ETV Bharat / state

వేళాపాళా లేని ఎంఎంటీఎస్​ రైళ్లు - నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు

ఎంఎంటీఎస్​లు సమయ పాలన పాటించట్లేదని ప్రయాణికుల ఆవేదన - ఎందుకింత నిర్లక్ష్యం అని ప్రశ్న

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

MMTS Train Timing Issue In Hyd
MMTS Train Timing Issue In Hyd (ETV Bharat)

MMTS Train Timing Issue In Hyderabad : వర్షం ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు రాదో చెప్పవచ్చు కానీ ఎంఎంటీఎస్ సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో ఎప్పుడు రద్దవుతాయో చెప్పడం కష్టం. వీటిని నమ్ముకున్న విద్యార్థులు, ఉద్యోగులు అనేక ఇబ్బందులకు, అవస్థలకు గురవుతున్నారు. ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు సమయ పాలన పాటించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన దుస్థితి ఎదురవుతోంది. అయినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే ఏమాత్రం కనికరం చూపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఎంఎంటీఎస్​లపై ఎందుకీ నిర్లక్ష్యం అని ప్రశ్నిస్తున్నారు.

ఆలోచన గొప్పదే కానీ ఆచరణ శూన్యం : ప్రయాణికుల అవసరాలను గుర్తించి వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మల్టీ మోడల్ ట్రాన్స్ ఫోర్ట్ సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే నిరుపేద, మధ్య తరగతి ప్రయాణికులకు అనుగుణంగా ఎంఎంటీఎస్​ రైళ్లను ప్రవేశపెట్టింది. వీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 2003లో అప్పటి భారత ఉప ప్రధాని ఎల్.కే.అడ్వాణీ చేతుల మీదుగా ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం 88 ఎంఎంటీఎస్​లు : ప్రారంభంలో ఆరు కోచ్​లు 30 సర్వీసులు నడిచేవి. వీటిలో నిత్యం 25 వేల ప్రయాణికులు ప్రయాణించేవారు. కాలానుగుణంగా ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులను 121కి పెంచారు. ఒక్కో సర్వీసులో 12 కోచ్​లకు చేరుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో సుమారు ఏడాదిన్నర కాలం పాటు ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లు కేవలం షెడ్డుకే పరిమితమయ్యాయి. ఆ సమయంలో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్​డౌన్ తర్వాత నుంచి ప్రస్తుతం 88 ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి.

ఎంఎంటీఎస్ రైళ్లలో సాంకేతికతకు పెద్ద పీఠ : ఎంఎంటీఎస్ రైళ్లలో సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. పాత ఎంఎంటీఎస్​ రైళ్లలో 700ల మంది కూర్చుని 2000 మంది నిల్చుని ప్రయాణించే వారు. కొత్త ఎంఎంటీఎస్​ రైళ్లలో 1,150 మంది కూర్చుని 4 వేల మంది నిల్చుని ప్రయాణించే అవకాశముంది. మహిళా ప్రయాణికులు ప్రయాణించే బోగీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విశాలమైన బోగీలను ఏర్పాటు చేశారు. కిటికీలకు జాలీలను ఏర్పాటు చేశారు. వీటితో మహిళా ప్రయాణికులకు పెద్ద పీఠ వేశామని రైల్వే అధికారులు అంటున్నారు.

ఎంఎటీఎస్​ల ప్రత్యేకతలు ఇవే : ప్రస్తుతం ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు సికింద్రాబాద్-నాంపల్లి, సికింద్రాబాద్-ఫలక్ నుమా, ఫలక్​నుమా - లింగంపల్లి మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. కొత్త ఎం.ఎం.టి.ఎస్ రైళ్లలో ఎల్ఈడీ బోర్డులు, మైక్​లో స్టేషన్ల వివరాలు వెల్లడించడం, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, వెలుతురు బాగా ప్రసరించేలా బోగీలను ఏర్పాటు చేశారు. ఆకట్టుకునే ఆకర్షణీమైన రంగులతో రైలు బోగీలను తీర్చిదిద్దారు.

అత్యాధునిక సాంకేతికతో బ్రేకింక్ విధానం, ఇంజిన్లు పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికులు కూర్చుని ప్రయాణించేందుకు సౌకర్యవంతమైన సీట్లను ఏర్పాటు చేశారు. నిల్చుని ప్రయాణించే ప్రయాణికుల కోసం హ్యాంగర్స్​ను ఏర్పాటు చేశారు. ఎక్కువ సామన్లు తరలించేందుకు విశాలమైన బోగీలను తయారు చేశారు. పాత ఎం.ఎం.టి.ఎస్ రైళ్లతో పోల్చుకుంటే కొత్త ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులను అత్యాధునికంగా తీర్చిదిద్దారు.

