ETV Bharat / state

ఇన్​స్టాలో పరిచయం - కర్ణాటకకు తీసుకెళ్లి మైనర్​పై అత్యాచారం - యువకుడి అరెస్ట్ - Sexual assault on girl

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 10:19 AM IST

Sexual Assault On Girl : మైనర్​ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ 23 ఏళ్ల కామాంధుడు. బాధితురాలికి ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమైన నిందితుడు, ఆమెను కర్ణాటకలోని గుల్బార్గాకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Sexual Assault On Girl
Sexual Assault On Girl (ETV Bharat)

Sexual Assault On Girl : ఈ మధ్య కాలంలో ఆన్​లైన్​ పరిచయాలు కొంపముంచుతున్నాయి. ఇన్​స్టాగ్రామ్​,ఫేస్​బుక్​, వాట్సాప్​ లాంటి సామాజిక మాధ్యమాల్లో పరిచయాన్ని పెంచుకుని మాయమాటలు చెప్పి నయవంచనకు పాల్పడుతున్నారు కొంతమంది. తాజాగా అలాంటి ఘటనే నారాయణగూడ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్​స్టాగ్రామ్​లో 13 ఏళ్ల మైనర్​ బాలికతో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని నారాయణ గూడ పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలిల్లోకి వెళితే నారాయణగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఓ స్కూల్​లో బాధిత మైనర్ బాలిక 9వ తరగతి చదువుతోంది. షేక్ ఆర్భాస్​ (23) అనే వ్యక్తితో ఆమెకు ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ నెల 24న స్కూల్​కు వచ్చిన బాలికను తనతో పాటు కర్ణాటకలోని గుల్బర్గాకు తీసుకువెళ్లాడు నిందితుడు. ఆపై బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తమ కుమార్తె పాఠశాల నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆమె కోసం గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Accused Arrested By The police : కేసును సీరియస్​గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలోనే షేక్ ఆర్భాస్ అనే వ్యక్తి బాలికను తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. అతడి తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడంతో రెండు రోజుల తర్వాత బాలికను హైదరాబాద్ పంపించి నిందితుడు పరారయ్యాడు. బాలికను భరోసా సెంటర్​కు తరలించారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్​లో ఉన్న నిందితుడు షేక్ ఆర్భాస్​ను అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలను సెల్​ఫోన్లకు దూరంగా ఉంచడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్​లో అమానుషం - కాగితాలు ఏరుకునే మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం - 45 Yrs OLD WOMAN RAPE IN KUKATPALLY

లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్​కు దేహశుద్ధి

Sexual Assault On Girl : ఈ మధ్య కాలంలో ఆన్​లైన్​ పరిచయాలు కొంపముంచుతున్నాయి. ఇన్​స్టాగ్రామ్​,ఫేస్​బుక్​, వాట్సాప్​ లాంటి సామాజిక మాధ్యమాల్లో పరిచయాన్ని పెంచుకుని మాయమాటలు చెప్పి నయవంచనకు పాల్పడుతున్నారు కొంతమంది. తాజాగా అలాంటి ఘటనే నారాయణగూడ పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్​స్టాగ్రామ్​లో 13 ఏళ్ల మైనర్​ బాలికతో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని నారాయణ గూడ పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలిల్లోకి వెళితే నారాయణగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఓ స్కూల్​లో బాధిత మైనర్ బాలిక 9వ తరగతి చదువుతోంది. షేక్ ఆర్భాస్​ (23) అనే వ్యక్తితో ఆమెకు ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ నెల 24న స్కూల్​కు వచ్చిన బాలికను తనతో పాటు కర్ణాటకలోని గుల్బర్గాకు తీసుకువెళ్లాడు నిందితుడు. ఆపై బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తమ కుమార్తె పాఠశాల నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆమె కోసం గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Accused Arrested By The police : కేసును సీరియస్​గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలోనే షేక్ ఆర్భాస్ అనే వ్యక్తి బాలికను తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. అతడి తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడంతో రెండు రోజుల తర్వాత బాలికను హైదరాబాద్ పంపించి నిందితుడు పరారయ్యాడు. బాలికను భరోసా సెంటర్​కు తరలించారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్​లో ఉన్న నిందితుడు షేక్ ఆర్భాస్​ను అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలను సెల్​ఫోన్లకు దూరంగా ఉంచడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్​లో అమానుషం - కాగితాలు ఏరుకునే మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం - 45 Yrs OLD WOMAN RAPE IN KUKATPALLY

లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్​కు దేహశుద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.