ETV Bharat / state

సికింద్రాబాద్​​ పార్లమెంట్​ ఎన్నికల్లో ముస్లిం ఓట్లే కీలకం - మైనారిటీ ఓటర్ల మొగ్గు ఎటు? - Muslim Voters Predominance

author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 5:04 PM IST

Muslim Voters Predominance in Secunderabad : సికింద్రాబాద్ లోక్​సభ ఎన్నికల్లో వారే కీలకం కానున్నారు. గెలుపు - ఓటములు వాళ్లే నిర్ణయించనున్నారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం, మైనార్టీలు ఎవరివైపు ఉంటారో, వారి విజయం సులువు కానుంది. అందుకే వారిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీల నేతలు పార్లమెంట్​ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వారి సంక్షేమానికి భరోసా ఇస్తున్నారు. మరి సికింద్రాబాద్ మైనార్టీ ఓటర్లు ఎవరికి ఓటు వేయనున్నారు? ఆ వివరాలు తెలుసుకుందాం.

Minority Voters Verdict in Secunderabad Constituency
Muslim Voters Predominance in Secunderabad (ETV Bharat)

Minority Voters Verdict in Secunderabad Constituency : దేశంలో భిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే, సికింద్రాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లిం, మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో అన్ని పార్టీల నేతలు మైనార్టీల సంక్షేమానికి కృషిచేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంబర్ పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో పురుష ఓటర్లు అధికంగా ఉన్న నాలుగు లోక్​సభ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటిగా ఉంది. ఇక్కడ మహిళల కంటే పురుషులు 53,479 మంది అధికంగా ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 21,20,550 ఓటర్లు ఉన్నారు.

Secunderabad Parliamentary Total Voters : ఇందులో పురుషులు 10,86,875 మంది ఉండగా, మహిళలు 10,33,396 ఉన్నారు. అంతేకాక 130 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు, 149 సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్లలో సుమారు ఐదు లక్షల ముస్లిం మైనార్టీ ఓటర్లే ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో బీజేపీ అభ్యర్థి కిషన్​రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు సిట్టింగ్​ అభ్యర్థులే పోటీచేస్తున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ కిషన్​రెడ్డి, కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ తరఫున సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావుగౌడ్​లు పోటీ చేస్తున్నారు.

మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ - కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల సాయం

2019 లోక్​సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లతో ఆధిక్యం సాధించగా, గులాబీ పార్టీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్​కు 3,22,666 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్​కు 1,73,229 ఓట్లు వచ్చాయి. తమ ప్రభుత్వ హయాంలో షాదీ ముబారక్ అందజేశామని, ముస్లిం మైనార్టీలకు అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలను అందించామని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. తమ ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందని, ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిందని, లోక్​సభ ఎన్నికల్లో హస్తానికి అండగా ఉండాలని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.

Muslim Voters Key Role in Secunderabad Constituency : ట్రిపుల్ తలాక్​ను రద్దు చేశామని, ముస్లిం మైనార్టీలకు తమ ప్రభుత్వంలోనే రక్షణ ఉంటుందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మూడు పార్టీల నేతలు,ముస్లింలు తమవైపే ఉన్నారని, తమకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్​ఎస్​ అభ్యర్థులు మాత్రం కచ్చితంగా మైనార్టీల మద్దతు తమకే ఉంటుందని పేర్కొంటున్నారు. మొత్తానికి ఎవరికి వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. సికింద్రాబాద్​లో గెలుపునకు మైనారిటీల మద్దతు చాలా కీలకం కానుంది.

ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముస్లింలు ఉన్నారు. నియోజకవర్గ పరిధిలోని చాలా ప్రాంతాల్లో వర్షాకాలంలో కాలనీలు నీట మునుగుతున్నాయి. కొన్ని కాలనీల్లో సమస్యలు పరిష్కారమైనా ఇంకా చాలాచోట్ల ఇబ్బందులు ఉన్నాయని నగరవాసులు పేర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని ఓటర్లు కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

Parliament Politics Revolving Around Muslim Issues : ధ్వంసమైన నాళాల పునర్నిర్మాణం జరగలేదని వీటి నిర్మాణంపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని, చాలాచోట్ల రహదారులు ఇరుగ్గా ఉన్నాయని, ఆక్రమణలు తొలగించి రహదారులు విస్తరించాలని సికింద్రాబాద్ లోక్​సభ ఓటర్లు కోరుతున్నారు. సికింద్రాబాద్ లోక్​సభలో ఎక్కువగా ఉన్న మైనారిటీలు ఎవరికి మద్దతు పలుకుతారో, ఎవరికి అండగా నిలుస్తారో తెలియాలంటే పోలింగ్ వరకు వేచి చూడాల్సిందే!

