ETV Bharat / state

ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం రిసైక్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు - మంత్రి ఉత్తమ్‌ - Uttam Kumar Reddy on pds

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 8:22 PM IST

Updated : Jun 21, 2024, 10:37 PM IST

Telangana Civil Supplies Corporation : రాష్ట్రంలో రైస్‌మిల్లర్లు ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం రిసైక్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిజాయితీగా ఉంటే రైస్ మిల్లర్లపై వేధింపులు ఉండవని, ఈజ్ ఆఫ్ డూయింగ్​లో వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

Minister Uttam Kumar Reddy on PDS
Telangana Civil Supplies Corporation (ETV Bharat)

Minister Uttam Kumar Reddy on PDS : గత ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల జోక్యంతో సివిల్ సప్లయ్ వ్యవస్థపై నమ్మకం పోయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పౌరసరఫరాల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రైస్ మిల్లర్లపై ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ రైస్ మిల్లర్ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం జోలికి వెళ్లవద్దని మంత్రి స్పష్టం చేశారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధమైన వాటా దక్కాల్సిందే : మంత్రి ఉత్తమ్​ - Uttam about Krishna Water Matter

హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజులపాటు జరగనున్న 16వ మూకాంబికా రైస్, గ్రెయిన్‌టెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్- 2024ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. బహుళ జాతి, ప్రవేటు కంపెనీల ఆధ్వర్యంలో 120 స్టాళ్లు కొలువు తీరాయి. పలు స్టాళ్లను కలియ తిరిగి మంత్రి పరిశీలించారు. పలు దేశాల బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు, దేశీయంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడారు.

రాష్ట్రంలో పలువురు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 40 రూపాయలకు సేకరించి 6 కిలోల చొప్పున నిరుపేదలకు ఇస్తుంటే, ప్రజా పంపిణీ బియ్యాన్ని పలువురు మిల్లర్లు రీసైక్లింగ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని హెచ్చరించారు. కొందరు చట్ట విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నందున కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. కీలక వ్యవసాయ అనుబంధంగా రైస్ మిల్లింగ్ పరిశ్రమను ప్రభుత్వం ముఖ్యమైన రంగంగా గుర్తిస్తుందని అన్నారు.

గ్రామీణ తెలంగాణలో అతి పెద్ద ఉపాధి రంగం దృష్ట్యా ప్రత్యక్షంగా పరోక్షంగా 3 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. నిజాయితీగా ఉంటే రైస్ మిల్లర్లపై వేధింపులు ఉండవని, ఈజ్ ఆఫ్ డూయింగ్​లో వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులు, మిల్లర్లకు మేలు జరగాలన్న లక్ష్యం మేరకు కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు, బ్యాంకుల సహకారం విషయంలో సర్కారు సహకరిస్తుందని చెప్పారు.

"కొందరు మిల్లర్లు ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. పౌరసరఫరాల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రైస్ మిల్లర్లపై ఉంది. నిజాయితీగా ఉంటే రైస్ మిల్లర్లపై వేధింపులు ఉండవు. ఈజ్ ఆఫ్ డూయింగ్​లో వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తాము". - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి : మంత్రి ఉత్తమ్ - Minister Uttam Kumar Tirumala Tour

6 నెలల్లో ఇళ్లు మంజూరు చేసి లబ్దిదారులకు అందజేస్తాం : మంత్రి ఉత్తమ్ - Uttam Review Meeting In Suryapet

Minister Uttam Kumar Reddy on PDS : గత ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల జోక్యంతో సివిల్ సప్లయ్ వ్యవస్థపై నమ్మకం పోయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పౌరసరఫరాల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రైస్ మిల్లర్లపై ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ రైస్ మిల్లర్ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం జోలికి వెళ్లవద్దని మంత్రి స్పష్టం చేశారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధమైన వాటా దక్కాల్సిందే : మంత్రి ఉత్తమ్​ - Uttam about Krishna Water Matter

హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజులపాటు జరగనున్న 16వ మూకాంబికా రైస్, గ్రెయిన్‌టెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్- 2024ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. బహుళ జాతి, ప్రవేటు కంపెనీల ఆధ్వర్యంలో 120 స్టాళ్లు కొలువు తీరాయి. పలు స్టాళ్లను కలియ తిరిగి మంత్రి పరిశీలించారు. పలు దేశాల బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు, దేశీయంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడారు.

రాష్ట్రంలో పలువురు మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 40 రూపాయలకు సేకరించి 6 కిలోల చొప్పున నిరుపేదలకు ఇస్తుంటే, ప్రజా పంపిణీ బియ్యాన్ని పలువురు మిల్లర్లు రీసైక్లింగ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని హెచ్చరించారు. కొందరు చట్ట విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నందున కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. కీలక వ్యవసాయ అనుబంధంగా రైస్ మిల్లింగ్ పరిశ్రమను ప్రభుత్వం ముఖ్యమైన రంగంగా గుర్తిస్తుందని అన్నారు.

గ్రామీణ తెలంగాణలో అతి పెద్ద ఉపాధి రంగం దృష్ట్యా ప్రత్యక్షంగా పరోక్షంగా 3 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. నిజాయితీగా ఉంటే రైస్ మిల్లర్లపై వేధింపులు ఉండవని, ఈజ్ ఆఫ్ డూయింగ్​లో వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులు, మిల్లర్లకు మేలు జరగాలన్న లక్ష్యం మేరకు కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు, బ్యాంకుల సహకారం విషయంలో సర్కారు సహకరిస్తుందని చెప్పారు.

"కొందరు మిల్లర్లు ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. పౌరసరఫరాల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రైస్ మిల్లర్లపై ఉంది. నిజాయితీగా ఉంటే రైస్ మిల్లర్లపై వేధింపులు ఉండవు. ఈజ్ ఆఫ్ డూయింగ్​లో వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తాము". - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి : మంత్రి ఉత్తమ్ - Minister Uttam Kumar Tirumala Tour

6 నెలల్లో ఇళ్లు మంజూరు చేసి లబ్దిదారులకు అందజేస్తాం : మంత్రి ఉత్తమ్ - Uttam Review Meeting In Suryapet

Last Updated : Jun 21, 2024, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.