ETV Bharat / state

'మాకు తెలంగాణ బియ్యం కావాలి' - రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఫిలిప్పీన్స్ - Uttam Kumar Reddy On TG Rice - UTTAM KUMAR REDDY ON TG RICE

రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతి చేయాలని కోరిన ఫిలిప్పీన్స్​ - 3 లక్షల టన్నుల రైస్​ ఎగుమతుల అంశంపై చర్చ

Philippines minister Meets Minister Uttam Kumar
Philippines minister Meets Minister Uttam Kumar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2024, 4:05 PM IST

Philippines minister Meets Minister Uttam Kumar : తెలంగాణ బియ్యం కావాలని ఫిలిప్పీన్స్‌ దేశం కోరింది. ఈ మేరకు ఆ దేశ ఆహార, వ్యవసాయశాఖ మంత్రి రోజేర్స్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఈ విషయంపై చర్చించారు. ఫిలిప్పీన్స్​ ప్రతినిధులు కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ డి.ఎస్‌.చౌహాన్, ఇతర నిపుణులతో మాట్లాడి వెళ్లారు. శనివారం ఇక్కడ పౌర సరఫరాల భవన్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్​, ఫిలిప్పీన్స్‌ మంత్రి రోజేర్స్‌ పాల్గొన్నారు.

3 లక్షల టన్నుల బియ్యం ఎగుమతుల అంశంపై చర్చ : ఈ సమావేశంలో తెలంగాణ నుంచి 3 లక్షల టన్నుల బియ్యం ఎగుమతుల అంశం ప్రతిపాదనపై ప్రాథమికంగా చర్చించారు. తెలంగాణ బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ధాన్యం రకాలు, బియ్యం నాణ్యతపై ఆయన వివరించారు. విదేశాలకు బియ్యం ఎగుమతులపై ప్రస్తుతం 10 శాతం సుంకం​ ఉంది. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న నేపథ్యంలో బియ్యం ఎగుమతుల విషయంలో సుంకం మినహాయింపుపై రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. ఆయన త్వరలో ఫిలిప్పీన్స్‌కు వెళ్లి మరో దఫా చర్చలు జరపనున్నారు. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చాక బియ్యం ధరపై నిర్ణయముంటుందని పౌరసరఫరాలశాఖ వర్గాల సమాచారం.

Philippines minister Meets Minister Uttam Kumar : తెలంగాణ బియ్యం కావాలని ఫిలిప్పీన్స్‌ దేశం కోరింది. ఈ మేరకు ఆ దేశ ఆహార, వ్యవసాయశాఖ మంత్రి రోజేర్స్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఈ విషయంపై చర్చించారు. ఫిలిప్పీన్స్​ ప్రతినిధులు కొద్దిరోజుల క్రితం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ డి.ఎస్‌.చౌహాన్, ఇతర నిపుణులతో మాట్లాడి వెళ్లారు. శనివారం ఇక్కడ పౌర సరఫరాల భవన్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌ కుమార్​, ఫిలిప్పీన్స్‌ మంత్రి రోజేర్స్‌ పాల్గొన్నారు.

3 లక్షల టన్నుల బియ్యం ఎగుమతుల అంశంపై చర్చ : ఈ సమావేశంలో తెలంగాణ నుంచి 3 లక్షల టన్నుల బియ్యం ఎగుమతుల అంశం ప్రతిపాదనపై ప్రాథమికంగా చర్చించారు. తెలంగాణ బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ధాన్యం రకాలు, బియ్యం నాణ్యతపై ఆయన వివరించారు. విదేశాలకు బియ్యం ఎగుమతులపై ప్రస్తుతం 10 శాతం సుంకం​ ఉంది. సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న నేపథ్యంలో బియ్యం ఎగుమతుల విషయంలో సుంకం మినహాయింపుపై రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. ఆయన త్వరలో ఫిలిప్పీన్స్‌కు వెళ్లి మరో దఫా చర్చలు జరపనున్నారు. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చాక బియ్యం ధరపై నిర్ణయముంటుందని పౌరసరఫరాలశాఖ వర్గాల సమాచారం.

గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ఈసారి ధాన్యం ఇచ్చేది లేదు : ఉత్తమ్​ - Minister Uttam On Paddy Procurement

అక్టోబర్​లో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ : మంత్రి ఉత్తమ్‌ - Minister Uttam on New Ration Cards

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.