ETV Bharat / state

అసెంబ్లీలో బీఆర్​ఎస్​కు నేను ఒక్కడినే చాలు : మంత్రి కోమటిరెడ్డి - chitchat with minister komatireddy

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 9:49 PM IST

Minister Komatireddy Comments on BRS : సీఎం రేవంత్​ రెడ్డి విదేశాలకు వెళ్తే అసెంబ్లీలో బీఆర్​ఎస్​ను ఎదుర్కొవడానికి తాను ఒక్కడినే చాలు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే కేటీఆర్​తో మాట్లాడినంత మాత్రానా ఆయన బీఆర్​ఎస్​లో చేరిపోయినట్లా అని ప్రశ్నించారు. మీడియాతో ఆయన చిట్​చాట్​ నిర్వహించారు.

Minister Komatireddy Venkat Reddy Chitchat
Minister Komatireddy Venkat Reddy Chitchat (ETV Bharat)

Minister Komatireddy Venkat Reddy Chitchat : ఉప్పల్​ నారపల్లి ఫ్లైఓవర్​ పనులకు త్వరలోనే రీ టెండర్​ వేస్తామని ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి వెల్లడించారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు మరమ్మత్తులు చేపడతామన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. కేసీఆర్​కు ప్రజలపై ప్రేమలేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైనదని అన్నారు. కేసీఆర్​ అసెంబ్లీకి రానప్పుడే ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారనే కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​ రావు ముగ్గురు కలిసి రేవంత్​ రెడ్డిని ఓడించలేకపోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్​కు వాళ్లు సరికారు, సాటి కారు అసలు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. సీఎం రేవంత్​ రెడ్డి విదేశాలకు వెళితే తాను చూసుకోవడానికి ఉన్నానని, బీఆర్​ఎస్​కు తాను చాలునని వ్యాఖ్యానించారు. ఎస్​ఎల్​బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి బీఆర్​ఎస్​ ఛాంబర్​కు వెళ్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లానని ప్రశ్నించారు. కేటీఆర్​ కూడా తన ఛైర్​ దగ్గరకు వచ్చి మాట్లారని అయితే ఆయన కాంగ్రెస్​లో చేరినట్లేనా అని ఎదురు ప్రశ్నించారు.

బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి కాంగ్రెస్​లోనే : బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి అలాగే కాంగ్రెస్​తో కలిసి ఉంటారని ఎక్కడి వెళ్లరని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఎల్పీ విలీనం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వస్తారని చెప్పారు. త్వరలో ప్రధాని మోదీని కలుస్తానని రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని తెలిపారు. బీఆర్​ఎస్​ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి వివరించారు.

కాంగ్రెస్​ నుంచి మళ్లీ బీఆర్​ఎస్​లోకి జంప్​ : గత వారమే గద్వాల్​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి బీఆర్​ఎస్​ పార్టీని వీడి కాంగ్రెస్​లో చేరారు. ఆయనకు సీఎం రేవంత్​ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. ఇప్పుడు శాసనసభ సమావేశాల్లో భాగంగా బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, కేటీఆర్​తో కలిసి సోఫాలో కూర్చున్న ఫొటో వైరల్​ అయింది. దీంతో ఆయన బీఆర్​ఎస్​లో చేరినట్లు తెలుస్తోంది.

మంత్రి కోమటిరెడ్డి Vs జగదీశ్ రెడ్డి - అసెంబ్లీ సాక్షిగా సవాళ్లు ప్రతిసవాళ్లు - KOMATIREDDY Vs JAGADISH REDDY

బీఆర్ఎస్​ త్వరలో బీజేపీలో విలీనం కాబోతోంది : మంత్రి కోమటిరెడ్డి - Minister Komatireddy On BRS

Minister Komatireddy Venkat Reddy Chitchat : ఉప్పల్​ నారపల్లి ఫ్లైఓవర్​ పనులకు త్వరలోనే రీ టెండర్​ వేస్తామని ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి వెల్లడించారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు మరమ్మత్తులు చేపడతామన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. కేసీఆర్​కు ప్రజలపై ప్రేమలేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైనదని అన్నారు. కేసీఆర్​ అసెంబ్లీకి రానప్పుడే ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారనే కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​ రావు ముగ్గురు కలిసి రేవంత్​ రెడ్డిని ఓడించలేకపోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్​కు వాళ్లు సరికారు, సాటి కారు అసలు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. సీఎం రేవంత్​ రెడ్డి విదేశాలకు వెళితే తాను చూసుకోవడానికి ఉన్నానని, బీఆర్​ఎస్​కు తాను చాలునని వ్యాఖ్యానించారు. ఎస్​ఎల్​బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి బీఆర్​ఎస్​ ఛాంబర్​కు వెళ్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లానని ప్రశ్నించారు. కేటీఆర్​ కూడా తన ఛైర్​ దగ్గరకు వచ్చి మాట్లారని అయితే ఆయన కాంగ్రెస్​లో చేరినట్లేనా అని ఎదురు ప్రశ్నించారు.

బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి కాంగ్రెస్​లోనే : బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి అలాగే కాంగ్రెస్​తో కలిసి ఉంటారని ఎక్కడి వెళ్లరని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఎల్పీ విలీనం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వస్తారని చెప్పారు. త్వరలో ప్రధాని మోదీని కలుస్తానని రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని తెలిపారు. బీఆర్​ఎస్​ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి వివరించారు.

కాంగ్రెస్​ నుంచి మళ్లీ బీఆర్​ఎస్​లోకి జంప్​ : గత వారమే గద్వాల్​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి బీఆర్​ఎస్​ పార్టీని వీడి కాంగ్రెస్​లో చేరారు. ఆయనకు సీఎం రేవంత్​ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్​లోకి ఆహ్వానించారు. ఇప్పుడు శాసనసభ సమావేశాల్లో భాగంగా బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, కేటీఆర్​తో కలిసి సోఫాలో కూర్చున్న ఫొటో వైరల్​ అయింది. దీంతో ఆయన బీఆర్​ఎస్​లో చేరినట్లు తెలుస్తోంది.

మంత్రి కోమటిరెడ్డి Vs జగదీశ్ రెడ్డి - అసెంబ్లీ సాక్షిగా సవాళ్లు ప్రతిసవాళ్లు - KOMATIREDDY Vs JAGADISH REDDY

బీఆర్ఎస్​ త్వరలో బీజేపీలో విలీనం కాబోతోంది : మంత్రి కోమటిరెడ్డి - Minister Komatireddy On BRS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.