాబాద్-నాగ్‌పూర్ ర‌హ‌దారి (ఎన్‌హెచ్‌-44)పై ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌ధానికి తెలియ‌జేశారు. ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని కోరారు. ఆ కారిడార్ల‌తో పాటు హైదరాబాద్ న‌గ‌రంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇత‌ర‌ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్​కు లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు త‌మ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

బ‌య్యారంలో ఉక్కు క‌ర్మాగారం : రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింద‌ని మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయ‌ని, వెంట‌నే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పి ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్య‌మంత్రి కోరారు.

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలి : భారత్‌మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ పీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ ర‌హ‌దారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇవ్వ‌డంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని తెలియ‌జేశారు. ఈ ర‌హ‌దారులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలని కోరారు.

జాతీయ ర‌హ‌దారులుగా : తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్యక్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. జగిత్యాల-పెద్దపల్లి-కాటారం, దిండి-దేవరకొండ-మల్లెపల్లి-నల్గొండ, భువనగిరి-చిట్యాల, చౌటుప్పల్ అమన్‌గల్-షాద్ న‌గ‌ర్‌-సంగారెడ్డి, మరికల్-నారాయణపేట రామసముద్ర, వనపర్తి-కొత్తకోట-గద్వాల మంత్రాలయం, మన్నెగూడ-వికారాబాద్-తాండూరు-జహీరాబాద్-బీదర్, కరీంనగర్-సిరిసిల్ల- కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు-గద్వాల-రాయచూరు, కొత్తపల్లి- హుస్నాబాద్- జనగాం- హైదరాబాద్, సారపాక- ఏటూరునాగారం, దుద్దెడ- కొమురవెల్లి-యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట- వైరా-కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్​గ్రేడ్ చేయాలని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

త్వరలో వారానికొక జిల్లా పర్యటనకు వెళ్తా : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth District Tour Schedule

CM Revanth Reddy Meets PM Modi in Delhi Today : సింగ‌రేణి ప‌రిధిలోని బొగ్గు గ‌నుల‌ను సింగ‌రేణికే కేటాయించాల‌ని, ప్ర‌స్తుతం వేలంలో పెట్టిన శ్రావ‌ణప‌ల్లి బొగ్గు బ్లాక్‌ను వేలం జాబితా నుంచి తొల‌గించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌భుత్వ రంగంలో ఉన్న సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్‌)లో తెలంగాణ ప్ర‌భుత్వానికి 51 శాతం, కేంద్ర ప్ర‌భుత్వానికి 41 శాతం వాటాలున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు. గనులు, ఖ‌నిజాభివృద్ధి నియంత్ర‌ణ చ‌ట్టంలోని (ఎంఎండీఆర్‌) సెక్ష‌న్ 11ఏ/17 (ఏ) (2) ప్ర‌కారం వేలం జాబితా నుంచి శ్రావ‌ణ‌ప‌ల్లి గ‌నిని తొల‌గించాల‌ని, అదే సెక్ష‌న్ ప్ర‌కారం గోదావ‌రి లోయ‌ బొగ్గు నిల్వ‌ల క్షేత్రం ప‌రిధిలోని కోయ‌గూడెం, స‌త్తుప‌ల్లి బ్లాక్ 3 గ‌నుల‌నూ సింగ‌రేణికే కేటాయించాల‌ని మోదీని రేవంత్ రెడ్డి కోరారు.

రాష్ట్రంలోని విద్యుదుత్ప‌త్తి కేంద్రాల అవ‌స‌రాలు తీర్చేందుకు ఈ గ‌నుల కేటాయింపు కీల‌కమైనందున, సింగ‌రేణికే వాటిని కేటాయించాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. దిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఆయ‌న నివాసంలో గురువారం మ‌ధ్యాహ్నం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌లిశారు. బొగ్గు గ‌నుల కేటాయింపు, ఐటీఐఆర్ పున‌రుద్ధ‌ర‌ణ‌, ర‌క్ష‌ణ భూముల కేటాయింపు, రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలపై మోదీతో ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు. ప్ర‌ధాన‌మంత్రి నివాసానికి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు చేరుకున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సుమారు గంట‌సేపు రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై ప్ర‌ధాన‌మంత్రితో చ‌ర్చించారు. ప్ర‌ధాన‌మంత్రితో ముఖ్య‌మంత్రి భేటీలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పాల్గొన్నారు.

