ETV Bharat / state

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురి దుర్మరణం - Road Accident in Tirupati District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 2:51 PM IST

Updated : Sep 12, 2024, 10:52 PM IST

Chandragiri Road Accident Today : తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భాకరాపేట కనుమ రహదారిలో ఓ కంటైనర్‌ లారీ అదుపతప్పి కారుపై పడిన ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Road Accident in Tirupati District
Road Accident in Tirupati District (ETV Bharat)

Road Accident in Tirupati District Today : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కలకడ నుంచి చెన్నైకి టమాటాల లోడ్​తో వెళ్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి కారుపై పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడిక్కడే మరణించగా మరొకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Bhakarapet Road Accident Today : పోలీసులు, స్థానికులు మూడు గంటల పాటు శ్రమించి కారుపై నుంచి కంటైనర్ తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక వాసులని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఈ ప్రమాదంతో కనుమరహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది.

అంబటివలసలో ద్విచక్ర వాహనాలు ఢీ - ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు - Two People Dead in Accident

Road Accident in Tirupati District Today : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కలకడ నుంచి చెన్నైకి టమాటాల లోడ్​తో వెళ్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి కారుపై పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడిక్కడే మరణించగా మరొకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Bhakarapet Road Accident Today : పోలీసులు, స్థానికులు మూడు గంటల పాటు శ్రమించి కారుపై నుంచి కంటైనర్ తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక వాసులని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఈ ప్రమాదంతో కనుమరహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది.

అంబటివలసలో ద్విచక్ర వాహనాలు ఢీ - ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు - Two People Dead in Accident

Last Updated : Sep 12, 2024, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.