ప్రస్తుతం ఈ మార్గాల్లో ఎంఎంటీఎస్​ సేవలు : ప్రస్తుతం ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులు ఘట్​కేసర్ - లింగంపల్లి, మేడ్చల్ - సికింద్రాబాద్, ఫలక్​నుమా - లింగంపల్లి, హైదరాబాద్ -లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్ నుమా రూట్లలో తిరుగుతున్నాయి. ఘట్​కేసర్ -లింగంపల్లి రూట్​లో ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులు ఘట్​కేసర్ - చర్లపల్లి, మౌలాలి, నేరేడ్​మెట్, సుచిత్ర, సనత్​నగర్ స్టేషన్​ల మీదుగా లింగంపల్లి వెళతాయి. మేడ్చల్-సికింద్రాబాద్ రూట్​లో ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులు లాలాగూడ గేట్, మల్కాజిగిరి, దయానంద నగర్, సఫిల్ గూడ, ఆర్.కే.పురం, అమ్ముగూడ, కావర్లీ బ్యారెక్స్, అల్వాల్, బొల్లారం బజార్, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి స్టేషన్ల మీదుగా వెళతాయి.

125 కిలోమీటర్లు పరిధిలో సేవలందిస్తూ : ప్రస్తుతం ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు 123.5 కి.మీల పరిధిలో సేవలు అందిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 53 స్టేషన్లలో ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు కవర్ చేస్తున్నాయి. ప్రస్తుతం 88 ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అందులో భాగంగానే సికింద్రాబాద్ - మేడ్చల్ రూట్ లో కొత్తగా 20 సర్వీసులను తిప్పుతున్నారు. ఘట్కేసర్-లింగంపల్లి రూట్ లో రెండు సర్వీసులను తిప్పుతున్నారు. ఫలక్ నుమా-ఉందానగర్ రూట్ లో మరో 20 సర్వీసులను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

వేళాపాలా లేని ఎంఎటీఎస్​ సర్వీసులు : ఎం.ఎం.టీ.ఎస్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఐదేళ్లక్రితం వరకు ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు క్రమం తప్పకుండా సమయపాలన ఖచ్చితంగా పాటించేవి. దీంతో ఈ సర్వీసుల్లోనే విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ప్రయాణించేవారు. ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ లకు వచ్చే ప్రయాణికులు సైతం ఎక్కువగా ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసుల్లోనే ప్రయాణించేవారు. కానీ రానురాను సమయపాలన పాటించడంలేదు.

సమయపాలనే పాటించకపోవడమే పెద్దసమస్య : శని,ఆదివారాల్లో ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు అందుబాటులో ఉండడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రద్దవుతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తద్వారా అన్ని వర్గాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.

సమయానికి కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నామని ఉద్యోగస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నామంటున్నారు. ఏదైనా అసవరం నిమిత్తం ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసుల్లో ప్రయాణిస్తే నరకం కనిపిస్తుందని గృహిణులు వాపోతున్నారు. ఇంకా ఈ తిప్పలు ఎన్నాళ్లు అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అకారణంగా ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లను ఎందుకు రద్దు చేస్తున్నారని మండిపడుతున్నారు.

ఆ నెపంతో ఎంఎంటీఎస్​లు తగ్గిస్తున్నారని ఫైర్ : ట్రాక్ మెయింటనెన్స్ పేరుతో వారానికి రెండు రోజులు ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులను నిలిపివేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఎప్పుడు ట్రాక్ మెయింటనెన్స్ చేస్తున్నారో అర్థంకావడంలేదంటున్నారు. ప్రయాణికులు లేరనే నెపంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లను రద్దు చేస్తున్నామని ప్రకటిస్తున్నారు. కానీ వాస్తవానికి ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు లేకపోవడం వల్లనే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇప్పటికైనా ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులను అర్థాంతరంగా రద్దు చేయకుండా సమయపాలన పాటించేలా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తిచేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రూట్లలో ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు నిరంతరం నడిచేలా చూడాలని దక్షిణ మధ్య రైల్వేకు ప్రయాణికులు విజ్ఞప్తిచేస్తున్నారు.