హైద‌రాబాద్‌కు ఐటీఐఆర్ పున‌రుద్ధ‌రించాలి : 2010 సంవ‌త్సరంలో నాటి యూపీఏ ప్ర‌భుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు స‌మాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్‌) మంజూరు చేసింద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఐటీ రంగంలో నూత‌న కంపెనీలు, డెవ‌ల‌ప‌ర్ల‌ను ప్రోత్స‌హించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించింద‌న్నారు. 2014 త‌ర్వాత ఐటీఐఆర్ ముందుకు సాగ‌లేద‌ని, హైద‌రాబాద్‌కు ఐటీఐఆర్ పున‌రుద్ధ‌రించాల‌ని పీఎంను సీఎం కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి​ రిక్వెస్ట్​ - స్మార్ట్​ సిటీస్​ మిషన్​ గడువు పొడిగించిన కేంద్రం - extend smart cities mission

ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంగా తీసుకున్నా, ఇప్పటి వరకు తెలంగాణకు ఐఐఎం మంజూరు కాలేద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ దృష్టికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. వెంట‌నే హైద‌రాబాద్‌లో ఐఐఎం మంజూరు చేయాలని, ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో సరిపడా భూమి అందుబాటులో ఉంద‌ని తెలిపారు. సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో కాకుండా మ‌రెక్క‌డైనా ఐఐఎం ఏర్పాటు చేస్తామ‌న్నా ప్ర‌త్యామ్నాయంగా భూ కేటాయింపున‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి : రాష్ట్ర పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్ట‌రీకి కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చిన విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. కోచ్ తయారీ కేంద్రానికి బ‌దులు కాజీపేటలో పీరియాడికల్ ఓవరోలింగ్ వర్క్​షాప్​ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింద‌ని తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ, కాజీపేటలో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్ర‌క‌టించ‌డం స‌రికాద‌న్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ప్ర‌ధాన‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.

ఇండియా సెమీ కండక్టర్ మిషన్​లో తెలంగాణను చేర్చాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో సెమీ కండక్టర్ ఫ్యాబ్స్‌ను నెల‌కొల్పేందుకు ప‌లు కంపెనీలు ఆస‌క్తి క‌న‌ప‌ర్చుతున్న‌ట్లు మోదీకి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఆయా కంపెనీల ప్రతిపాదనలు ప్రస్తుతం ఇండియా సెమీకండక్టర్ మిషన్ సమీక్షలో ఉన్నందున‌, ఇండియా సెమీ కండక్టర్ మిషన్​లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

"తెలంగాణను మెడికల్ టూరిజం హబ్​గా తీర్చిదిద్దుతాం" - CM Revanth on Warangal Development

25 లక్షల ఇళ్లు కేటాయించండి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన తొలి దశలో తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ఇళ్లు మంజూర‌య్యాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నాడు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో తక్కువ ఇళ్లు మంజూర‌య్యాయ‌ని వివ‌రించారు. 2024-25 నుంచి ప్రారంభమవుతున్న పీఎంఏవై పథకంలో 3 కోట్ల గృహాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింద‌ని, అందులో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల విధివిధానాలను రూపొందించేందుకు సిద్ధంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

ఆ రూ.1800 కోట్లు ఇవ్వండి : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు ఐదేళ్ల‌లో తెలంగాణ‌కు రూ.2,250 కోట్లు కేటాయించింద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్కో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున ఈ గ్రాంట్ మంజూరు చేశార‌ని, 2019-20, 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి బీఆర్‌జీఎఫ్ కింద తెలంగాణ‌కు రావ‌ల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలని ప్ర‌ధాన‌మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి : రాజధాని హైదరాబాద్‌లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్-కరీంనగర్ రహదారి, హైదరాబాద్-నాగ్‌పూర్ ర‌హ‌దారి (ఎన్‌హెచ్‌-44)పై ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌ధానికి తెలియ‌జేశారు. ఆ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌దిలీ చేయాల‌ని కోరారు. ఆ కారిడార్ల‌తో పాటు హైదరాబాద్ న‌గ‌రంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇత‌ర‌ మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్​కు లీజుకు ఇచ్చిన 2,462 ఎకరాల భూములను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు త‌మ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంద‌ని తెలిపారు.

బ‌య్యారంలో ఉక్కు క‌ర్మాగారం : రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింద‌ని మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదికలు సమర్పించాయ‌ని, వెంట‌నే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పి ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్య‌మంత్రి కోరారు.

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలి : భారత్‌మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ పీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ ర‌హ‌దారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ వ్యయంలో 50 శాతం ఖర్చును ఇవ్వ‌డంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని తెలియ‌జేశారు. ఈ ర‌హ‌దారులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలని కోరారు.

జాతీయ ర‌హ‌దారులుగా : తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్యక్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. జగిత్యాల-పెద్దపల్లి-కాటారం, దిండి-దేవరకొండ-మల్లెపల్లి-నల్గొండ, భువనగిరి-చిట్యాల, చౌటుప్పల్ అమన్‌గల్-షాద్ న‌గ‌ర్‌-సంగారెడ్డి, మరికల్-నారాయణపేట రామసముద్ర, వనపర్తి-కొత్తకోట-గద్వాల మంత్రాలయం, మన్నెగూడ-వికారాబాద్-తాండూరు-జహీరాబాద్-బీదర్, కరీంనగర్-సిరిసిల్ల- కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు-గద్వాల-రాయచూరు, కొత్తపల్లి- హుస్నాబాద్- జనగాం- హైదరాబాద్, సారపాక- ఏటూరునాగారం, దుద్దెడ- కొమురవెల్లి-యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట- వైరా-కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్​గ్రేడ్ చేయాలని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

త్వరలో వారానికొక జిల్లా పర్యటనకు వెళ్తా : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth District Tour Schedule

Last Updated : Jul 4, 2024, 6:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.