ETV Bharat / state

రాష్ట్రంలో భానుడి భగభగలు - 8 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు - అత్యవసరమైతే తప్ప ఆ సమయంలో బయటకు రాకండి! - Temperatures Rise in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 8:32 AM IST

Temperatures Rise in Telangana : రాష్ట్రంలో 8 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్​, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఉదయం 11 నుంచి 4 వరకు ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.

Temperatures Rise in Telangana
Temperatures Rise in Telangana

Heavy Temperatures in Telangana : భానుడి భగభగలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటకు వేయాలంటేనే జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరో భయంకరమైన విషయం ఏంటంటే దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలోనే నమోదు అవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్​, ఆరెంజ్​ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు సూర్యుడి ప్రతాపం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.

ఈ మేరకు గురువారం కొత్తగూడెంలో 44 డిగ్రీలు దేశంలోనే అత్యధికమని ప్రకటించిన వాతావరణ శాఖ, ఆ తర్వాత శుక్రవారం ఏకంగా 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం గమనార్హం. పదేళ్లలో ఏప్రిల్​ నెల చివరి వారంలో ఒకేసారి ఇలా ఇన్ని కేంద్రాల్లో ఎండలు చూడటం తొలిసారి. సూర్యుడి ప్రతాపానికి సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం అచ్చన్నపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పని చేస్తున్న బిహార్​కు చెందిన వ్యక్తి శుక్రవారం వడదెబ్బ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

హెచ్చరికలు జారీ : కరీంనగర్​, నల్గొండ, పెద్దపల్లి, యాదాద్రి, జగిత్యాల, వనపర్తి, వరంగల్​ జిల్లాల్లో 45 డిగ్రీల ఎండ దాటడంతో వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్​ను జారీ చేసింది. మరో 25 జిల్లాలకు ఆరెంజ్​ హెచ్చరికను ప్రకటించింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఐదురోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. అందులో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 వరకు బయటకు రావద్దని సూచించింది.

ఇప్పటికే పలు జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3-5 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వచ్చే ఐదు రోజులు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తేల్చింది. మరోవైవు దక్షిణ మధ్యప్రదేశ్​ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడడంతో ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

గతేడాదితో పోలిస్తే అత్యధికం : గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5 నుంచి 7 డిగ్రీలు మించి ఉంటున్నాయి. అందుకే అంత ప్రమాదకరంగా ఎండలు ఉంటున్నాయి. శుక్రవారం ఏ జిల్లాలో చూసినా గతేడాదితో పోల్చితే 6 నుంచి 7 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతలకు రెండు డిగ్రీలు పెరిగితేనే ప్రజలు అల్లాడిపోతారు. ఉదాహరణకు గతేడాది హైదరాబాద్​లోని చందానగర్​లో 35.3 డిగ్రీలు నమోదు అవ్వగా, ఇప్పుడు 43.5 డిగ్రీలు నమోదైంది. అందుకే 8 జిల్లాలకు రెడ్​ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ప్రాంతాల్లో రెండు నుంచి ఐదు రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయి. బయటకు వస్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది.

ఏ రోజుల్లో ఏఏ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలి :

  • మంచిర్యాల, నిజామాబాద్​, నిర్మల్​, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, కరీంనగర్​, భూపాలపల్లి, కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్​, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో శనివారం తీవ్రమైన వడగాలులు వీస్తాయి.
  • నాగర్​ కర్నూల్​, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వడగాలు వీస్తాయి. నిర్మల్​, మంచిర్యాల, నిజామాబాద్​, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్​ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. మిగతా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు అక్కడక్కడ ఈదురుగాలులు ఆది, సోమవారాల్లో వీచే అవకాశం ఉంది.
  • ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్​నగర్​, సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, నాగర్​కర్నూల్​, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మంగళవారం తీవ్రమైన వడగాలులు ఉండనున్నాయి.

సూర్యకాంతి భూమిని చేరే టైమ్​ 8నిమిషాలు కాదు! అసలు సమయం ఎంతో తెలుసా?

