ETV Bharat / state

"ఇదెక్కడి వాతావరణం" రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ - ఎటు చూసినా ఎండే

చెన్నై నగరానికి వాతావరణశాఖ ఇచ్చిన వర్ష సూచనలు తారుమారు - చినుకులు రాల్చకుండా మాయమైన 'రెడ్‌ అలర్ట్‌' - వర్షాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న చెన్నైవాసులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Chennai Weather Report
Chennai Weather Report (ETV Bharat)

Meteorology Department Report on Chennai Rains : చెన్నై నగరానికి వాతావరణశాఖ ఇచ్చిన వర్ష సూచనలు తారుమారయ్యాయి. 15న అతిభారీ వర్షాల వరకే 'ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange Alert To Chennai)' ఇచ్చినా అదే రోజు ఉదయం ఉన్నఫళంగా అది అత్యంత భారీ వర్షాలు సూచించే 'రెడ్‌ అలర్ట్‌ (Red Alert To Chennai)'గా మార్చారు. 16న అత్యంత భారీ వర్షాలొస్తాయని 'రెడ్‌ అలర్ట్‌' ఇచ్చినా కనీసం నగరంలో చాలా చోట్ల వర్షాలే నమోదవలేదు. ఈ తరహా వాతావరణ హెచ్చరికలతో నగరవాసులు గందరగోళానికి గురవుతున్నారు.

Tamil Nadu Rains : వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా చెన్నైకు ఉత్తరంవైపుగా గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తీరం దాటినట్లు ప్రకటించారు. ఆ తర్వాత అది ఏపీ మీదుగా ప్రయాణించింది. తీరానికి దగ్గరగా వచ్చిన సమయంలో ఎలాంటి వర్షాలు కురవకుండా దాటేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు అదితీరం దాటగానే చెన్నైలో ఎండసైతం కనిపించడం మరో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవన్నీ వాతావరణశాఖ అంచనాలకు భిన్నంగా జరిగాయి.

దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో వర్షాలు - సముద్రతీరంలో కోతకు గురైన ఇళ్లు

ఎక్కడా వర్షమే లేదు : వాతావరణ అంచనాలు తప్పాయి. గురువారం చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. చెన్నైతో పాటు కొన్ని జిల్లాల్ని అప్రమత్తం చేశారు. బుధవారం సీన్‌ మారడంతో గురువారం సైతం నగరంలో అలాంటి పరిస్థితులే తారసపడ్డాయి. ఎక్కడా చుక్క వర్షం లేకుండానే రోజు గడవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణశాఖ అంచనాలకు భిన్నంగానే ఇవన్నీ జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో కేవలం కొన్నిచోట్ల మాత్రమే మోస్తరు వర్షాలు కురిశాయి. మణలి, తిరువొత్తియూర్‌లో 3 సెం.మీ, కత్తివాక్కం, తండియార్‌పేటలో 2 సెం.మీ, చెన్నై కలెక్టరేట్, రాయపురం, పెరంబూర్, అయనావరంలో సెం.మీ. మాత్రమే నమోదైంది. 16న మధ్యాహ్నం నుంచి ఎక్కడా వర్షమే లేదు.

ఎగసిపడుతున్న అలలు - బిక్కుబిక్కుమంటున్న తీర ప్రాంత ప్రజలు

విమర్శలు వచ్చినా వాతావరణశాఖ హెచ్చరికల్ని గౌరవించాల్సిందేనని వాతావరణ నిపుణుడు ప్రదీప్‌ జాన్‌ తెలిపారు. కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు పడతాయనే సూచన వచ్చినా తర్వాత పరిస్థితులు మారాయని పేర్కొన్నారు. 16న అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ ప్రకటనతో తాను ఏకీభవించలేదన్నట్లు తెలిపారు. మనుషులు తమకున్న సాంకేతికత పరిజ్ఞానంతో ఊహించి అంచనాలు మాత్రమే వేయగలరని, కొన్ని మోడల్స్‌ ఆధారంగా వాతావరణ సూచనలు ఉంటాయని అన్నారు. తాను కూడా తనకున్న సామర్థ్యం మేరకు మాత్రమే వాతావరణ సూచనలు చెబుతూ వస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆయన అంచనాల ప్రకారం 15, 16 తేదీల్లో 20 సెం.మీ. వర్షపాతం దాటిన ప్రాంతాలు 75 వరకు ఉన్నాయని, ఇవన్నీ కూడా 24గంటల్లో ఇంతటి వర్షపాతాన్ని నమోదు చేశాయని వివరించారు.

చెరువుల్లోకి భారీగా నీరు : 15, 16 తేదీల్లో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 891 చెరువులు జలాలతో కళకళలాడుతున్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందులో ప్రధానంగా కన్నియాకుమరిలో 310, మదురైలో 244 చెరువులున్నాయని పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు తీర జిల్లాలు, డెల్టా జిల్లాలో 180 చెరువుల్లోకి భారీగా నీళ్లు చేరాయని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,139 చెరువులుంటే అందులో 1,832 చెరువుల్లో 75శాతం, 2,096 చెరువుల్లో 50 శాతానికి మించి నీరొచ్చిందని వెల్లడించారు. కోయంబత్తూరు, దిండుక్కల్‌ ఈరోడ్‌ జిల్లాల్లోని పలు రిజర్వాయర్లకు నీరు బాగా చేరిందని అన్నారు.