అరకొర ఎంఎంటీఎస్​లతో ప్రయాణికుల అవస్థలు - మరిన్ని రైళ్లు నడపాలని విజ్ఞప్తి - MMTS Trains Delay in Hyderabad

MMTS: 2024 జనవరి నాటికి అందుబాటులోకి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు

MMTS Train Timing Issue In Hyderabad : వర్షం ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు రాదో చెప్పవచ్చు కానీ ఎంఎంటీఎస్ సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో ఎప్పుడు రద్దవుతాయో చెప్పడం కష్టం. వీటిని నమ్ముకున్న విద్యార్థులు, ఉద్యోగులు అనేక ఇబ్బందులకు, అవస్థలకు గురవుతున్నారు. ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు సమయ పాలన పాటించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన దుస్థితి ఎదురవుతోంది. అయినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే ఏమాత్రం కనికరం చూపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఎంఎంటీఎస్​లపై ఎందుకీ నిర్లక్ష్యం అని ప్రశ్నిస్తున్నారు.

ఆలోచన గొప్పదే కానీ ఆచరణ శూన్యం : ప్రయాణికుల అవసరాలను గుర్తించి వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మల్టీ మోడల్ ట్రాన్స్ ఫోర్ట్ సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే నిరుపేద, మధ్య తరగతి ప్రయాణికులకు అనుగుణంగా ఎంఎంటీఎస్​ రైళ్లను ప్రవేశపెట్టింది. వీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 2003లో అప్పటి భారత ఉప ప్రధాని ఎల్.కే.అడ్వాణీ చేతుల మీదుగా ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం 88 ఎంఎంటీఎస్​లు : ప్రారంభంలో ఆరు కోచ్​లు 30 సర్వీసులు నడిచేవి. వీటిలో నిత్యం 25 వేల ప్రయాణికులు ప్రయాణించేవారు. కాలానుగుణంగా ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులను 121కి పెంచారు. ఒక్కో సర్వీసులో 12 కోచ్​లకు చేరుకున్నాయి. లాక్ డౌన్ సమయంలో సుమారు ఏడాదిన్నర కాలం పాటు ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లు కేవలం షెడ్డుకే పరిమితమయ్యాయి. ఆ సమయంలో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్​డౌన్ తర్వాత నుంచి ప్రస్తుతం 88 ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి.

ఎంఎంటీఎస్ రైళ్లలో సాంకేతికతకు పెద్ద పీఠ : ఎంఎంటీఎస్ రైళ్లలో సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. పాత ఎంఎంటీఎస్​ రైళ్లలో 700ల మంది కూర్చుని 2000 మంది నిల్చుని ప్రయాణించే వారు. కొత్త ఎంఎంటీఎస్​ రైళ్లలో 1,150 మంది కూర్చుని 4 వేల మంది నిల్చుని ప్రయాణించే అవకాశముంది. మహిళా ప్రయాణికులు ప్రయాణించే బోగీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విశాలమైన బోగీలను ఏర్పాటు చేశారు. కిటికీలకు జాలీలను ఏర్పాటు చేశారు. వీటితో మహిళా ప్రయాణికులకు పెద్ద పీఠ వేశామని రైల్వే అధికారులు అంటున్నారు.

ఎంఎటీఎస్​ల ప్రత్యేకతలు ఇవే : ప్రస్తుతం ఎం.ఎం.టి.ఎస్ రైళ్లు సికింద్రాబాద్-నాంపల్లి, సికింద్రాబాద్-ఫలక్ నుమా, ఫలక్​నుమా - లింగంపల్లి మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. కొత్త ఎం.ఎం.టి.ఎస్ రైళ్లలో ఎల్ఈడీ బోర్డులు, మైక్​లో స్టేషన్ల వివరాలు వెల్లడించడం, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, వెలుతురు బాగా ప్రసరించేలా బోగీలను ఏర్పాటు చేశారు. ఆకట్టుకునే ఆకర్షణీమైన రంగులతో రైలు బోగీలను తీర్చిదిద్దారు.

అత్యాధునిక సాంకేతికతో బ్రేకింక్ విధానం, ఇంజిన్లు పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికులు కూర్చుని ప్రయాణించేందుకు సౌకర్యవంతమైన సీట్లను ఏర్పాటు చేశారు. నిల్చుని ప్రయాణించే ప్రయాణికుల కోసం హ్యాంగర్స్​ను ఏర్పాటు చేశారు. ఎక్కువ సామన్లు తరలించేందుకు విశాలమైన బోగీలను తయారు చేశారు. పాత ఎం.ఎం.టి.ఎస్ రైళ్లతో పోల్చుకుంటే కొత్త ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులను అత్యాధునికంగా తీర్చిదిద్దారు.

