ETV Bharat / state

కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3.0- సర్కారు ముందున్న సవాళ్లేంటి? - Prathidhwani on Modi Government

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 11, 2024, 11:46 AM IST

Prathidhwani on Modi 3.0 Government : సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30 మంది క్యాబినెట్, ఐదుగురు స్వతంత్ర, 36 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

prathidhwani_on_modi_30_government
prathidhwani_on_modi_30_government (ETV Bharat)

Prathidhwani on Modi 3.0 Government : పదేళ్ల అనుభవాలు 140 కోట్లమంది ప్రజల ఆకాంక్షల మధ్య కొలువుదీరింది మోదీ సర్కారు 3.0. మూడవసారి దేశ నాయకత్వ బాధ్యతలు అందుకుని తొలిప్రధానమంత్రి పండిట్ నెహ్రూ రికార్డును సమం చేశారు నరేంద్రమోదీ. ఆ అరుదైన ఘనత ఒకవైపు, పదేళ్ల తర్వాత సంకీర్ణ బలంపై ఆధారపడిన సమీకరణాలు మరోవైపు నేపథ్యంలో ఈ దఫా ఎన్డీయే పాలన ఎలా సాగనుంది ? రాజకీయంగా, ప్రభుత్వపరంగా వారి ముందున్న ప్రాధాన్యాలు, సవాళ్లు ఏంటి? ఎన్డీయే తొలి వంద రోజుల ప్రణాళికలో ఏ ఏ అంశాలున్నాయి? ఉమ్మడి పౌరస్మృతి, ఒకటేదేశం - ఒకటే ఎన్నికలతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తోన్న సవాళ్లకు ఇకనైనా పరిష్కారం చూపగలరా ? ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియర్ పాత్రికేయులు రాకా సుధాకర్‌, జాతీయ రాజకీయాల విశ్లేషకులు చలసాని నరేంద్ర.

కొలువుదీరిన ఎన్డీఏ 3.0 సర్కార్- ప్రధాని మోదీ సహా 72మంది మంత్రులుగా ప్రమాణం- పూర్తి జట్టు ఇదే - Modi Oath Ceremony

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొలువు దీరిన ఎన్డీఏ 3.O సర్కార్​ కేబినెట్​లో బీజేపీకి 61, ఎన్​డీఏ మిత్రపక్షాలకు 11 బెర్తులు లభించాయి. మొత్తం 72మందితో మోదీ కేంద్ర కేబినెట్ కొలువుదీరింది. ఎన్​డీఏ ప్రధాన మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూకి చెరో రెండు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఎల్​జేపీ(ఆర్ వీ), జేడీఎస్, శివసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ దళ, అప్నా దళ్, హిందూ అవామీ మోర్చా చెరో ఒక్క కేబినెట్ స్థానాన్ని దక్కించుకున్నాయి.

కొలువుదీరిన కొత్త మంత్రులు- మరోసారి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ ఛార్జ్​

రాష్ట్రాలవారీగా కేబినెట్ బెర్తులు
మరోవైపు రాష్ట్రాల వారీగా చూస్తే కేంద్ర కేబినెట్​లో ఉత్తర్​ప్రదేశ్, బిహార్, మహారాష్ట్రకు మోదీ సర్కార్ పెద్ద పీట వేసింది. 80 లోక్​సభ స్థానాలున్న యూపీకి 9, బిహార్​కు 8 కేంద్ర కేబినెట్ బెర్తులు దక్కాయి. మహారాష్ట్రకు 6, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్​కు చెరో 5 కేంద్ర మంత్రి పదవులు వరించాయి. హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెరో మూడు, ఒడిశా, అసోం, ఝార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, బంగాల్, కేరళకు చెరో రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.

Prathidhwani on Modi 3.0 Government : పదేళ్ల అనుభవాలు 140 కోట్లమంది ప్రజల ఆకాంక్షల మధ్య కొలువుదీరింది మోదీ సర్కారు 3.0. మూడవసారి దేశ నాయకత్వ బాధ్యతలు అందుకుని తొలిప్రధానమంత్రి పండిట్ నెహ్రూ రికార్డును సమం చేశారు నరేంద్రమోదీ. ఆ అరుదైన ఘనత ఒకవైపు, పదేళ్ల తర్వాత సంకీర్ణ బలంపై ఆధారపడిన సమీకరణాలు మరోవైపు నేపథ్యంలో ఈ దఫా ఎన్డీయే పాలన ఎలా సాగనుంది ? రాజకీయంగా, ప్రభుత్వపరంగా వారి ముందున్న ప్రాధాన్యాలు, సవాళ్లు ఏంటి? ఎన్డీయే తొలి వంద రోజుల ప్రణాళికలో ఏ ఏ అంశాలున్నాయి? ఉమ్మడి పౌరస్మృతి, ఒకటేదేశం - ఒకటే ఎన్నికలతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తోన్న సవాళ్లకు ఇకనైనా పరిష్కారం చూపగలరా ? ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియర్ పాత్రికేయులు రాకా సుధాకర్‌, జాతీయ రాజకీయాల విశ్లేషకులు చలసాని నరేంద్ర.

కొలువుదీరిన ఎన్డీఏ 3.0 సర్కార్- ప్రధాని మోదీ సహా 72మంది మంత్రులుగా ప్రమాణం- పూర్తి జట్టు ఇదే - Modi Oath Ceremony

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొలువు దీరిన ఎన్డీఏ 3.O సర్కార్​ కేబినెట్​లో బీజేపీకి 61, ఎన్​డీఏ మిత్రపక్షాలకు 11 బెర్తులు లభించాయి. మొత్తం 72మందితో మోదీ కేంద్ర కేబినెట్ కొలువుదీరింది. ఎన్​డీఏ ప్రధాన మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూకి చెరో రెండు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఎల్​జేపీ(ఆర్ వీ), జేడీఎస్, శివసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ దళ, అప్నా దళ్, హిందూ అవామీ మోర్చా చెరో ఒక్క కేబినెట్ స్థానాన్ని దక్కించుకున్నాయి.

కొలువుదీరిన కొత్త మంత్రులు- మరోసారి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ ఛార్జ్​

రాష్ట్రాలవారీగా కేబినెట్ బెర్తులు
మరోవైపు రాష్ట్రాల వారీగా చూస్తే కేంద్ర కేబినెట్​లో ఉత్తర్​ప్రదేశ్, బిహార్, మహారాష్ట్రకు మోదీ సర్కార్ పెద్ద పీట వేసింది. 80 లోక్​సభ స్థానాలున్న యూపీకి 9, బిహార్​కు 8 కేంద్ర కేబినెట్ బెర్తులు దక్కాయి. మహారాష్ట్రకు 6, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్​కు చెరో 5 కేంద్ర మంత్రి పదవులు వరించాయి. హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెరో మూడు, ఒడిశా, అసోం, ఝార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, బంగాల్, కేరళకు చెరో రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.