ఆరంభంలోనే భగ్గుమంటున్న భానుడు - 3 డిగ్రీల మేర పెరగనున్న గరిష్ఠ ఉష్టోగ్రతలు

Heavy Temperatures in Telangana : భానుడి భగభగలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటకు వేయాలంటేనే జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరో భయంకరమైన విషయం ఏంటంటే దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలోనే నమోదు అవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్​, ఆరెంజ్​ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు సూర్యుడి ప్రతాపం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.

ఈ మేరకు గురువారం కొత్తగూడెంలో 44 డిగ్రీలు దేశంలోనే అత్యధికమని ప్రకటించిన వాతావరణ శాఖ, ఆ తర్వాత శుక్రవారం ఏకంగా 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం గమనార్హం. పదేళ్లలో ఏప్రిల్​ నెల చివరి వారంలో ఒకేసారి ఇలా ఇన్ని కేంద్రాల్లో ఎండలు చూడటం తొలిసారి. సూర్యుడి ప్రతాపానికి సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం అచ్చన్నపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పని చేస్తున్న బిహార్​కు చెందిన వ్యక్తి శుక్రవారం వడదెబ్బ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

హెచ్చరికలు జారీ : కరీంనగర్​, నల్గొండ, పెద్దపల్లి, యాదాద్రి, జగిత్యాల, వనపర్తి, వరంగల్​ జిల్లాల్లో 45 డిగ్రీల ఎండ దాటడంతో వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్​ను జారీ చేసింది. మరో 25 జిల్లాలకు ఆరెంజ్​ హెచ్చరికను ప్రకటించింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఐదురోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. అందులో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 వరకు బయటకు రావద్దని సూచించింది.

ఇప్పటికే పలు జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3-5 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వచ్చే ఐదు రోజులు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తేల్చింది. మరోవైవు దక్షిణ మధ్యప్రదేశ్​ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడడంతో ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

గతేడాదితో పోలిస్తే అత్యధికం : గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5 నుంచి 7 డిగ్రీలు మించి ఉంటున్నాయి. అందుకే అంత ప్రమాదకరంగా ఎండలు ఉంటున్నాయి. శుక్రవారం ఏ జిల్లాలో చూసినా గతేడాదితో పోల్చితే 6 నుంచి 7 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతలకు రెండు డిగ్రీలు పెరిగితేనే ప్రజలు అల్లాడిపోతారు. ఉదాహరణకు గతేడాది హైదరాబాద్​లోని చందానగర్​లో 35.3 డిగ్రీలు నమోదు అవ్వగా, ఇప్పుడు 43.5 డిగ్రీలు నమోదైంది. అందుకే 8 జిల్లాలకు రెడ్​ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ప్రాంతాల్లో రెండు నుంచి ఐదు రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయి. బయటకు వస్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది.

ఏ రోజుల్లో ఏఏ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలి :

  • మంచిర్యాల, నిజామాబాద్​, నిర్మల్​, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, కరీంనగర్​, భూపాలపల్లి, కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్​, ఖమ్మం, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో శనివారం తీవ్రమైన వడగాలులు వీస్తాయి.
  • నాగర్​ కర్నూల్​, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వడగాలు వీస్తాయి. నిర్మల్​, మంచిర్యాల, నిజామాబాద్​, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్​ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. మిగతా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు అక్కడక్కడ ఈదురుగాలులు ఆది, సోమవారాల్లో వీచే అవకాశం ఉంది.
  • ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్​నగర్​, సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, నాగర్​కర్నూల్​, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మంగళవారం తీవ్రమైన వడగాలులు ఉండనున్నాయి.

సూర్యకాంతి భూమిని చేరే టైమ్​ 8నిమిషాలు కాదు! అసలు సమయం ఎంతో తెలుసా?

ఆరంభంలోనే భగ్గుమంటున్న భానుడు - 3 డిగ్రీల మేర పెరగనున్న గరిష్ఠ ఉష్టోగ్రతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.