ETV Bharat / state

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు - Heavy Rains in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2024, 9:06 AM IST

Updated : Sep 1, 2024, 12:18 PM IST

Heavy Rains in AP : ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల పైకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంట పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

HEAVY RAINS IN AP
HEAVY RAINS IN AP (ETV Bharat)

AP Rains Today 2024 : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు వరదలో చిక్కుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను వరద నీరు ముంచెత్తింది. విజయవాడలోని బుడమేరు కట్ట, అంబాపురంపైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగడంతో నగరంలోని సుందరయ్య నగర్, రాజీవ్​నగర్, ప్రకాశ్​నగర్ పైపుల రోడ్డు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నున్న ప్రాంతంలోని అగ్నిమాపకశాఖ సిబ్బంది ఇళ్లు నీట మనిగాయి.

తప్పిన పెనుప్రమాదం : జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి గ్రామశివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వరద వచ్చింది. పలు ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలలో పనిచేసే కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సుమారు 6 అడుగుల మేర నీరు చేరుకుంది. దీంతో స్థానికులు ఇళ్ల పైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. జక్కంపూడి జేఎన్​ఎన్​యూఆర్ఎం కాలనీలో అర్ధరాత్రి నాలుగు అడుగులపైగా వరద నీరు చేరగా పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేయటంతో పెను ప్రమాదం తప్పింది.

Heavy Rains in Andhra Pradesh : విజయవాడ బస్టాండ్‌ వద్ద రైల్వే అండర్‌పాస్‌ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో అక్కడ నిలిపిన 4 బస్సులు నీట మునిగాయి. దీంతో అధికారులు భారీ మోటార్ల ద్వారా నీటిని కృష్ణా నదిలోకి పంపింగ్ చేశారు. అనంతరం బస్సులను క్రేన్ల సాయంతో బయటకు తీశారు. రైల్వేట్రాక్ కింది నుంచి కనకదుర్గ పైవంతెన మీదుగా వెళ్లే మార్గాన్ని పునరుద్ధరించారు. తద్వారా విజయవాడ-హైదరాబాద్ మార్గంలో బస్సులు నడుస్తున్నాయి.

అల్లూరి జిల్లావ్యాప్తంగా వర్షాలు : అల్లూరి జిల్లావ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఘాట్‌రోడ్లలో భారీ వాహనాలకు అనుమతి లేదని కలెక్టర్ దినేష్‌ కుమార్‌ తెలిపారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంపచోడవరం ముంపు ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు.

బాపట్ల జిల్లా వేమూరులో ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో లంక గ్రామాలను కలెక్టర్ మురళీకృష్ణ, ఆర్డీఓ హేలా షారోన్‌ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను ప్రభుత్వం సరఫరా చేస్తోందని ఆయన పేర్కొన్నారు. త్రాగునీరు సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మురళీకృష్ణ ఆదేశించారు.

దివిసీమకు పొంచి ఉన్న వరద ముంపు : మరోవైపు దివిసీమకు వరద ముంపు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల పరిధిలోని గ్రామాలు ముంపునకు గురయ్యయి. పసుపు, అరటి , కంద, మొక్కజొన్న , బంతి, బొప్పాయి, మల్బరీతోపాటు పట్టు పురుగుల షెడ్ల నీటమునిగాయి. ఉత్తర చిరువోల్లంకలో కరకట్టపై ఉన్న లాకులు పనిచేయక నది నుంచి వరద పొలాలను ముంచెత్తింది. ఫలితంగా రొయ్యలు, చేపలు, పీతల చెరువులకు నష్టం వాటిలింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు.

అల్పపీడనం ప్రభావం - ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు - Heavy rains in Prakasam district

ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తారంగా వానలు - నలుగురు మృతి - Guntur Heavy Rains

AP Rains Today 2024 : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు వరదలో చిక్కుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను వరద నీరు ముంచెత్తింది. విజయవాడలోని బుడమేరు కట్ట, అంబాపురంపైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగడంతో నగరంలోని సుందరయ్య నగర్, రాజీవ్​నగర్, ప్రకాశ్​నగర్ పైపుల రోడ్డు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నున్న ప్రాంతంలోని అగ్నిమాపకశాఖ సిబ్బంది ఇళ్లు నీట మనిగాయి.

తప్పిన పెనుప్రమాదం : జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి గ్రామశివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వరద వచ్చింది. పలు ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలలో పనిచేసే కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సుమారు 6 అడుగుల మేర నీరు చేరుకుంది. దీంతో స్థానికులు ఇళ్ల పైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. జక్కంపూడి జేఎన్​ఎన్​యూఆర్ఎం కాలనీలో అర్ధరాత్రి నాలుగు అడుగులపైగా వరద నీరు చేరగా పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేయటంతో పెను ప్రమాదం తప్పింది.

Heavy Rains in Andhra Pradesh : విజయవాడ బస్టాండ్‌ వద్ద రైల్వే అండర్‌పాస్‌ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో అక్కడ నిలిపిన 4 బస్సులు నీట మునిగాయి. దీంతో అధికారులు భారీ మోటార్ల ద్వారా నీటిని కృష్ణా నదిలోకి పంపింగ్ చేశారు. అనంతరం బస్సులను క్రేన్ల సాయంతో బయటకు తీశారు. రైల్వేట్రాక్ కింది నుంచి కనకదుర్గ పైవంతెన మీదుగా వెళ్లే మార్గాన్ని పునరుద్ధరించారు. తద్వారా విజయవాడ-హైదరాబాద్ మార్గంలో బస్సులు నడుస్తున్నాయి.

అల్లూరి జిల్లావ్యాప్తంగా వర్షాలు : అల్లూరి జిల్లావ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఘాట్‌రోడ్లలో భారీ వాహనాలకు అనుమతి లేదని కలెక్టర్ దినేష్‌ కుమార్‌ తెలిపారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంపచోడవరం ముంపు ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు.

బాపట్ల జిల్లా వేమూరులో ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో లంక గ్రామాలను కలెక్టర్ మురళీకృష్ణ, ఆర్డీఓ హేలా షారోన్‌ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను ప్రభుత్వం సరఫరా చేస్తోందని ఆయన పేర్కొన్నారు. త్రాగునీరు సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మురళీకృష్ణ ఆదేశించారు.

దివిసీమకు పొంచి ఉన్న వరద ముంపు : మరోవైపు దివిసీమకు వరద ముంపు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజి నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల పరిధిలోని గ్రామాలు ముంపునకు గురయ్యయి. పసుపు, అరటి , కంద, మొక్కజొన్న , బంతి, బొప్పాయి, మల్బరీతోపాటు పట్టు పురుగుల షెడ్ల నీటమునిగాయి. ఉత్తర చిరువోల్లంకలో కరకట్టపై ఉన్న లాకులు పనిచేయక నది నుంచి వరద పొలాలను ముంచెత్తింది. ఫలితంగా రొయ్యలు, చేపలు, పీతల చెరువులకు నష్టం వాటిలింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు.

అల్పపీడనం ప్రభావం - ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు - Heavy rains in Prakasam district

ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తారంగా వానలు - నలుగురు మృతి - Guntur Heavy Rains

Last Updated : Sep 1, 2024, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.