ప్రస్తుతం ఈ మార్గాల్లో ఎంఎంటీఎస్​ సేవలు : ప్రస్తుతం ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులు ఘట్​కేసర్ - లింగంపల్లి, మేడ్చల్ - సికింద్రాబాద్, ఫలక్​నుమా - లింగంపల్లి, హైదరాబాద్ -లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్ నుమా రూట్లలో తిరుగుతున్నాయి. ఘట్​కేసర్ -లింగంపల్లి రూట్​లో ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులు ఘట్​కేసర్ - చర్లపల్లి, మౌలాలి, నేరేడ్​మెట్, సుచిత్ర, సనత్​నగర్ స్టేషన్​ల మీదుగా లింగంపల్లి వెళతాయి. మేడ్చల్-సికింద్రాబాద్ రూట్​లో ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులు లాలాగూడ గేట్, మల్కాజిగిరి, దయానంద నగర్, సఫిల్ గూడ, ఆర్.కే.పురం, అమ్ముగూడ, కావర్లీ బ్యారెక్స్, అల్వాల్, బొల్లారం బజార్, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి స్టేషన్ల మీదుగా వెళతాయి.

125 కిలోమీటర్లు పరిధిలో సేవలందిస్తూ : ప్రస్తుతం ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు 123.5 కి.మీల పరిధిలో సేవలు అందిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 53 స్టేషన్లలో ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు కవర్ చేస్తున్నాయి. ప్రస్తుతం 88 ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అందులో భాగంగానే సికింద్రాబాద్ - మేడ్చల్ రూట్ లో కొత్తగా 20 సర్వీసులను తిప్పుతున్నారు. ఘట్కేసర్-లింగంపల్లి రూట్ లో రెండు సర్వీసులను తిప్పుతున్నారు. ఫలక్ నుమా-ఉందానగర్ రూట్ లో మరో 20 సర్వీసులను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

వేళాపాలా లేని ఎంఎటీఎస్​ సర్వీసులు : ఎం.ఎం.టీ.ఎస్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఐదేళ్లక్రితం వరకు ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు క్రమం తప్పకుండా సమయపాలన ఖచ్చితంగా పాటించేవి. దీంతో ఈ సర్వీసుల్లోనే విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ప్రయాణించేవారు. ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ లకు వచ్చే ప్రయాణికులు సైతం ఎక్కువగా ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసుల్లోనే ప్రయాణించేవారు. కానీ రానురాను సమయపాలన పాటించడంలేదు.

సమయపాలనే పాటించకపోవడమే పెద్దసమస్య : శని,ఆదివారాల్లో ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు అందుబాటులో ఉండడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రద్దవుతాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తద్వారా అన్ని వర్గాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.

సమయానికి కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నామని ఉద్యోగస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నామంటున్నారు. ఏదైనా అసవరం నిమిత్తం ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసుల్లో ప్రయాణిస్తే నరకం కనిపిస్తుందని గృహిణులు వాపోతున్నారు. ఇంకా ఈ తిప్పలు ఎన్నాళ్లు అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అకారణంగా ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లను ఎందుకు రద్దు చేస్తున్నారని మండిపడుతున్నారు.

ఆ నెపంతో ఎంఎంటీఎస్​లు తగ్గిస్తున్నారని ఫైర్ : ట్రాక్ మెయింటనెన్స్ పేరుతో వారానికి రెండు రోజులు ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులను నిలిపివేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఎప్పుడు ట్రాక్ మెయింటనెన్స్ చేస్తున్నారో అర్థంకావడంలేదంటున్నారు. ప్రయాణికులు లేరనే నెపంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లను రద్దు చేస్తున్నామని ప్రకటిస్తున్నారు. కానీ వాస్తవానికి ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు లేకపోవడం వల్లనే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇప్పటికైనా ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులను అర్థాంతరంగా రద్దు చేయకుండా సమయపాలన పాటించేలా చూడాలని ప్రయాణికులు విజ్ఞప్తిచేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రూట్లలో ఎం.ఎం.టీ.ఎస్ సర్వీసులు నిరంతరం నడిచేలా చూడాలని దక్షిణ మధ్య రైల్వేకు ప్రయాణికులు విజ్ఞప్తిచేస్తున్నారు.

అరకొర ఎంఎంటీఎస్​లతో ప్రయాణికుల అవస్థలు - మరిన్ని రైళ్లు నడపాలని విజ్ఞప్తి - MMTS Trains Delay in Hyderabad

MMTS: 2024 జనవరి నాటికి అందుబాటులోకి ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.