ETV Bharat / state

ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన - ఇద్దరు నిందితుల అరెస్ట్ - PRAKASAM BARRAGE BOATS CASE

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 5:33 PM IST

Prakasam Barrage Boat Incident Update : విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేశారు. ఈ సంఘటన వెనుక కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు. బోట్లు రిజిస్ట్రేషన్​ నంబర్ల ఆధారంగా యజమానులను గుర్తించామని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

AP CM CHANDRABABU SERIOUS ON PRAKASAM BARRAGE BOATS HIT ISSUE
Officers Report to CM Chandrababu on Prakasam Barrage Boats Hit (ETV Bharat)

Officers Report to CM Chandrababu on Prakasam Barrage Boats Hit : ఆంధ్రప్రదేశ్ విజయవాడ​లోని ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అధికారులు రిపోర్ట్​లో వెల్లడించారు. ఢీకొన్న బోట్లు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలవని నిర్ధారించారు. దీంతో బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గొల్లపూడికి చెందిన పడవల యజమాని ఉషాద్రి, సూరాయపాలెం వాసి కోమటి రామ్మోహన్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.

కొట్టుకొచ్చిన 3 పడవలూ కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి విజయవాడ కోర్టుకు తరలించారు. రిమాండ్ విధించాక కుట్ర కోణంపై సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. కాగా ఈ ఘటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేశ్​ అనుచరుల బోట్లు ఉన్నట్లు ఇప్పటికే నివేదికలో వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేశ్​​, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు.

ఉషాద్రికి చెందిన మూడు బోట్లును కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం : బోట్లు రిజిస్ట్రేషన్ల నంబర్​ ఆధారంగా యాజమానులను గుర్తించామని అధికారులు నివేదికలో వెల్లడించారు. బోట్లు ఉషాద్రి, కర్రి నరసింహ స్వామి, గూడూరు నాగమల్లేశ్వరికి చెందినవిగా గుర్తించారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లును కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందని వెల్లడించారు. బోట్లును ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్​ తాళ్లతో కట్టేసినట్లు అధికారులు గుర్తించారు.

తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేసి ఉంటారని ఆరోపించారు. సెప్టెంబర్​ 2న తెల్లవారు జామున 3 గంటల సమయంలో 5 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టినట్లు అధికారులు రిపోర్ట్​లో వెల్లడించారు. బోట్లు గేట్లకు ఉండే కౌంటర్​ వెయిట్​లకు కాకుండా బ్యారేజీ పిల్లర్లను బలంగా ఢీ కొని ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని తెలిపారు. మరోవైపు పోలీసులు అనుమానితుల కాల్​ డేటాను సైతం పరిశీలిస్తున్నారు.

'ఆరోజు రాత్రి ఏం జరిగింది? ఆ పడవలు ఎవరివి?'- ప్రకాశం బ్యారేజీ కుట్రకోణంపై పోలీసుల దర్యాప్తు - Prakasam Barrage Boat Incident

ఉత్తరాంధ్రలో హై అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - Red Alert Issued In North Andhra

Officers Report to CM Chandrababu on Prakasam Barrage Boats Hit : ఆంధ్రప్రదేశ్ విజయవాడ​లోని ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అధికారులు రిపోర్ట్​లో వెల్లడించారు. ఢీకొన్న బోట్లు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలవని నిర్ధారించారు. దీంతో బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గొల్లపూడికి చెందిన పడవల యజమాని ఉషాద్రి, సూరాయపాలెం వాసి కోమటి రామ్మోహన్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.

కొట్టుకొచ్చిన 3 పడవలూ కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి విజయవాడ కోర్టుకు తరలించారు. రిమాండ్ విధించాక కుట్ర కోణంపై సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. కాగా ఈ ఘటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేశ్​ అనుచరుల బోట్లు ఉన్నట్లు ఇప్పటికే నివేదికలో వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేశ్​​, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు.

ఉషాద్రికి చెందిన మూడు బోట్లును కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం : బోట్లు రిజిస్ట్రేషన్ల నంబర్​ ఆధారంగా యాజమానులను గుర్తించామని అధికారులు నివేదికలో వెల్లడించారు. బోట్లు ఉషాద్రి, కర్రి నరసింహ స్వామి, గూడూరు నాగమల్లేశ్వరికి చెందినవిగా గుర్తించారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లును కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందని వెల్లడించారు. బోట్లును ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్​ తాళ్లతో కట్టేసినట్లు అధికారులు గుర్తించారు.

తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేసి ఉంటారని ఆరోపించారు. సెప్టెంబర్​ 2న తెల్లవారు జామున 3 గంటల సమయంలో 5 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టినట్లు అధికారులు రిపోర్ట్​లో వెల్లడించారు. బోట్లు గేట్లకు ఉండే కౌంటర్​ వెయిట్​లకు కాకుండా బ్యారేజీ పిల్లర్లను బలంగా ఢీ కొని ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని తెలిపారు. మరోవైపు పోలీసులు అనుమానితుల కాల్​ డేటాను సైతం పరిశీలిస్తున్నారు.

'ఆరోజు రాత్రి ఏం జరిగింది? ఆ పడవలు ఎవరివి?'- ప్రకాశం బ్యారేజీ కుట్రకోణంపై పోలీసుల దర్యాప్తు - Prakasam Barrage Boat Incident

ఉత్తరాంధ్రలో హై అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - Red Alert Issued In North Andhra

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.