నెల్లూరుకు వాయు'గండం' - నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Meteorology Department Report on Chennai Rains : చెన్నై నగరానికి వాతావరణశాఖ ఇచ్చిన వర్ష సూచనలు తారుమారయ్యాయి. 15న అతిభారీ వర్షాల వరకే 'ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange Alert To Chennai)' ఇచ్చినా అదే రోజు ఉదయం ఉన్నఫళంగా అది అత్యంత భారీ వర్షాలు సూచించే 'రెడ్‌ అలర్ట్‌ (Red Alert To Chennai)'గా మార్చారు. 16న అత్యంత భారీ వర్షాలొస్తాయని 'రెడ్‌ అలర్ట్‌' ఇచ్చినా కనీసం నగరంలో చాలా చోట్ల వర్షాలే నమోదవలేదు. ఈ తరహా వాతావరణ హెచ్చరికలతో నగరవాసులు గందరగోళానికి గురవుతున్నారు.

Tamil Nadu Rains : వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా చెన్నైకు ఉత్తరంవైపుగా గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తీరం దాటినట్లు ప్రకటించారు. ఆ తర్వాత అది ఏపీ మీదుగా ప్రయాణించింది. తీరానికి దగ్గరగా వచ్చిన సమయంలో ఎలాంటి వర్షాలు కురవకుండా దాటేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోవైపు అదితీరం దాటగానే చెన్నైలో ఎండసైతం కనిపించడం మరో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవన్నీ వాతావరణశాఖ అంచనాలకు భిన్నంగా జరిగాయి.

దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో వర్షాలు - సముద్రతీరంలో కోతకు గురైన ఇళ్లు

ఎక్కడా వర్షమే లేదు : వాతావరణ అంచనాలు తప్పాయి. గురువారం చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. చెన్నైతో పాటు కొన్ని జిల్లాల్ని అప్రమత్తం చేశారు. బుధవారం సీన్‌ మారడంతో గురువారం సైతం నగరంలో అలాంటి పరిస్థితులే తారసపడ్డాయి. ఎక్కడా చుక్క వర్షం లేకుండానే రోజు గడవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణశాఖ అంచనాలకు భిన్నంగానే ఇవన్నీ జరగడం ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో కేవలం కొన్నిచోట్ల మాత్రమే మోస్తరు వర్షాలు కురిశాయి. మణలి, తిరువొత్తియూర్‌లో 3 సెం.మీ, కత్తివాక్కం, తండియార్‌పేటలో 2 సెం.మీ, చెన్నై కలెక్టరేట్, రాయపురం, పెరంబూర్, అయనావరంలో సెం.మీ. మాత్రమే నమోదైంది. 16న మధ్యాహ్నం నుంచి ఎక్కడా వర్షమే లేదు.

ఎగసిపడుతున్న అలలు - బిక్కుబిక్కుమంటున్న తీర ప్రాంత ప్రజలు

విమర్శలు వచ్చినా వాతావరణశాఖ హెచ్చరికల్ని గౌరవించాల్సిందేనని వాతావరణ నిపుణుడు ప్రదీప్‌ జాన్‌ తెలిపారు. కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు పడతాయనే సూచన వచ్చినా తర్వాత పరిస్థితులు మారాయని పేర్కొన్నారు. 16న అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ ప్రకటనతో తాను ఏకీభవించలేదన్నట్లు తెలిపారు. మనుషులు తమకున్న సాంకేతికత పరిజ్ఞానంతో ఊహించి అంచనాలు మాత్రమే వేయగలరని, కొన్ని మోడల్స్‌ ఆధారంగా వాతావరణ సూచనలు ఉంటాయని అన్నారు. తాను కూడా తనకున్న సామర్థ్యం మేరకు మాత్రమే వాతావరణ సూచనలు చెబుతూ వస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆయన అంచనాల ప్రకారం 15, 16 తేదీల్లో 20 సెం.మీ. వర్షపాతం దాటిన ప్రాంతాలు 75 వరకు ఉన్నాయని, ఇవన్నీ కూడా 24గంటల్లో ఇంతటి వర్షపాతాన్ని నమోదు చేశాయని వివరించారు.

చెరువుల్లోకి భారీగా నీరు : 15, 16 తేదీల్లో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 891 చెరువులు జలాలతో కళకళలాడుతున్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందులో ప్రధానంగా కన్నియాకుమరిలో 310, మదురైలో 244 చెరువులున్నాయని పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు తీర జిల్లాలు, డెల్టా జిల్లాలో 180 చెరువుల్లోకి భారీగా నీళ్లు చేరాయని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,139 చెరువులుంటే అందులో 1,832 చెరువుల్లో 75శాతం, 2,096 చెరువుల్లో 50 శాతానికి మించి నీరొచ్చిందని వెల్లడించారు. కోయంబత్తూరు, దిండుక్కల్‌ ఈరోడ్‌ జిల్లాల్లోని పలు రిజర్వాయర్లకు నీరు బాగా చేరిందని అన్నారు.

నెల్లూరుకు వాయు'గండం' - నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.