ETV Bharat / state

పేదల పేరుతో బ్యాంక్ అకౌంట్స్ - దుబాయ్ నుంచి ఆపరేటింగ్ - 2 నెలల్లో రూ.175 కోట్ల స్కామ్ - RS 175 CRORES CYBER FRAUD IN HYD

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 11:21 AM IST

Updated : Aug 26, 2024, 2:23 PM IST

175 Crore Cyber Scam in Telangana : కేవలం రెండే నెలల్లో రూ.175 కోట్లు కొల్లగొట్టిందా సైబర్​ ముఠా. రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లనూ బురిడీ కొట్టించి ఆ సొమ్మును ఆరు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించింది. ఇద్దరు హైదరాబాదీల అరెస్టుతో దుబాయ్​ నుంచి జరుగుతున్న ఈ సైబర్​ ముఠా మోసాలు తాజాగా వెలుగులోకి వచ్చింది.

Police Nab 175 crore Rupees Cyber Fraudsters
175 Crore Cyber Scam in Telangana (ETV Bharat)

Police Nab 175 crore Rupees Cyber Fraudsters : ఓ సైబర్‌ నేరస్థుల ముఠా కేవలం రెండు నెలల్లోనే ఏకంగా రూ.175 కోట్లు కాజేసింది. ఈ సొమ్మును ఆరు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించింది. నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌(ఎన్‌సీఆర్‌పీ)కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) పోలీసులు కేసును సుమోటోగా నమోదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌లోని బ్యాంకు ఖాతాల్లోకి ఈ సొమ్మును మళ్లించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా ఖాతాదారుల గురించి ఆరా తీస్తే ఆశ్చర్యకరంగా అవి ఆటోడ్రైవర్లవని బయటపడింది.

వారిని విచారించగా సైబర్‌ ముఠాలో ఇద్దరు కీలక నిందితులు చిక్కారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కూపీలాగితే ముఠా ప్రధాన నేరస్థుడు దుబాయ్​ నుంచి ఆపరేట్​ చేస్తున్నట్లు తేలింది. అతన్ని పట్టుకుంటే ఈ ముఠాలో ఇంకా ఎంతమంది ప్రమేయముందో తెలుస్తుందని టీజీసీఎస్‌బీ పోలీసులు భావిస్తున్నారు. ఈ సైబర్​ మోసాల వెనుక చైనా ముఠా హస్తం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మామూలుగా పెద్దఎత్తున లావాదేవీలు చేసే వ్యాపార సంస్థలకే కరెంటు ఎకౌంట్‌ ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. అయితే సేవింగ్స్‌ ఖాతాలతో పోల్చితే వీటిల్లో రోజూ భారీగా నగదు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

రెండు నెలల్లో 600 మంది నుంచి : సైబర్​నేరాల ద్వారా వచ్చే సొమ్మును త్వరగా తీసుకునేందుకు ముఠాలు కరెంట్​ ఖాతాలను తెరవడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలోనే దుబాయ్‌లో ఉంటున్న ప్రధాన నిందితుడు ఈ బాధ్యతను హైదరాబాద్‌లోని విజయ్‌నగర్‌కాలనీకి చెందిన మహ్మద్‌ సోయబ్‌ తాఖీర్‌(34), మొఘల్‌పురాకు చెందిన మహ్మద్‌బిన్‌ అహ్మద్‌ బవజీర్‌(49)కు అప్పగించాడు. వీరిద్దరు రోజువారీ కూలీలు, ఆటోడ్రైవర్లు. ఇలాంటి వారిని బురిడీ కొట్టించి వారితో కరెంటు ఖాతాలను తెరిపించేవారు. అలా ఎస్‌బీఐ శంషీర్‌గంజ్‌ బ్రాంచిలో గత ఫిబ్రవరిలో ఆరు ఖాతాలు తెరిపించారు. మార్చి, ఏప్రిల్​లో సుమారు 600 మంది సైబర్​ బాధితుల నుంచి కొల్లగొట్టిన రూ.175 కోట్ల సొమ్మును వీటిల్లోకి చేరింది.

దీంతో పోలీసులు ఖాతాదారులను విచారించగా కమీషన్ల ఆశ చూపి సోయబ్, బవజీర్‌లే ఖాతాలు తెరిపించారని తెలిపారు. అంతేకాకుండా తమతో చెక్కులపై సంతకాలు కూడా చేయించుకుని వారే తీసుకున్నారని వెల్లడించారు. అనంతరం షోయబ్, బవజీర్‌లను అరెస్టు చేసి విచారించగా దుబాయ్​ లింకులు బయటపడ్డాయి. అక్కడున్న ప్రధాన నిందితుడి ఆదేశాల మేరకే తాము బ్యాంకు ఖాతాలు తెరిపించామని వారిద్దరూ అంగీకరించారు. ఖాతాల్లోకి వచ్చిన సైబర్​ మోసాల సొమ్మును ఎప్పటికప్పుడు విత్​డ్రా చేసుకుని ఏజెంట్ల ద్వారా హవాలా రూపంలో దుబాయ్‌కు తరలించినట్లు చెప్పారు.

వ్యాపారాలు లేనివారికి కరెంట్​ ఖాతాలా? : కొన్నిసార్లు క్రిప్టో కరెన్సీ రూపంలో కూడా సొమ్మును చేరవేసినట్లు ఆ ఇద్దరు నిందితులు తెలిపారు. ఇందుకుగాను తమకు రూ.వేలల్లో కమీషన్​ వచ్చేదని వెల్లడించారు. అనంతర వీరిద్దరిని పోలీసులు రిమాండ్​కు తరలించారు. అయితే ఎలాంటి వ్యాపారాలు లేనివారికి కరెంట్​ ఖాతాలు బ్యాంకు అధికారులు ఎలా అనుమతించారనే కోణంలోనూ టీజీసీఎస్‌బీ ఆరా తీస్తోంది.

