ETV Bharat / state

గ్రామ స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి వెంకయ్య నాయుడు : ప్రధాని మోదీ - Modi Release 3 Books on Venkaiah

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 3:46 PM IST

Former Vice President Venkaiah Naidu 75th Birthday : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత జర్నీ గురించి మూడు పుస్తకాలు రాశారు. ఆ మూడు పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్​గా విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి వెంకయ్య నాయుడు అని కొనియాడారు.

Former Vice President Venkaiah Naidu 75th Birthday
Former Vice President Venkaiah Naidu 75th Birthday (ETV Bharat)

PM Narendra Modi Released Three Books on Venkaiah Naidu : గ్రామ స్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి వేలాది కార్యకర్తలు ఎంతో నేర్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని, దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని అన్నారు. వెంకయ్యనాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై ప్రచురితమైన మూడు పుస్తకాలను వర్చువల్​గా​ మోదీ విడుదల చేశారు.

దీనికి సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్​ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెక్షన్​ సెంటర్​లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవలో వెంకయ్యనాయుడు జీవితం, 13వ ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం అనే మూడు పుస్తకాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ "వెంకయ్య నాయుడుతో సుదీర్ఘ కాలం పని చేసే అవకాశం నాకు దక్కింది. అత్యయిక పరిస్థితి వేళ వెంకయ్యనాయుడు పోరాడారు. అత్యయిక పరిస్థితి సమయంలో 17 నెలలు జైలు జీవితం గడిపారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలో తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛ భారత్​, అమృత్​ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారు. ఆయన వాగ్దాటి ముందు ఎవరూ నిలువలేరు. రాజ్యసభ ఛైర్మన్​గా విజయపథంలో నడిపారు. దీర్ఘకాలం ఆయన ఆరోగ్యంగా ఉండి అందరినీ మార్గనిర్దేశంలో నడపాలి' అని అన్నారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరూ నిలువలేరని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభ ఛైర్మన్​గా ఆయన సేవలను దేశం మరవదని తెలిపారు. ఆర్టికల్​ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభ ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. ఆ బిల్లు ఆమోదంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. రాజ్యసభ నిర్వహణలో ఆయన అనుభవం ఉపయోగపడిందని చెప్పారు.

అనంతరం దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. రిఫార్మ్​, పర్​ఫార్మ్​, ట్రాన్స్​ఫార్మ్​ నినాదంతో ముందుకెళ్తున్నారని కొనియాడారు. అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్​ పథకం కొనసాగించాలని కేంద్రానికి సూచించారు. యువత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. మాతృభాషలను కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయమని తెలిపారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లోనే ఉండాలని పేర్కొన్నారు. భారతీయ భాషల తర్వాతే ప్రభుత్వ ఆదేశాలు ఆంగ్ల భాషలో ఉండాలని సూచించారు. మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు తమకు ఈ పని కావాలని తన కుమార్తె, అల్లుడు అడగలేదని, తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడూ పనులు కావాలని తమ కుటుంబసభ్యులు అడగలేదని గుర్తు చేసుకున్నారు.

ఉత్సాహం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలి : 'ఉత్సాహం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలి. సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలి. చట్ట సభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలి. విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలి. విలువలు కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియట్లేదు. సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చు. పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలి. కార్యకర్తలకు నేతలు ప్రవర్తనా నియమావళి రూపొందించాలి. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించాలి. రాజకీయాల్లో కులం, ధనం ప్రభావం తగ్గిపోవాలి. గుణం చూసి నాయకులకు ఓటు వేయాలి. మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. దేశ ప్రతిష్ఠను నిలబెట్టాలంటే చెడుపోకడలను అడ్డుకోవాలి' అని వెంకయ్య నాయుడు కోరారు.

రామోజీరావుతో అనుబంధం నాకెంతో అపురూపం - ఆ ఫొటోలు చాలా ప్రత్యేకం : వెంకయ్యనాయుడు - Venkaiah Naidu About Ramoji Rao

పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - Venkaiah Naidu Padma Vibhushan

PM Narendra Modi Released Three Books on Venkaiah Naidu : గ్రామ స్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుంచి వేలాది కార్యకర్తలు ఎంతో నేర్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని, దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని అన్నారు. వెంకయ్యనాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై ప్రచురితమైన మూడు పుస్తకాలను వర్చువల్​గా​ మోదీ విడుదల చేశారు.

దీనికి సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్​ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెక్షన్​ సెంటర్​లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవలో వెంకయ్యనాయుడు జీవితం, 13వ ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం అనే మూడు పుస్తకాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ "వెంకయ్య నాయుడుతో సుదీర్ఘ కాలం పని చేసే అవకాశం నాకు దక్కింది. అత్యయిక పరిస్థితి వేళ వెంకయ్యనాయుడు పోరాడారు. అత్యయిక పరిస్థితి సమయంలో 17 నెలలు జైలు జీవితం గడిపారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలో తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛ భారత్​, అమృత్​ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారు. ఆయన వాగ్దాటి ముందు ఎవరూ నిలువలేరు. రాజ్యసభ ఛైర్మన్​గా విజయపథంలో నడిపారు. దీర్ఘకాలం ఆయన ఆరోగ్యంగా ఉండి అందరినీ మార్గనిర్దేశంలో నడపాలి' అని అన్నారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరూ నిలువలేరని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభ ఛైర్మన్​గా ఆయన సేవలను దేశం మరవదని తెలిపారు. ఆర్టికల్​ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభ ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. ఆ బిల్లు ఆమోదంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. రాజ్యసభ నిర్వహణలో ఆయన అనుభవం ఉపయోగపడిందని చెప్పారు.

అనంతరం దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. రిఫార్మ్​, పర్​ఫార్మ్​, ట్రాన్స్​ఫార్మ్​ నినాదంతో ముందుకెళ్తున్నారని కొనియాడారు. అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్​ పథకం కొనసాగించాలని కేంద్రానికి సూచించారు. యువత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. మాతృభాషలను కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయమని తెలిపారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లోనే ఉండాలని పేర్కొన్నారు. భారతీయ భాషల తర్వాతే ప్రభుత్వ ఆదేశాలు ఆంగ్ల భాషలో ఉండాలని సూచించారు. మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు తమకు ఈ పని కావాలని తన కుమార్తె, అల్లుడు అడగలేదని, తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడూ పనులు కావాలని తమ కుటుంబసభ్యులు అడగలేదని గుర్తు చేసుకున్నారు.

ఉత్సాహం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలి : 'ఉత్సాహం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలి. సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలి. చట్ట సభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలి. విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలి. విలువలు కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియట్లేదు. సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చు. పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలి. కార్యకర్తలకు నేతలు ప్రవర్తనా నియమావళి రూపొందించాలి. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించాలి. రాజకీయాల్లో కులం, ధనం ప్రభావం తగ్గిపోవాలి. గుణం చూసి నాయకులకు ఓటు వేయాలి. మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. దేశ ప్రతిష్ఠను నిలబెట్టాలంటే చెడుపోకడలను అడ్డుకోవాలి' అని వెంకయ్య నాయుడు కోరారు.

రామోజీరావుతో అనుబంధం నాకెంతో అపురూపం - ఆ ఫొటోలు చాలా ప్రత్యేకం : వెంకయ్యనాయుడు - Venkaiah Naidu About Ramoji Rao

పద్మవిభూషణ్ అందుకున్న వెంకయ్యనాయుడు - Venkaiah Naidu Padma Vibhushan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.