ETV Bharat / state

కొనఊపిరితో తమ్ముడికి రాఖీ కట్టి - కొద్ది గంటల్లోనే కనుమూసిన యువతి - RAKSHA BANDHAN ON DEATH BED

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 10:16 AM IST

Updated : Aug 19, 2024, 11:42 AM IST

Sister Tied Rakhi to Younger Brothers Before Dying : తమ్ముడంటే ఆ అక్కకు ఎంతో ప్రేమ. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున తప్పకుండా సోదరుడికి రాఖీ కట్టి తన ప్రేమను చాటుతుంది. అయితే ఈసారి కూడా ఆమె రాఖీ కట్టింది. కానీ పండుగ రోజు కాదు, పండుగకు ఒక రోజు ముందే. తన ప్రాణం పోతుందని ముందే తెలిసి రక్షాబంధన్​కు రెండు రోజుల ముందు కొనఊపిరితో రాఖీ కట్టి ఇదే నా చివరి రాఖీ చిన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని గంటల తర్వాత కన్నుమూసింది. ఈ విషాద సంఘటన మహబూబాబాద్​ జిల్లాలో జరిగింది.

Sister Tied Rakhi to Younger Brothers Before Dying
Sister Tied Rakhi to Younger Brothers Before Dying (ETV Bharat)

Young Woman Commits Suicide due to Man Harassment : అమ్మ, నాన్న, ఆమె, తమ్ముడు ఇదే తన కుటుంబం. వారితోనే తన జీవితం అనుకుంది. తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ. అందులోనూ తోడబుట్టిన తమ్ముడంటే తన ప్రాణం కంటే ఎక్కువ. అక్కకు తమ్ముడు తోడుగా తమ్ముడికి అక్క తోడుగా ఉంటూ ఇంట్లో ఆ అల్లరే వేరు. అలాగని ఆ అల్లరితనం ఆమెలో లేదు. చదువులో అత్యుత్తమంగా రాణించింది. ఇలా రాణించి జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలని ఎప్పుడూ కలగనేది. ఆ కలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉండేది. ఒక మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులు, తమ్ముడికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలనుకుంది.

కానీ ఇంతలోనే ఓ ఆకతాయి వేధింపులు ఆమెపాలిట యమపాశమయ్యాయి. ఆమె కలలు కల్లలు చేశాయి. ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశాయి. ప్రేమిస్తున్నానంటూ ఆ ఆకతాయి చేసిన వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి ప్రయత్నించింది. కానీ ఆసుపత్రిలో కొన ఊపిరితో తన తమ్ముడికి రాఖీ కట్టాలనుకుంది. సోమవారం రోజున రక్షా బంధన్ వస్తున్నందున, అప్పటి దాక తాను బతికుంటానో లేదోనని, చివరిసారిగా రాఖీ కడతానని తల్లిదండ్రులకు చెప్పింది. అలా ఆ యువతి తన తమ్ముడికి, పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే కనుమూసింది. ఈ విషాద సంఘటన అక్కడున్న వారందరితో కన్నీళ్లు పెట్టించింది. ఈ సంఘటన మహబూబాబాద్​ జిల్లాలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామంలో చిన్న కుటుంబం నివాసం ఉంటోంది. వారిలో పెద్ద కుమార్తె (17) కోదాడలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆమె రోజు కాలేజీకి కోదాడకు వెళ్తూ ఉండేది. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ ఆకతాయి ప్రేమ పేరిట తరచూ ఆ యువతిని వేధిస్తూ ఉండేవాడు. ఆమె వద్దన్నా వేధించేవాడు. ఈ క్రమంలో ఆమె మనస్తాపం చెంది గత గురువారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అది గమనించి కుటుంబీకులు మహబూబాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

అక్కడ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో యువతి పరిస్థితి విషమించింది. ప్రతి రక్షాబంధన్​కు ఆమె తన తమ్ముళ్లకు రాఖీ కడుతూ ఉండేది. ఇప్పుడు కూడా సోమవారం రక్షాబంధన్​ కావడంతో అప్పటివరకు బతికి ఉంటానో లేదో అని భావించి శనివారం రాత్రి తన తమ్ముడితో పాటు పెద్దనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. ఈ సన్నివేశం అక్కడుకున్న వారితో కన్నీళ్లు పెట్టించింది. రాఖీ కట్టిన కొద్ది గంటల్లోనే ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆమె కన్నుమూసింది.