ముస్లిం రిజర్వేషన్ల తొలగింపు మోదీ, అమిత్ షాల తరం కాదు : రేవంత్​రెడ్డి

పాత దోస్తీ కొనసాగిస్తారా? కొత్త జట్టుతో జతకడతారా? - పార్లమెంట్​ ఎన్నికల్లో ఎంఐఎం ఎటువైపు? - Lok Sabha Elections 2024

Minority Voters Verdict in Secunderabad Constituency : దేశంలో భిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే, సికింద్రాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లిం, మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో అన్ని పార్టీల నేతలు మైనార్టీల సంక్షేమానికి కృషిచేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంబర్ పేట, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో పురుష ఓటర్లు అధికంగా ఉన్న నాలుగు లోక్​సభ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటిగా ఉంది. ఇక్కడ మహిళల కంటే పురుషులు 53,479 మంది అధికంగా ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 21,20,550 ఓటర్లు ఉన్నారు.

Secunderabad Parliamentary Total Voters : ఇందులో పురుషులు 10,86,875 మంది ఉండగా, మహిళలు 10,33,396 ఉన్నారు. అంతేకాక 130 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు, 149 సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఈ మొత్తం ఓటర్లలో సుమారు ఐదు లక్షల ముస్లిం మైనార్టీ ఓటర్లే ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో బీజేపీ అభ్యర్థి కిషన్​రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు సిట్టింగ్​ అభ్యర్థులే పోటీచేస్తున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ కిషన్​రెడ్డి, కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ తరఫున సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మారావుగౌడ్​లు పోటీ చేస్తున్నారు.

మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ - కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల సాయం

2019 లోక్​సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లతో ఆధిక్యం సాధించగా, గులాబీ పార్టీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్​కు 3,22,666 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్​కు 1,73,229 ఓట్లు వచ్చాయి. తమ ప్రభుత్వ హయాంలో షాదీ ముబారక్ అందజేశామని, ముస్లిం మైనార్టీలకు అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలను అందించామని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. తమ ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందని, ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిందని, లోక్​సభ ఎన్నికల్లో హస్తానికి అండగా ఉండాలని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.

Muslim Voters Key Role in Secunderabad Constituency : ట్రిపుల్ తలాక్​ను రద్దు చేశామని, ముస్లిం మైనార్టీలకు తమ ప్రభుత్వంలోనే రక్షణ ఉంటుందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మూడు పార్టీల నేతలు,ముస్లింలు తమవైపే ఉన్నారని, తమకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్​ఎస్​ అభ్యర్థులు మాత్రం కచ్చితంగా మైనార్టీల మద్దతు తమకే ఉంటుందని పేర్కొంటున్నారు. మొత్తానికి ఎవరికి వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. సికింద్రాబాద్​లో గెలుపునకు మైనారిటీల మద్దతు చాలా కీలకం కానుంది.

ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముస్లింలు ఉన్నారు. నియోజకవర్గ పరిధిలోని చాలా ప్రాంతాల్లో వర్షాకాలంలో కాలనీలు నీట మునుగుతున్నాయి. కొన్ని కాలనీల్లో సమస్యలు పరిష్కారమైనా ఇంకా చాలాచోట్ల ఇబ్బందులు ఉన్నాయని నగరవాసులు పేర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని ఓటర్లు కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

Parliament Politics Revolving Around Muslim Issues : ధ్వంసమైన నాళాల పునర్నిర్మాణం జరగలేదని వీటి నిర్మాణంపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని, చాలాచోట్ల రహదారులు ఇరుగ్గా ఉన్నాయని, ఆక్రమణలు తొలగించి రహదారులు విస్తరించాలని సికింద్రాబాద్ లోక్​సభ ఓటర్లు కోరుతున్నారు. సికింద్రాబాద్ లోక్​సభలో ఎక్కువగా ఉన్న మైనారిటీలు ఎవరికి మద్దతు పలుకుతారో, ఎవరికి అండగా నిలుస్తారో తెలియాలంటే పోలింగ్ వరకు వేచి చూడాల్సిందే!

ముస్లిం రిజర్వేషన్ల తొలగింపు మోదీ, అమిత్ షాల తరం కాదు : రేవంత్​రెడ్డి

పాత దోస్తీ కొనసాగిస్తారా? కొత్త జట్టుతో జతకడతారా? - పార్లమెంట్​ ఎన్నికల్లో ఎంఐఎం ఎటువైపు? - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.