ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా నేడూ భారీ వర్షాలు - అధికారుల అప్రమత్తం - ఎక్కడికక్కడ కంట్రోల్​ రూమ్​ల ఏర్పాటు - heavy rains in telangana today

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 7:07 AM IST

Updated : Sep 2, 2024, 7:43 AM IST

Heavy Rain Alert Today : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రహదారులు ధ్వంసం కావడంతో 117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 98 చెరువులకు గండి పడగా, మరో 67 దెబ్బ తిన్నట్లు వివరించింది. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఫోన్ చేసి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Telangana Govt Alert to Heavy Rains Today
Heavy Rain Alert Today (ETV Bharat)

Telangana Govt Alert to Heavy Rains Today : నేడూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జీహెచ్​ఎంసీ సహా పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉస్మానియా, జేఎన్టీయూ, తెలంగాణ తదితర యూనివర్సిటీలు నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయడం సహా కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సచివాలయంతో పాటు జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్​లు తెరిచారు. వర్షాలు, వరదలపై సీఎం రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులు అధికారులతో ఫోన్​లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

అధికారుల సెలవులు రద్దు : వరద ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని చెప్పిన సీఎం, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని విధుల్లో నిమగ్నం కావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక ఏర్పాట్లు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అత్యవసర విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు పంపాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

వరద నీటిని వృథా చేయవద్దు : వరద నీటిని వృథా చేయకుండా ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు ఎత్తిపోయాలని, రోజుకు టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని చెప్పారు. నంది, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని సూచించారు. మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని ఎత్తిపోయాలని సీఎం ఆదేశించారు. రంగనాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని, అక్కడి నుంచి సింగూరు, నిజాంసాగర్ వరకు తరలించాలని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

సీఎం రేవంత్​ రెడ్డికి పీఎం మోదీ ఫోన్​ : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్​ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రాణనష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలపై ప్రధానికి సీఎం వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని సీఎంకు ప్రధాని తెలిపారు.

అమిత్​ షా ఫోన్​ : అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా ఫోన్​ చేసి రాష్ట్రంలో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అమిత్ షాకు సీఎం వివరించారు. సెంట్రల్​ గవర్నమెంట్​ తరఫున అన్ని విధాలుగా తెలంగాణకు సహాయం అందిస్తామని అమిత్​ షా తెలిపారు.

117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్​ : అగ్నిమాపక, విపత్తు నిర్వహణశాఖ వివిధ జిల్లాల్లో 777 మందిని వరద నుంచి కాపాడిందని ప్రభుత్వం తెలిపింది. వంకలు పొర్లడంతో రోడ్లు దెబ్బతిని 117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలు నీట మునిగి ఉన్నందున రోడ్లు ఎంత మేరకు దెబ్బతిన్నాయో ఇంకా పూర్తి స్పష్టత రావడం లేదని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. రోడ్లను వెంటనే మరమ్మతు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా 98 చెరువులకు గండ్లుపడగా, మరో 67 దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో 32 కాల్వలకు గండిపడగా, మరో 23 చోట్ల ప్రాజెక్టులు, కాల్వలు దెబ్బతిన్నాయి. వాటి పునరుద్ధరణకు సుమారు రూ.629 కోట్లు అవసరమని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. వివిధ జిల్లాల్లో 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2,500 మందిని తరలించారని ప్రభుత్వం పేర్కొంది.

సూర్యాపేట మీదగా హైదరాబాద్​ టూ విజయవాడ రోడ్​ క్లోజ్​! - ప్రయాణం వాయిదా బెస్ట్ - Hyd to Vijayawada highway closed

తెలంగాణలో భారీ వర్షాలు - ఇప్పటివరకు 9 మంది మృతి, మరో ఇద్దరు గల్లంతు - 9 People Died Due to Rains in tg

Telangana Govt Alert to Heavy Rains Today : నేడూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జీహెచ్​ఎంసీ సహా పలు జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉస్మానియా, జేఎన్టీయూ, తెలంగాణ తదితర యూనివర్సిటీలు నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయడం సహా కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సచివాలయంతో పాటు జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్​లు తెరిచారు. వర్షాలు, వరదలపై సీఎం రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులు అధికారులతో ఫోన్​లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

అధికారుల సెలవులు రద్దు : వరద ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని చెప్పిన సీఎం, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని విధుల్లో నిమగ్నం కావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక ఏర్పాట్లు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అత్యవసర విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు పంపాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

వరద నీటిని వృథా చేయవద్దు : వరద నీటిని వృథా చేయకుండా ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నిల్వ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు ఎత్తిపోయాలని, రోజుకు టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని చెప్పారు. నంది, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని సూచించారు. మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని ఎత్తిపోయాలని సీఎం ఆదేశించారు. రంగనాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని, అక్కడి నుంచి సింగూరు, నిజాంసాగర్ వరకు తరలించాలని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

సీఎం రేవంత్​ రెడ్డికి పీఎం మోదీ ఫోన్​ : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్​ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రాణనష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలపై ప్రధానికి సీఎం వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని సీఎంకు ప్రధాని తెలిపారు.

అమిత్​ షా ఫోన్​ : అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా ఫోన్​ చేసి రాష్ట్రంలో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అమిత్ షాకు సీఎం వివరించారు. సెంట్రల్​ గవర్నమెంట్​ తరఫున అన్ని విధాలుగా తెలంగాణకు సహాయం అందిస్తామని అమిత్​ షా తెలిపారు.

117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్​ : అగ్నిమాపక, విపత్తు నిర్వహణశాఖ వివిధ జిల్లాల్లో 777 మందిని వరద నుంచి కాపాడిందని ప్రభుత్వం తెలిపింది. వంకలు పొర్లడంతో రోడ్లు దెబ్బతిని 117 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలు నీట మునిగి ఉన్నందున రోడ్లు ఎంత మేరకు దెబ్బతిన్నాయో ఇంకా పూర్తి స్పష్టత రావడం లేదని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. రోడ్లను వెంటనే మరమ్మతు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా 98 చెరువులకు గండ్లుపడగా, మరో 67 దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో 32 కాల్వలకు గండిపడగా, మరో 23 చోట్ల ప్రాజెక్టులు, కాల్వలు దెబ్బతిన్నాయి. వాటి పునరుద్ధరణకు సుమారు రూ.629 కోట్లు అవసరమని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. వివిధ జిల్లాల్లో 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2,500 మందిని తరలించారని ప్రభుత్వం పేర్కొంది.

సూర్యాపేట మీదగా హైదరాబాద్​ టూ విజయవాడ రోడ్​ క్లోజ్​! - ప్రయాణం వాయిదా బెస్ట్ - Hyd to Vijayawada highway closed

తెలంగాణలో భారీ వర్షాలు - ఇప్పటివరకు 9 మంది మృతి, మరో ఇద్దరు గల్లంతు - 9 People Died Due to Rains in tg

Last Updated : Sep 2, 2024, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.