ETV Bharat / state

చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన 10 మంది - సురక్షితంగా కాపాడిన పోలీసులు - Nagarkurnool Rainy Floods

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 10:51 AM IST

Updated : Sep 3, 2024, 11:31 AM IST

Fishermen Stuck in a Stream : నాగర్​కర్నూల్ జిల్లా బల్మూరు మండలం సిద్ధాపూర్ శివారు దుందుబి వాగులో చిక్కుకున్న10 మంది చెంచులను అచ్చంపేట, దేవరకొండ పోలీసులు సురక్షితంగా బయటకు తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సాయంతో తాళ్లు కట్టి పుట్టిల్లో వారిని ఒడ్డుకు చేర్చారు. 2, 3 రోజులుగా ఆహారం లేకపోవడంతో వారికి ఆహారం అందించారు.

Police Help Victims in Flood Areas
Fishermen Stuck in a Stream (ETV Bharat)

Ten People Trapped Floods In Nagarkurnool : నాగర్​కర్నూల్ జిల్లా బల్మూరు మండలం సిద్దాపూర్ శివారు దుందుబి వాగులో చేపల వేటకు వెళ్లి 10 మంది చెంచులు చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో స్పందించిన అచ్చంపేట, దేవరకొండ పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆహారం అందించి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లికి చెందిన జలల్ గురువయ్య, ఆయన భార్య నిరంజనమ్మ, కుమారులు బయ్యన్న, సత్యయ్య, చినపాపయ్య, చిన్న పాపయ్య భార్య యాదమ్మ, వారి ఐదు, మూడేళ్ల కూతుళ్లు అంజలి, అఖిల, కుమారుడు శివ మరో ఏడాది లోపు చిన్నారి వాగులో చిక్కుకున్న వారిలో ఉన్నారు. మూడు రోజుల కిందట చేపల వేట కోసం వెళ్లిన ఆ కుటుంబం, వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాగు మధ్యలోని గడ్డకు చేరుకున్నారు.

కానీ రెండు రోజులుగా వాగు ఉద్ధృతి తగ్గకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్థానికులకు సమాచారం చేరవేయగా, అచ్చంపేట పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన పోలీసులు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రవిందర్, ఎస్సై రాముతో పాటు డిండి ఎస్సై రాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి సోమశిల నుంచి గజ ఈత గాళ్లను రప్పించారు. డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం అందించారు. చీకటి కావడంతో వారిని వాగు మధ్యలోంచి తీసుకురావడం కష్టంగా మారింది.

Police Help Victims in Flood Areas : ఈరోజు ఉదయం అగ్నిమాపక సిబ్బంది సాయంతో తాళ్లు కట్టి వరదల్లో చిక్కుకున్న 10 మందిని ఒడ్డుకు చేర్చారు. రెండు మూడు రోజులుగా ఆహారం లేకపోవడంతో వారికి ఆహారం అందించారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక చికిత్స అందించి వైద్యం కోసం బాధితుల్ని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వరదల్లో చిక్కుకున్న వారిని శ్రమించి కాపాడిన పోలీసులను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

జల విలయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కకావికలం - ఊరూఏరును ఏకం చేసిన జడివాన - Heavy Rains Floods In Khammam

కాస్త తగ్గుముఖం పట్టిన వర్షాలు - క్షేత్రస్థాయిలో బాధితులకు భరోసా కల్పిస్తున్న అధికారులు - Heavy Rains In Telangana

Ten People Trapped Floods In Nagarkurnool : నాగర్​కర్నూల్ జిల్లా బల్మూరు మండలం సిద్దాపూర్ శివారు దుందుబి వాగులో చేపల వేటకు వెళ్లి 10 మంది చెంచులు చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో స్పందించిన అచ్చంపేట, దేవరకొండ పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు. రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆహారం అందించి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లికి చెందిన జలల్ గురువయ్య, ఆయన భార్య నిరంజనమ్మ, కుమారులు బయ్యన్న, సత్యయ్య, చినపాపయ్య, చిన్న పాపయ్య భార్య యాదమ్మ, వారి ఐదు, మూడేళ్ల కూతుళ్లు అంజలి, అఖిల, కుమారుడు శివ మరో ఏడాది లోపు చిన్నారి వాగులో చిక్కుకున్న వారిలో ఉన్నారు. మూడు రోజుల కిందట చేపల వేట కోసం వెళ్లిన ఆ కుటుంబం, వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాగు మధ్యలోని గడ్డకు చేరుకున్నారు.

కానీ రెండు రోజులుగా వాగు ఉద్ధృతి తగ్గకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్థానికులకు సమాచారం చేరవేయగా, అచ్చంపేట పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన పోలీసులు అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రవిందర్, ఎస్సై రాముతో పాటు డిండి ఎస్సై రాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి సోమశిల నుంచి గజ ఈత గాళ్లను రప్పించారు. డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం అందించారు. చీకటి కావడంతో వారిని వాగు మధ్యలోంచి తీసుకురావడం కష్టంగా మారింది.

Police Help Victims in Flood Areas : ఈరోజు ఉదయం అగ్నిమాపక సిబ్బంది సాయంతో తాళ్లు కట్టి వరదల్లో చిక్కుకున్న 10 మందిని ఒడ్డుకు చేర్చారు. రెండు మూడు రోజులుగా ఆహారం లేకపోవడంతో వారికి ఆహారం అందించారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక చికిత్స అందించి వైద్యం కోసం బాధితుల్ని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వరదల్లో చిక్కుకున్న వారిని శ్రమించి కాపాడిన పోలీసులను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

జల విలయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కకావికలం - ఊరూఏరును ఏకం చేసిన జడివాన - Heavy Rains Floods In Khammam

కాస్త తగ్గుముఖం పట్టిన వర్షాలు - క్షేత్రస్థాయిలో బాధితులకు భరోసా కల్పిస్తున్న అధికారులు - Heavy Rains In Telangana

Last Updated : Sep 3, 2024, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.