ETV Bharat / state

'రైతుల హామీల అమలులో ప్రభుత్వం విఫలం - కనువిప్పు కలిగేలా రేపు బీజేపీ దీక్ష' - BJP RYTHU DEEKSHA IN HYDERABAD

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

BJP Rythu Deeksha In Hyderabad : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజూ బీజేపీ పార్టీ దీక్ష చేపట్టబోతుందని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

MP Etala Slams Congress
BJP Rythu Deeksha In Hyderabad (ETV Bharat)

MP Etala Slams Congress : సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయలేక పిల్లిగంతులు వేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని ఆయన తెలిపారు. రుణమాఫీ కాలేదని మేడ్చల్‌లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున బీజేపీ దీక్ష చేపట్టబోతుందని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

"సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయలేక పిల్లిగంతులు వేస్తున్నారు. రాష్ట్రంలో 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. రుణమాఫీ కాలేదని మేడ్చల్‌లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, సోమవారం రోజు బీజేపీ దీక్ష చేపట్టబోతుంది. రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలి". - ఈటల రాజేందర్, మల్కాజిగిరి ఎంపీ

హామీల విస్మరణ : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు రైతుబంధు, రైతు బీమా, రైతు బోనస్ వస్తాయనే నమ్మకం లేకుండాపోయిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అరాచక ప్రభుత్వంతో రైతులకు అన్యాయం జరుగుతోందని, రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నామన్నారు.

నాడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో 418 హామీలను ఇచ్చారని, ఆయా హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అందులో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, రకరకాలుగా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీని తీసుకువచ్చి అమాయకమైన రైతులకు మాయమాటలు చెప్పారని దుయ్యబట్టారు. రైతన్నలకు రుణమాఫీ చేస్తానని, పంటకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి, దానిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు.

'నోటీసులు వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పని లేదు - బీజేపీ అండగా ఉంటుంది' - BJP LEADERS comments on hydra

'6 గ్యారంటీలు, 66 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ - 9 నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది' - Etela Rajender Fires On CM Revanth

MP Etala Slams Congress : సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయలేక పిల్లిగంతులు వేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని ఆయన తెలిపారు. రుణమాఫీ కాలేదని మేడ్చల్‌లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున బీజేపీ దీక్ష చేపట్టబోతుందని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

"సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయలేక పిల్లిగంతులు వేస్తున్నారు. రాష్ట్రంలో 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. రుణమాఫీ కాలేదని మేడ్చల్‌లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, సోమవారం రోజు బీజేపీ దీక్ష చేపట్టబోతుంది. రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలి". - ఈటల రాజేందర్, మల్కాజిగిరి ఎంపీ

హామీల విస్మరణ : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు రైతుబంధు, రైతు బీమా, రైతు బోనస్ వస్తాయనే నమ్మకం లేకుండాపోయిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అరాచక ప్రభుత్వంతో రైతులకు అన్యాయం జరుగుతోందని, రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నామన్నారు.

నాడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో 418 హామీలను ఇచ్చారని, ఆయా హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అందులో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, రకరకాలుగా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీని తీసుకువచ్చి అమాయకమైన రైతులకు మాయమాటలు చెప్పారని దుయ్యబట్టారు. రైతన్నలకు రుణమాఫీ చేస్తానని, పంటకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి, దానిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు.

'నోటీసులు వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పని లేదు - బీజేపీ అండగా ఉంటుంది' - BJP LEADERS comments on hydra

'6 గ్యారంటీలు, 66 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ - 9 నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది' - Etela Rajender Fires On CM Revanth

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.