ETV Bharat / state

కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్​లో మంటలు - మూడు ఏసీ బోగీలు దగ్ధం - Fire Accident In Korba Express

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 11:49 AM IST

Updated : Aug 4, 2024, 12:12 PM IST

Fire Accident in Korba Express : విశాఖలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్వేస్టేషన్​లో నిలిపి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్​లో మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో మూడు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

Fire Accident
Fire Accident (ETV Bharat)

Fire Accident at Visakha Railway Station Today : విశాఖ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో నంబర్‌ ప్లాట్‌ ఫారంపై నిలిపి ఉన్న కోర్బా - విశాఖ ఎక్స్‌ప్రెస్​లోని మూడు ఏసీ బోగీల్లో మంటలు చేలరేగాయి. తొలుత బీ-7 బోగీలో చేలరేగిన మంటలు క్రమంగా బీ-6, ఎం-1 బోగీలకు వ్యాపించాయి. ఇది గమనించిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీనిపై అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు.

Korba Express Fire Accident Updates : ఈ ఘటనలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. కోర్బా నుంచి ఉదయం ఆరు గంటలకు రైలు విశాఖకు వచ్చిందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి వెళ్లాల్సి ఉందన్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నట్లు వెల్లడించారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి విడదీసి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం- ఒక వైపునకు ఒరిగిన యుద్ధనౌక- అధికారి గల్లంతు

అగ్నిప్రమాదం ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని విశాఖ సంయుక్త సీపీ ఫకీరప్ప తెలిపారు. రైలులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోయారని, ఉదయం 10 గంటలకు రైలులో మంటలు చెలరేగాయని చెప్పారు. వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారని వివరించారు. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలార్పారని పేర్కొన్నారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరు చేసి తరలిస్తున్నారని వివరించారు. అగ్నిప్రమాద ఘటనపై రైల్వే సిబ్బంది పరిశీలిస్తున్నట్లు ఫకీరప్ప వెల్లడించారు.

ఫర్నీచర్‌ గోదాంలో అగ్నిప్రమాదం - తండ్రీ కుమార్తె మృతి - మరో ఇద్దరి పరిస్థితి విషమం - FIRE ACCIDENT AT FURNITURE GODOWN

Fire Accident at Visakha Railway Station Today : విశాఖ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాలుగో నంబర్‌ ప్లాట్‌ ఫారంపై నిలిపి ఉన్న కోర్బా - విశాఖ ఎక్స్‌ప్రెస్​లోని మూడు ఏసీ బోగీల్లో మంటలు చేలరేగాయి. తొలుత బీ-7 బోగీలో చేలరేగిన మంటలు క్రమంగా బీ-6, ఎం-1 బోగీలకు వ్యాపించాయి. ఇది గమనించిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీనిపై అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు.

Korba Express Fire Accident Updates : ఈ ఘటనలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. కోర్బా నుంచి ఉదయం ఆరు గంటలకు రైలు విశాఖకు వచ్చిందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి వెళ్లాల్సి ఉందన్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నట్లు వెల్లడించారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి విడదీసి పంపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం- ఒక వైపునకు ఒరిగిన యుద్ధనౌక- అధికారి గల్లంతు

అగ్నిప్రమాదం ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని విశాఖ సంయుక్త సీపీ ఫకీరప్ప తెలిపారు. రైలులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోయారని, ఉదయం 10 గంటలకు రైలులో మంటలు చెలరేగాయని చెప్పారు. వెంటనే రైల్వే సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారని వివరించారు. నాలుగు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలార్పారని పేర్కొన్నారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరు చేసి తరలిస్తున్నారని వివరించారు. అగ్నిప్రమాద ఘటనపై రైల్వే సిబ్బంది పరిశీలిస్తున్నట్లు ఫకీరప్ప వెల్లడించారు.

ఫర్నీచర్‌ గోదాంలో అగ్నిప్రమాదం - తండ్రీ కుమార్తె మృతి - మరో ఇద్దరి పరిస్థితి విషమం - FIRE ACCIDENT AT FURNITURE GODOWN

Last Updated : Aug 4, 2024, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.