Metro Phase-2 Development in Hyderabad : దేశవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టులను పరుగు తీయించడమే లక్ష్యంగా బడ్జెట్లో రూ. 31వేల కోట్ల కేటాయింపులు జరిగాయి. అందులో తెలంగాణకు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. హైదరాబాద్లో రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టును చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని ఆశ్రయించి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయినప్పటికీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా తెలంగాణ గురించి ప్రత్యేక ప్రస్తావన రాలేదు.
మెట్రో రెండో దశకు కేంద్రం బడ్జెట్ : ఈ క్రమంలో రూ.24వేల కోట్ల అంచనా వ్యయంతో ఐదు మార్గాల్లో అభివృద్ధి చేయదలచిన మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధులు దక్కేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సర్కారు సహాయం అందిస్తేనే ఆయా ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు తెలుపుతున్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్- హయత్ నగర్కు, ఎల్బీనగర్ నుంచి శివరాంపల్లి మీదుగా విమానశ్రయానికి, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్టకు, మియాపూర్ నుంచి పటాన్చెరు వరుకు మెట్రోను విస్తరించాలన్నది రెండో దశ ప్రాజెక్టు ఉద్దేశం.
ఒక్క రూపాయి కూడా దక్కలేదు : హైదరాబాద్ రూపురేఖలను మార్చేసే మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ వినతులను కేంద్రం పట్టించుకోవట్లేదు. వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టుకు పద్దులో ఒక్క రూపాయి కూడా దక్కలేదు.
మెట్రో విస్తరణపై సమీక్ష - అప్పుడే టెండర్లు పిలవాలని నిర్ణయం
జేబీఎస్ వద్ద మెట్రో హబ్ ఏర్పాటు - సుదీర్ఘ కారిడార్కు అధికారుల ప్రణాళికలు