ETV Bharat / state

కోళ్ల ఫారం చాటున అక్రమ మత్తు దందా - రూ.కోటి విలువ చేసే అల్ఫాజోలం పట్టివేత - Rs 1 Crore Alprazolam Seized

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 10:32 PM IST

Huge Drugs Seized in Telangana : రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపి, డ్రగ్స్‌​ రహిత దిశగా రేవంత్‌ సర్కార్‌ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారీ ఎత్తున అక్రమ మత్తు దందా నడుస్తూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో రెండు వేరువేరు చోట్ల ఎస్‌ఓటీ పోలీసులు జరిపిన దాడుల్లో భారీ స్థాయిలో అల్ఫాజోలం, హాష్‌ ఆయిల్ వంటి మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. సంగారెడ్డిలో కోటి రూపాయలు విలువ చేసే 2.6 కిలోల ఆల్ఫా జోలంతో పాటు, ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Huge Amount of Drugs Seized in Telangana
Rs 1 Crore Alprazolam Seized in Sangareddy (ETV Bharat)

Rs 1 Crore Alprazolam Seized in Sangareddy : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి శివారులో కోళ్ల ఫారంపై టీజీ-నాబ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి కోటి రూపాయలు విలువ గల 2.6 కిలోల ఆల్ఫా జోలంతో పాటు, ముడి పదార్థాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మత్తు పదార్ధాలను తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అంజిరెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌, సాయికుమార్‌తో పాటు వికారాబాద్‌ జిల్లా పంచలింగాలకి చెందిన కెమిస్ట్‌ రాకేశ్‌ వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని కోళ్లఫారం నిర్వహిస్తూ అక్రమంగా ఆల్ఫా జోలం తయారు చేస్తున్నారు. తయారు చేసిన మత్తుపదార్ధాన్ని అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ గౌడ్ అనే కల్లు దుకాణాల్లో అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు.

రూ.కోటి విలువ చేసే అల్ఫాజోలం పట్టివేత : పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు కోటి రూపాయలు విలువైన 2.6 కిలోల ఆల్ఫాజోలంతో పాటు, రూ.60 లక్షలు విలువైన ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల్లో అంజిరెడ్డి, రాకేశ్‌ అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభాకర్‌గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మరో నిందితుడు సాయికుమార్ గౌడ్ జైల్లో ఉన్నట్లు ఎస్పీ రూపేశ్‌ తెలిపారు. వీరు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని కోళ్ల ఫారం నిర్వహిస్తూ ఈ అక్రమ నిషేధిత మత్తు పదార్థం తయారీ చేస్తున్నారని వివరించారు.

Hyderabad Drug Gang Arrested : మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న రెండు ముఠాలను ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. విలాసాలకు అలవాటుపడి మత్తుకు బానిసై డ్రగ్స్‌ సేవించడంతో పాటు విక్రయిస్తున్న భరత్ రెడ్డి, విక్యాత్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కొనుగోలు చేస్తున్న హేమంత్ కుమార్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 4చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు కర్ణాటకు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరో కేసులో విశాఖపట్నంలోని నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి హాష్ ఆయిల్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 2లీటర్ల హాష్ ఆయిల్‌, 3చరవాణులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి హాష్ ఆయిల్‌ను తక్కువ ధరకు కొని నగరంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

'సరదా కోసం మొదలెట్టి - సరఫరా చేయాల్సిన స్థితికి' - మత్తు ముఠాల ఉచ్చులో చిక్కుకుంటున్న మహిళలు - Women Use Drugs in Hyderabad

హైదరాబాద్​లో డ్రగ్స్​పై కట్టుదిట్టమైన చర్యలు - పాజిటివ్​ అని తేలితే జైలుకే - Antinarcotics Police Clarity Drugs

Rs 1 Crore Alprazolam Seized in Sangareddy : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి శివారులో కోళ్ల ఫారంపై టీజీ-నాబ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి కోటి రూపాయలు విలువ గల 2.6 కిలోల ఆల్ఫా జోలంతో పాటు, ముడి పదార్థాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మత్తు పదార్ధాలను తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అంజిరెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌, సాయికుమార్‌తో పాటు వికారాబాద్‌ జిల్లా పంచలింగాలకి చెందిన కెమిస్ట్‌ రాకేశ్‌ వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని కోళ్లఫారం నిర్వహిస్తూ అక్రమంగా ఆల్ఫా జోలం తయారు చేస్తున్నారు. తయారు చేసిన మత్తుపదార్ధాన్ని అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ గౌడ్ అనే కల్లు దుకాణాల్లో అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు.

రూ.కోటి విలువ చేసే అల్ఫాజోలం పట్టివేత : పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు కోటి రూపాయలు విలువైన 2.6 కిలోల ఆల్ఫాజోలంతో పాటు, రూ.60 లక్షలు విలువైన ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల్లో అంజిరెడ్డి, రాకేశ్‌ అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రభాకర్‌గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మరో నిందితుడు సాయికుమార్ గౌడ్ జైల్లో ఉన్నట్లు ఎస్పీ రూపేశ్‌ తెలిపారు. వీరు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని కోళ్ల ఫారం నిర్వహిస్తూ ఈ అక్రమ నిషేధిత మత్తు పదార్థం తయారీ చేస్తున్నారని వివరించారు.

Hyderabad Drug Gang Arrested : మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న రెండు ముఠాలను ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. విలాసాలకు అలవాటుపడి మత్తుకు బానిసై డ్రగ్స్‌ సేవించడంతో పాటు విక్రయిస్తున్న భరత్ రెడ్డి, విక్యాత్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కొనుగోలు చేస్తున్న హేమంత్ కుమార్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 4చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు కర్ణాటకు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరో కేసులో విశాఖపట్నంలోని నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి హాష్ ఆయిల్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 2లీటర్ల హాష్ ఆయిల్‌, 3చరవాణులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి హాష్ ఆయిల్‌ను తక్కువ ధరకు కొని నగరంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

'సరదా కోసం మొదలెట్టి - సరఫరా చేయాల్సిన స్థితికి' - మత్తు ముఠాల ఉచ్చులో చిక్కుకుంటున్న మహిళలు - Women Use Drugs in Hyderabad

హైదరాబాద్​లో డ్రగ్స్​పై కట్టుదిట్టమైన చర్యలు - పాజిటివ్​ అని తేలితే జైలుకే - Antinarcotics Police Clarity Drugs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.