వేధించిన ఆకతాయిపై కేసు నమోదు : ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఆకతాయిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు నర్సింహులపేట పోలీసులు తెలిపారు. ఆకతాయి కోసం గాలింపు చేపట్టారు.

Brother Murder : సోదరిపై వేధింపులు.. అడ్డుచెప్పిన సోదరుడి హత్య.. రాఖీకి 2రోజుల ముందే

అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న మైనర్​పై గ్యాంగ్​రేప్​

Young Woman Commits Suicide due to Man Harassment : అమ్మ, నాన్న, ఆమె, తమ్ముడు ఇదే తన కుటుంబం. వారితోనే తన జీవితం అనుకుంది. తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ. అందులోనూ తోడబుట్టిన తమ్ముడంటే తన ప్రాణం కంటే ఎక్కువ. అక్కకు తమ్ముడు తోడుగా తమ్ముడికి అక్క తోడుగా ఉంటూ ఇంట్లో ఆ అల్లరే వేరు. అలాగని ఆ అల్లరితనం ఆమెలో లేదు. చదువులో అత్యుత్తమంగా రాణించింది. ఇలా రాణించి జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలని ఎప్పుడూ కలగనేది. ఆ కలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉండేది. ఒక మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులు, తమ్ముడికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలనుకుంది.

కానీ ఇంతలోనే ఓ ఆకతాయి వేధింపులు ఆమెపాలిట యమపాశమయ్యాయి. ఆమె కలలు కల్లలు చేశాయి. ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశాయి. ప్రేమిస్తున్నానంటూ ఆ ఆకతాయి చేసిన వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి ప్రయత్నించింది. కానీ ఆసుపత్రిలో కొన ఊపిరితో తన తమ్ముడికి రాఖీ కట్టాలనుకుంది. సోమవారం రోజున రక్షా బంధన్ వస్తున్నందున, అప్పటి దాక తాను బతికుంటానో లేదోనని, చివరిసారిగా రాఖీ కడతానని తల్లిదండ్రులకు చెప్పింది. అలా ఆ యువతి తన తమ్ముడికి, పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే కనుమూసింది. ఈ విషాద సంఘటన అక్కడున్న వారందరితో కన్నీళ్లు పెట్టించింది. ఈ సంఘటన మహబూబాబాద్​ జిల్లాలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్​ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామంలో చిన్న కుటుంబం నివాసం ఉంటోంది. వారిలో పెద్ద కుమార్తె (17) కోదాడలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆమె రోజు కాలేజీకి కోదాడకు వెళ్తూ ఉండేది. ఖమ్మం పట్టణానికి చెందిన ఓ ఆకతాయి ప్రేమ పేరిట తరచూ ఆ యువతిని వేధిస్తూ ఉండేవాడు. ఆమె వద్దన్నా వేధించేవాడు. ఈ క్రమంలో ఆమె మనస్తాపం చెంది గత గురువారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అది గమనించి కుటుంబీకులు మహబూబాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

అక్కడ వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో యువతి పరిస్థితి విషమించింది. ప్రతి రక్షాబంధన్​కు ఆమె తన తమ్ముళ్లకు రాఖీ కడుతూ ఉండేది. ఇప్పుడు కూడా సోమవారం రక్షాబంధన్​ కావడంతో అప్పటివరకు బతికి ఉంటానో లేదో అని భావించి శనివారం రాత్రి తన తమ్ముడితో పాటు పెద్దనాన్న కుమారుడికి రాఖీ కట్టింది. ఈ సన్నివేశం అక్కడుకున్న వారితో కన్నీళ్లు పెట్టించింది. రాఖీ కట్టిన కొద్ది గంటల్లోనే ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆమె కన్నుమూసింది.

వేధించిన ఆకతాయిపై కేసు నమోదు : ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన ఆకతాయిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు నర్సింహులపేట పోలీసులు తెలిపారు. ఆకతాయి కోసం గాలింపు చేపట్టారు.

Brother Murder : సోదరిపై వేధింపులు.. అడ్డుచెప్పిన సోదరుడి హత్య.. రాఖీకి 2రోజుల ముందే

అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న మైనర్​పై గ్యాంగ్​రేప్​

Last Updated : Aug 19, 2024, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.