ETV Bharat / state

15 రోజుల్లో 4500పైగా ఫోన్లు ట్యాపింగ్​ - వెలుగులోకి కీలక విషయాలు - TELANGANA PHONE TAPPING CASE UPDATE

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Phone Tapping Case : ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 15 రోజుల్లో 4 వేల 5 వందలకుపైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై వాదనల వేళ ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తెచ్చారు. సీఎం రేవంత్​రెడ్డి సహా ఇతర నేతల ట్యాపింగ్​కు సంబంధించి 340 జీబీ సమాచారాన్ని పోలీసులు వెలికితీస్తున్నారు.

Phone Tapping Case News Latest
Phone Tapping Case (ETV Bharat)

Phone Tapping Case News Latest : ఫోన్‌ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలో 4 వేల 5 వందలకుపైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో నాలుగో నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై జరిగిన వాదనల సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నవంబరు 15 నుంచి 30వ తేదీల మధ్యనే అన్ని ఫోన్లను ట్యాప్ చేసినట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి సహా ఇతర నేతలు, వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సుమారు 340జీబీ సమాచారాన్ని పోలీసులు వెలికితీసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో హైదరాబాద్‌ పోలీసులు ఇప్పటికే అభియోగపత్రం నమోదు చేశారు.

మరికొన్ని రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్​ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును విదేశాల నుంచి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు నివేదిక పంపించారు. ఈ క్రమంలో రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ అయి నిందితులిద్దరినీ భారత్‌కు డిపోర్ట్‌ (బలవంతంగా స్వదేశానికి తిప్పిపంపడం) చేస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ విధంగా నిందితులు దొరికితే వారిని సైతం విచారించి ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న సమాచారం తెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సమాచారం సేకరించిన వెంటనే దర్యాప్తు వివరాలతో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయాలని భావిస్తున్నారు.

ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు : ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే తాము ఈ అక్రమానికి పాల్పడినట్లు నిందితులంతా పోలీసులకు దర్యాప్తులో వెల్లడించారు. దీంతో కేసు తదుపరి దర్యాప్తు అంతా ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల విచారణ పైనే కేంద్రీకృతమైంది. చివరిగా వారిని విచారిస్తేనే దర్యాప్తు ముందుకు సాగడంతోపాటు పొలిటికల్​ సంబంధాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ గత పోలీస్ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కొద్దిరోజుల క్రితం దిల్లీకి వెళ్లి కేసు ప్రాధాన్యాన్ని సీబీఐ అధికారులకు వివరించారు. ఈ క్రమంలోనే తాజాగా రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు నివేదిక పంపించారు.

Phone Tapping Case News Latest : ఫోన్‌ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా కేవలం 15 రోజుల వ్యవధిలో 4 వేల 5 వందలకుపైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో నాలుగో నిందితుడు మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై జరిగిన వాదనల సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నవంబరు 15 నుంచి 30వ తేదీల మధ్యనే అన్ని ఫోన్లను ట్యాప్ చేసినట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి సహా ఇతర నేతలు, వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సుమారు 340జీబీ సమాచారాన్ని పోలీసులు వెలికితీసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో హైదరాబాద్‌ పోలీసులు ఇప్పటికే అభియోగపత్రం నమోదు చేశారు.

మరికొన్ని రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్​ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును విదేశాల నుంచి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు నివేదిక పంపించారు. ఈ క్రమంలో రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ అయి నిందితులిద్దరినీ భారత్‌కు డిపోర్ట్‌ (బలవంతంగా స్వదేశానికి తిప్పిపంపడం) చేస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ విధంగా నిందితులు దొరికితే వారిని సైతం విచారించి ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న సమాచారం తెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సమాచారం సేకరించిన వెంటనే దర్యాప్తు వివరాలతో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేయాలని భావిస్తున్నారు.

ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు : ప్రభాకర్‌రావు ఆదేశాలతోనే తాము ఈ అక్రమానికి పాల్పడినట్లు నిందితులంతా పోలీసులకు దర్యాప్తులో వెల్లడించారు. దీంతో కేసు తదుపరి దర్యాప్తు అంతా ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావుల విచారణ పైనే కేంద్రీకృతమైంది. చివరిగా వారిని విచారిస్తేనే దర్యాప్తు ముందుకు సాగడంతోపాటు పొలిటికల్​ సంబంధాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ గత పోలీస్ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కొద్దిరోజుల క్రితం దిల్లీకి వెళ్లి కేసు ప్రాధాన్యాన్ని సీబీఐ అధికారులకు వివరించారు. ఈ క్రమంలోనే తాజాగా రెడ్ కార్నర్ నోటీసుల జారీ కోసం సీబీఐ ద్వారా ఇంటర్‌పోల్‌కు నివేదిక పంపించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పురోగతి - ప్రభాకర్‌ రావు, శ్రవణ్‌ రావుకు రెడ్​కార్నర్ నోటీసులు! - Phone Tapping Case Update

ఎస్ఐబీ మాజీ చీఫ్​పై త్వరలో రెడ్​కార్నర్ నోటీస్ : హైదరాబాద్ సీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.