ETV Bharat / state

ఈనెల 15న సీతారామ ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు - Minister uttam on Sitarama project

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 9:51 PM IST

Minister Uttam on Sitarama project : పంద్రాగస్టున సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. బుధవారం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రారంభం అనంతరం సీఎం రేవంత్​, వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారని మంత్రి ఉత్తమ్​ వెల్లడించారు.

Minister uttam on Sitarama project Launch
Minister Uttam on Sitarama project (ETV Bharat)

Minister uttam on Sitarama project Launch : సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం స్వాతంత్ర దినోత్సవం రోజు జరగనుంది. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రెండో పంప్ హౌస్​ను సీఎం ప్రారంభం చేస్తారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులు, ఇంజినీర్లతో మంత్రి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్​లో వెట్ రన్, రెండో పంప్ హౌస్​లో డ్రైరన్ ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో రెండో పంప్ హౌస్ వద్ద పంపులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 15వ తేదీన హైదరాబాద్​లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం సీఎం హెలికాప్టర్​లో బయల్దేరి ఖమ్మం జిల్లా వైరా వెళ్తారు. ప్రాజెక్టును ప్రారంభించి, అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సీఎం కార్యక్రమ పర్యవేక్షణ కోసం నోడల్ అధికారిని నియమించనున్నట్లు తెలిపారు.

ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన సీతారామ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. ప్రాజెక్టులోని రెండో పంప్ హౌస్ వద్ద ట్రయిల్ రన్ నిర్వహిస్తారు. అనంతరం మూడో పంప్ ట్రయల్ రన్ పూర్తి చేసుకొని వైరాలో ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభాస్థలిని మంత్రి ఉత్తమ్ పరిశీలిస్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దున్నపోతుల గండి వద్ద నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకం స్థలాన్ని ఆయన పరిశీలిస్తారు. స్థల పరిశీలన అనంతరం మిర్యాలగూడలో నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు.

Minister uttam on Sitarama project Launch : సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం స్వాతంత్ర దినోత్సవం రోజు జరగనుంది. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రెండో పంప్ హౌస్​ను సీఎం ప్రారంభం చేస్తారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులు, ఇంజినీర్లతో మంత్రి హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్​లో వెట్ రన్, రెండో పంప్ హౌస్​లో డ్రైరన్ ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో రెండో పంప్ హౌస్ వద్ద పంపులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 15వ తేదీన హైదరాబాద్​లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం సీఎం హెలికాప్టర్​లో బయల్దేరి ఖమ్మం జిల్లా వైరా వెళ్తారు. ప్రాజెక్టును ప్రారంభించి, అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సీఎం కార్యక్రమ పర్యవేక్షణ కోసం నోడల్ అధికారిని నియమించనున్నట్లు తెలిపారు.

ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన సీతారామ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. ప్రాజెక్టులోని రెండో పంప్ హౌస్ వద్ద ట్రయిల్ రన్ నిర్వహిస్తారు. అనంతరం మూడో పంప్ ట్రయల్ రన్ పూర్తి చేసుకొని వైరాలో ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభాస్థలిని మంత్రి ఉత్తమ్ పరిశీలిస్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దున్నపోతుల గండి వద్ద నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకం స్థలాన్ని ఆయన పరిశీలిస్తారు. స్థల పరిశీలన అనంతరం మిర్యాలగూడలో నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు.

విధుల్లో నిర్లక్ష్యం - డీఈ సస్పెండ్​కు​ మంత్రి ఉత్తమ్​ ఆదేశాలు జారీ - Minister Uttam Warn to Officers

ఏటా ఆరున్నర లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు సృష్టిస్తాం : ఉత్తమ్‌ - Uttam Released Sagar Water

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.