ETV Bharat / state

ఆ హోటల్​లో షవర్మా తిన్నారా? అయితే మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది!

దసరా రోజు రాత్రి షవర్మా తిన్న కొంతమందికి తీవ్ర అస్వస్థత - ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు - ఇటీవలే నెలరోజుల పాట సీజ్ చేసిన అధికారులు

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 1 hours ago

SHAWARMA ADULTERATION
SHAWARMA IN HYDERABAD (ETV Bharat)

Shawarma Adulteration in Hyderabad: షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటన మేడ్చల్​- మల్కాజ్​గిరి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో చోటు చేసుకుంది. లోతుకుంటలోని గ్రిల్ హౌస్ అనే షాపులో దసరా రోజు రాత్రి కొంతమంది కస్టమర్స్ తినడానికి స్నేహితులతో కలిసి​ షవర్మాను కొనుగోలు చేశారు. దానిని తిన్న వినియోగదారులకు మరుసటి రోజు నుంచి వాంతులు, విరేచనాలు కావడంతో బాధితులు బొల్లారంలోని కంటోన్మెంట్ జనరల్​ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

అల్వాల్ ప్రాంతానికి చెందిన లోకేష్, శరత్, గోవిందరాజ్, వర్ధినిలు చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్​ అయినట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు డాక్టర్లను సంప్రదించడంతో వారు విషయం వెల్లడించారు. బాధితులు తిన్న ఆహారం పూర్తిగా పాడైపోయి, కలుషితమైందని తెలిపారు. అందువల్ల వారికి మరుసటి రోజు నుంచి వెంటనే విరేచనాలు, వాంతులు, ఒళ్లు నొప్పులు, చలి జ్వరం లాంటివి వచ్చాయన్నారు. బయట ఇలాంటి ఆహారం తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కల్తీ ఆహారం వల్ల శరీరంలో తీవ్రమైన అనర్థాలు జరుగుతాయని చెప్పారు. లేదంటే అనారోగ్యంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు.

ఆహార కల్తీలో దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్ - బయట తింటే ఖతమే - నమ్మలేని నిజాలివే!

గతంలో ఒకసారి సీజ్​: కల్తీ ఆహారం, పాడైపోయిన షవర్మా లాంటి వాటిని విక్రయిస్తున్న దుకాణాన్ని మూసివేయాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇదే షవర్మా దుకాణం​లో గతంలో కూడా ఇదే తరహాలో పలువురు ఆసుపత్రి పాలయ్యారని బాధితులు పేర్కొన్నారు. ఆహార భద్రత అధికారులు(ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్స్​) ఇటీవల తనీఖీలు నిర్వహించి నెల రోజుల పాటు షాపును సీజ్ చేశారని స్థానికులు చెప్పారు. కాగా 2024 జనవరి నెలలో ఇద్దరు ఈ షాపులో షవర్మా తిని ఆసుపత్రి పాలయ్యారు.

అయినా మళ్లీ గ్రిల్​ హౌస్​ షాపును తెరిచి విక్రయాలు నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. షవర్మా దుకాణాన్ని తిరిగి తెరిచినప్పటికీ సరైన ఆహార నాణ్యత పాటించకుండా అదే పాడైపోయిన షవర్మాను అదే రకంగా అమ్మడంతో కొనుగోలు చేసి తిన్న వారికి అస్వస్థత, వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ షవర్మా వల్ల గతంలో కేరళలో ఒక విద్యార్థిని సైతం మృత్యువాత పడిన దుర్ఘటన ఉంది. కల్తీ ఆహారం విక్రయించకుండా గ్రిల్​ హౌస్​ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కిరాణా దుకాణంలో.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీలు

హైదరాబాద్​లో పలు హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం - ప్రజల ఆరోగ్యంతో చెలగాటం - Adulterated food in Hyderabad

Shawarma Adulteration in Hyderabad: షవర్మా తిని పలువురు అస్వస్థతకు గురైన ఘటన మేడ్చల్​- మల్కాజ్​గిరి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో చోటు చేసుకుంది. లోతుకుంటలోని గ్రిల్ హౌస్ అనే షాపులో దసరా రోజు రాత్రి కొంతమంది కస్టమర్స్ తినడానికి స్నేహితులతో కలిసి​ షవర్మాను కొనుగోలు చేశారు. దానిని తిన్న వినియోగదారులకు మరుసటి రోజు నుంచి వాంతులు, విరేచనాలు కావడంతో బాధితులు బొల్లారంలోని కంటోన్మెంట్ జనరల్​ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

అల్వాల్ ప్రాంతానికి చెందిన లోకేష్, శరత్, గోవిందరాజ్, వర్ధినిలు చికిత్స కోసం ఆసుపత్రిలో అడ్మిట్​ అయినట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు డాక్టర్లను సంప్రదించడంతో వారు విషయం వెల్లడించారు. బాధితులు తిన్న ఆహారం పూర్తిగా పాడైపోయి, కలుషితమైందని తెలిపారు. అందువల్ల వారికి మరుసటి రోజు నుంచి వెంటనే విరేచనాలు, వాంతులు, ఒళ్లు నొప్పులు, చలి జ్వరం లాంటివి వచ్చాయన్నారు. బయట ఇలాంటి ఆహారం తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కల్తీ ఆహారం వల్ల శరీరంలో తీవ్రమైన అనర్థాలు జరుగుతాయని చెప్పారు. లేదంటే అనారోగ్యంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు.

ఆహార కల్తీలో దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్ - బయట తింటే ఖతమే - నమ్మలేని నిజాలివే!

గతంలో ఒకసారి సీజ్​: కల్తీ ఆహారం, పాడైపోయిన షవర్మా లాంటి వాటిని విక్రయిస్తున్న దుకాణాన్ని మూసివేయాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇదే షవర్మా దుకాణం​లో గతంలో కూడా ఇదే తరహాలో పలువురు ఆసుపత్రి పాలయ్యారని బాధితులు పేర్కొన్నారు. ఆహార భద్రత అధికారులు(ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్స్​) ఇటీవల తనీఖీలు నిర్వహించి నెల రోజుల పాటు షాపును సీజ్ చేశారని స్థానికులు చెప్పారు. కాగా 2024 జనవరి నెలలో ఇద్దరు ఈ షాపులో షవర్మా తిని ఆసుపత్రి పాలయ్యారు.

అయినా మళ్లీ గ్రిల్​ హౌస్​ షాపును తెరిచి విక్రయాలు నిర్వహిస్తున్నారని స్థానికులు తెలిపారు. షవర్మా దుకాణాన్ని తిరిగి తెరిచినప్పటికీ సరైన ఆహార నాణ్యత పాటించకుండా అదే పాడైపోయిన షవర్మాను అదే రకంగా అమ్మడంతో కొనుగోలు చేసి తిన్న వారికి అస్వస్థత, వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఈ షవర్మా వల్ల గతంలో కేరళలో ఒక విద్యార్థిని సైతం మృత్యువాత పడిన దుర్ఘటన ఉంది. కల్తీ ఆహారం విక్రయించకుండా గ్రిల్​ హౌస్​ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కిరాణా దుకాణంలో.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తనిఖీలు

హైదరాబాద్​లో పలు హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం - ప్రజల ఆరోగ్యంతో చెలగాటం - Adulterated food in Hyderabad

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.