ETV Bharat / state

హైదరాబాద్​లో మళ్లీ పోలీసుల కాల్పుల కలకలం - ఒకరికి తీవ్రగాయాలు - POLICE FIRING AT NAMPALLY IN HYD

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 8:09 AM IST

Updated : Jul 12, 2024, 9:23 AM IST

Firing At Nampally in Hyderabad Today: తెలంగాణలోని హైదరాబాద్​లో పోలీసుల కాల్పులు మరోసారి కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్​ సమీపంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. దుండగులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతుండగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి.

POLICE FIRING AT NAMPALLY IN HYD
POLICE FIRING AT NAMPALLY IN HYD (ETV Bharat)

Gun Firing At Nampally Today: తెలంగాణలోని హైదరాబాద్​లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వేస్టేషన్​ సమీపంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దుండగులు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. అనంతరం పరారవుతుండగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారంతా దోపిడి దొంగలుగా అనుమానిస్తున్నారు.

నగరంలో గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో పోలీసులు వాహన తనిఖీలతో పాటు గస్తీని పెంచిన విషయం తెలిసిందే. పటిష్ఠ నిఘా ఉంచిన అధికారులు కాస్త అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వారిని ఆపి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నాంపల్లి రైల్వే స్టేషన్​ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ప్రశ్నిస్తుండగా వారు పోలీసులపై దాడికి యత్నించి పరారయ్యేందుకు ప్రయత్నించారు.

అమెరికాలో దుండగుడి కాల్పులు - బాపట్ల యువకుడి మృతి - AP Youth Killed Firing in America

ఇదీ జరిగింది : నాంపల్లి పోలీసులు, యాంటీ డెకాయిట్ టీమ్ సంయుక్తంగా హైదరాబాద్ సీపీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో ప్రయాణీకులు నిద్రించినపుడు వారిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారంతో అర్ధరాత్రి సమయంలో పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఆ సమయంలో వారు పోలీసులపై గొడ్డలితో దాడి చేసి పారిపోవాలని యత్నించడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఓ వ్యక్తికి గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తిని నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

రోజుకో మర్డర్ - పూటకో దోపిడీ - ఈ భాగ్యనగరానికి ఏమైంది? - Crime Rate Increasing in Hyderabad

Gun Firing At Nampally Today: తెలంగాణలోని హైదరాబాద్​లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వేస్టేషన్​ సమీపంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దుండగులు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించారు. అనంతరం పరారవుతుండగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారంతా దోపిడి దొంగలుగా అనుమానిస్తున్నారు.

నగరంలో గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో పోలీసులు వాహన తనిఖీలతో పాటు గస్తీని పెంచిన విషయం తెలిసిందే. పటిష్ఠ నిఘా ఉంచిన అధికారులు కాస్త అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వారిని ఆపి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నాంపల్లి రైల్వే స్టేషన్​ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ప్రశ్నిస్తుండగా వారు పోలీసులపై దాడికి యత్నించి పరారయ్యేందుకు ప్రయత్నించారు.

అమెరికాలో దుండగుడి కాల్పులు - బాపట్ల యువకుడి మృతి - AP Youth Killed Firing in America

ఇదీ జరిగింది : నాంపల్లి పోలీసులు, యాంటీ డెకాయిట్ టీమ్ సంయుక్తంగా హైదరాబాద్ సీపీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో ప్రయాణీకులు నిద్రించినపుడు వారిపై దాడి చేసి నగదు, సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారంతో అర్ధరాత్రి సమయంలో పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. ఆ సమయంలో వారు పోలీసులపై గొడ్డలితో దాడి చేసి పారిపోవాలని యత్నించడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఓ వ్యక్తికి గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తిని నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

రోజుకో మర్డర్ - పూటకో దోపిడీ - ఈ భాగ్యనగరానికి ఏమైంది? - Crime Rate Increasing in Hyderabad

Last Updated : Jul 12, 2024, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.