ETV Bharat / state

తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు - 'కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి' - SC on Tirumala Laddu Issue

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Tirumala Laddu Issue Latest Update : తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూ వ్యవహారంపై సిట్​ కొనసాగించాలా? లేదా? సహకారం ఇవ్వాలని ఎస్​జీని సుప్రీంకోర్టు కోరింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని తెలిపింది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని కోరింది. సిట్​ను కొనసాగించాలో? లేదో? చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.

Tirumala Laddu Issue Latest Update
Tirumala Laddu Issue Latest Update (ETV Bharat)

Supreme Court on Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై జస్టిస్​ బి.ఆర్​.గవాయ్, జస్టిస్​ కె.వి. విశ్వనాథన్​తో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం లడ్డూ కల్తీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరింది. లడ్డూ వ్యవహారంపై సిట్​ కొనసాగించాలా? లేదా అని సహకారం ఇవ్వాలని ఎస్​జీని సుప్రీంకోర్టు కోరింది.

కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని సుప్రీంకోర్టు తెలిపింది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని కేంద్రాన్ని అడిగింది. సిట్​ను కొనసాగించాలో లేదో చెప్పాలని కూడా కోరింది. రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని అంది. అసలు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనే వివరాలను టీటీడీ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. జూన్​ నుంచి జులై వరకు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనేది టీటీడీ న్యాయస్థానానికి వివరించింది. అయితే లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటని సర్వోన్నత న్యాయస్థానం టీటీడీ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ క్రమంలో విచారణను గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు : లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి(బీజేపీ), వైవీ సుబ్బారెడ్డి(వైఎస్సాఆర్​సీపీ), రచయిత విక్రమ్​ సంపత్​, పలువురు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్​ బి.ఆర్​.గవాయ్, జస్టిస్​ కె.వి.విశ్వనాథన్​ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్లు వేసిన వారిలో ప్రసాదం కల్తీపై వాస్తవాలు తేల్చాలన్న సుబ్రహ్మస్వామి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రసాదం కల్తీపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని మరోవైపు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్​ వేసి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి సుప్రీంకోర్టు విచారించింది.

Supreme Court on Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అత్యున్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్లపై జస్టిస్​ బి.ఆర్​.గవాయ్, జస్టిస్​ కె.వి. విశ్వనాథన్​తో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం లడ్డూ కల్తీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరింది. లడ్డూ వ్యవహారంపై సిట్​ కొనసాగించాలా? లేదా అని సహకారం ఇవ్వాలని ఎస్​జీని సుప్రీంకోర్టు కోరింది.

కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని సుప్రీంకోర్టు తెలిపింది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని కేంద్రాన్ని అడిగింది. సిట్​ను కొనసాగించాలో లేదో చెప్పాలని కూడా కోరింది. రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడారని అంది. అసలు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనే వివరాలను టీటీడీ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. జూన్​ నుంచి జులై వరకు ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనేది టీటీడీ న్యాయస్థానానికి వివరించింది. అయితే లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటని సర్వోన్నత న్యాయస్థానం టీటీడీ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ క్రమంలో విచారణను గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు : లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి(బీజేపీ), వైవీ సుబ్బారెడ్డి(వైఎస్సాఆర్​సీపీ), రచయిత విక్రమ్​ సంపత్​, పలువురు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్​ బి.ఆర్​.గవాయ్, జస్టిస్​ కె.వి.విశ్వనాథన్​ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్లు వేసిన వారిలో ప్రసాదం కల్తీపై వాస్తవాలు తేల్చాలన్న సుబ్రహ్మస్వామి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రసాదం కల్తీపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని మరోవైపు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్​ వేసి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి సుప్రీంకోర్టు విచారించింది.

తిరుమల లడ్డూ వివాదం - యాదాద్రి ప్రసాదంపై అధికారుల కీలక నిర్ణయం - YADADRI LADDU QUALITY TEST IN HYD

తిరుమల లడ్డూ విషయంలో డౌట్ వద్దు - అంతకంటే ముందే నెయ్యి మార్చేశాం : టీటీడీ - TTD ON TIRUMALA LADDU controversy

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.