ETV Bharat / state

అక్రమ రిజిస్ట్రేషన్ - సబ్ రిజిస్ట్రార్‌ రమణ సహా 9మంది అరెస్ట్‌ - Toopran Sub Registrar Ramana Arrest - TOOPRAN SUB REGISTRAR RAMANA ARREST

Illegal Registration Sub-Registrar Arrested : మెదక్‌ జిల్లా తూప్రాన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ రమణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ పత్రాలతో స్థలాన్ని విక్రయించినందుకు గానూ గతంలో నలుగురితో సహా, తాజాగా సబ్ రిజిస్ట్రార్‌తో కలిపి మొత్తం 9 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినున్నట్లు ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు.

Illegal Registration Sub-Registrar Arrested
Toopran Sub Registrar Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 10:04 PM IST

Toopran Sub Registrar Arrest in Illegal Registration : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలోని వెయ్యి గజాల స్థలానికి సంబంధించిన ఫేక్ రిజిస్ట్రేషన్ ఘటనలో గతంలో నలుగురితో సహా, తాజాగా సబ్ రిజిస్ట్రార్‌తో కలిపి మొత్తం 9 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినున్నట్లు ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన మల్లవరపు అరుణ్ కుమార్ అనే వ్యక్తి మరో 8 మందితో కలిసి నగరంలోని మోతీనగర్‌కు చెందిన సురావజ్జుల సత్యనారాయణ, అతని భార్య స్వాతికి మండలంలోని కూచారం శివారులోని సర్వే నెం. 225, 226లో వెయ్యి గజాల స్థలాన్ని రూ.80 లక్షలకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించారు. అప్పటికే ఆ భూమి అసలు యజమాని దుర్గ అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది.

Illegal Registration Sub-Registrar Arrested : అయితే నిందితులు హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళకు డబ్బు ఎర చూపి, తన ఆధార్ కార్డును దుర్గగా మార్ఫింగ్ చేసి సత్యనారాయణ అతని భార్య స్వాతిలకు లక్ష్మీ చేత అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. సత్యనారాయణ మూర్తి లింక్ డాక్యుమెంట్‌ కోసం ఆరా తీయగా, అమ్మిన వ్యక్తులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో, సందేహం వచ్చింది.

తాము కొనుగోలు చేసిన ప్లాట్ దగ్గరకు వెళ్లగా, ఆ స్థలం వేరే వ్యక్తుల పేరుతో బోర్డు ఉండటంతో, అసలు విషయం బయటపడింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సత్యనారాయణ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు పిట్ల సాయి కుమార్, వేముల ప్రభాకర్, నంగునూర్ లక్ష్మీ, డాక్యుమెంట్ రైటర్, తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ సనత్‌నగర్ రమణలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

భూముల ధరల పెంపుపై సర్కార్ ఫోకస్ - ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రక్రియ షురూ - TS GOVT TO HIKE LANDS MARKET PRICE

పిల్లల పార్క్​ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ - ఆందోళనకు దిగిన కమ్యునిటీ వాసులపై దౌర్జన్యం

Toopran Sub Registrar Arrest in Illegal Registration : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలోని వెయ్యి గజాల స్థలానికి సంబంధించిన ఫేక్ రిజిస్ట్రేషన్ ఘటనలో గతంలో నలుగురితో సహా, తాజాగా సబ్ రిజిస్ట్రార్‌తో కలిపి మొత్తం 9 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినున్నట్లు ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన మల్లవరపు అరుణ్ కుమార్ అనే వ్యక్తి మరో 8 మందితో కలిసి నగరంలోని మోతీనగర్‌కు చెందిన సురావజ్జుల సత్యనారాయణ, అతని భార్య స్వాతికి మండలంలోని కూచారం శివారులోని సర్వే నెం. 225, 226లో వెయ్యి గజాల స్థలాన్ని రూ.80 లక్షలకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించారు. అప్పటికే ఆ భూమి అసలు యజమాని దుర్గ అనే మహిళ పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది.

Illegal Registration Sub-Registrar Arrested : అయితే నిందితులు హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళకు డబ్బు ఎర చూపి, తన ఆధార్ కార్డును దుర్గగా మార్ఫింగ్ చేసి సత్యనారాయణ అతని భార్య స్వాతిలకు లక్ష్మీ చేత అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు. సత్యనారాయణ మూర్తి లింక్ డాక్యుమెంట్‌ కోసం ఆరా తీయగా, అమ్మిన వ్యక్తులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో, సందేహం వచ్చింది.

తాము కొనుగోలు చేసిన ప్లాట్ దగ్గరకు వెళ్లగా, ఆ స్థలం వేరే వ్యక్తుల పేరుతో బోర్డు ఉండటంతో, అసలు విషయం బయటపడింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సత్యనారాయణ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు పిట్ల సాయి కుమార్, వేముల ప్రభాకర్, నంగునూర్ లక్ష్మీ, డాక్యుమెంట్ రైటర్, తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ సనత్‌నగర్ రమణలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

భూముల ధరల పెంపుపై సర్కార్ ఫోకస్ - ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రక్రియ షురూ - TS GOVT TO HIKE LANDS MARKET PRICE

పిల్లల పార్క్​ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ - ఆందోళనకు దిగిన కమ్యునిటీ వాసులపై దౌర్జన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.