బీ కేర్​ఫుల్!! మీ మొబైల్​కు లింక్ వచ్చిందా? - క్లిక్ చేశారో బుక్కైపోతారు - Trading Crimes Through Whatsapp

Police Nab 175 crore Rupees Cyber Fraudsters : ఓ సైబర్‌ నేరస్థుల ముఠా కేవలం రెండు నెలల్లోనే ఏకంగా రూ.175 కోట్లు కాజేసింది. ఈ సొమ్మును ఆరు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించింది. నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌(ఎన్‌సీఆర్‌పీ)కి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) పోలీసులు కేసును సుమోటోగా నమోదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌లోని బ్యాంకు ఖాతాల్లోకి ఈ సొమ్మును మళ్లించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా ఖాతాదారుల గురించి ఆరా తీస్తే ఆశ్చర్యకరంగా అవి ఆటోడ్రైవర్లవని బయటపడింది.

వారిని విచారించగా సైబర్‌ ముఠాలో ఇద్దరు కీలక నిందితులు చిక్కారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కూపీలాగితే ముఠా ప్రధాన నేరస్థుడు దుబాయ్​ నుంచి ఆపరేట్​ చేస్తున్నట్లు తేలింది. అతన్ని పట్టుకుంటే ఈ ముఠాలో ఇంకా ఎంతమంది ప్రమేయముందో తెలుస్తుందని టీజీసీఎస్‌బీ పోలీసులు భావిస్తున్నారు. ఈ సైబర్​ మోసాల వెనుక చైనా ముఠా హస్తం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మామూలుగా పెద్దఎత్తున లావాదేవీలు చేసే వ్యాపార సంస్థలకే కరెంటు ఎకౌంట్‌ ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు అనుమతిస్తాయి. అయితే సేవింగ్స్‌ ఖాతాలతో పోల్చితే వీటిల్లో రోజూ భారీగా నగదు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

రెండు నెలల్లో 600 మంది నుంచి : సైబర్​నేరాల ద్వారా వచ్చే సొమ్మును త్వరగా తీసుకునేందుకు ముఠాలు కరెంట్​ ఖాతాలను తెరవడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలోనే దుబాయ్‌లో ఉంటున్న ప్రధాన నిందితుడు ఈ బాధ్యతను హైదరాబాద్‌లోని విజయ్‌నగర్‌కాలనీకి చెందిన మహ్మద్‌ సోయబ్‌ తాఖీర్‌(34), మొఘల్‌పురాకు చెందిన మహ్మద్‌బిన్‌ అహ్మద్‌ బవజీర్‌(49)కు అప్పగించాడు. వీరిద్దరు రోజువారీ కూలీలు, ఆటోడ్రైవర్లు. ఇలాంటి వారిని బురిడీ కొట్టించి వారితో కరెంటు ఖాతాలను తెరిపించేవారు. అలా ఎస్‌బీఐ శంషీర్‌గంజ్‌ బ్రాంచిలో గత ఫిబ్రవరిలో ఆరు ఖాతాలు తెరిపించారు. మార్చి, ఏప్రిల్​లో సుమారు 600 మంది సైబర్​ బాధితుల నుంచి కొల్లగొట్టిన రూ.175 కోట్ల సొమ్మును వీటిల్లోకి చేరింది.

దీంతో పోలీసులు ఖాతాదారులను విచారించగా కమీషన్ల ఆశ చూపి సోయబ్, బవజీర్‌లే ఖాతాలు తెరిపించారని తెలిపారు. అంతేకాకుండా తమతో చెక్కులపై సంతకాలు కూడా చేయించుకుని వారే తీసుకున్నారని వెల్లడించారు. అనంతరం షోయబ్, బవజీర్‌లను అరెస్టు చేసి విచారించగా దుబాయ్​ లింకులు బయటపడ్డాయి. అక్కడున్న ప్రధాన నిందితుడి ఆదేశాల మేరకే తాము బ్యాంకు ఖాతాలు తెరిపించామని వారిద్దరూ అంగీకరించారు. ఖాతాల్లోకి వచ్చిన సైబర్​ మోసాల సొమ్మును ఎప్పటికప్పుడు విత్​డ్రా చేసుకుని ఏజెంట్ల ద్వారా హవాలా రూపంలో దుబాయ్‌కు తరలించినట్లు చెప్పారు.

వ్యాపారాలు లేనివారికి కరెంట్​ ఖాతాలా? : కొన్నిసార్లు క్రిప్టో కరెన్సీ రూపంలో కూడా సొమ్మును చేరవేసినట్లు ఆ ఇద్దరు నిందితులు తెలిపారు. ఇందుకుగాను తమకు రూ.వేలల్లో కమీషన్​ వచ్చేదని వెల్లడించారు. అనంతర వీరిద్దరిని పోలీసులు రిమాండ్​కు తరలించారు. అయితే ఎలాంటి వ్యాపారాలు లేనివారికి కరెంట్​ ఖాతాలు బ్యాంకు అధికారులు ఎలా అనుమతించారనే కోణంలోనూ టీజీసీఎస్‌బీ ఆరా తీస్తోంది.

బీ కేర్​ఫుల్!! మీ మొబైల్​కు లింక్ వచ్చిందా? - క్లిక్ చేశారో బుక్కైపోతారు - Trading Crimes Through Whatsapp

Last Updated : Aug 26, 2024, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.