ETV Bharat / state

గ్రూప్‌-1 అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జ్‌

హైదరాబాద్​లోని అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళన - లాఠీఛార్జ్‌ చేసిన పోలీసులు - పలువురికి గాయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 40 minutes ago

Group1 Candidates Protest In Hyderabad
Group1 Candidates Protest At Ashok Nagar (ETV Bharat)

Group1 Candidates Protest At Ashok Nagar : గ్రూప్‌-1 పరీక్ష రీ షెడ్యూల్‌ చేయాలని కోరుతూ అశోక్‌నగర్‌లో అభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైకి చేరుకుని నినాదాలు చేస్తు ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. వందల సంఖ్యలో చేరుకున్న అభ్యర్ధులు గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో అశోక్‌నగర్‌లో పోలీసు పహారా కొనసాగుతోంది.

మరోవైపు ఈనెల 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు మార్గం సుగమం అయింది. గ్రూప్‌-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే ఈనెల 21 గ్రూప్‌-1 పరీక్షలు జరగనున్నాయి.

జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థుల నిరసన : దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో 29ను రద్దు చేయాలని రాష్ట్రంలోని గ్రూప్‌-1 అభ్యర్థులు కోరుతున్నారు. జనరల్‌ కేటగిరీలోని క్యాండిడేట్స్​ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌రిజర్వుడుగానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌కు పిలవాలని కోరుతున్నారు.

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గ్రూప్‌-1 పరీక్షలు నిలిపివేయాలని కొందరు అభ్యర్థులు కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్‌ రద్దు చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం నియామకాలనేవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గ్రూప్​-1 అభ్యర్థులు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్ - ఆ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

అశోక్ నగర్​లో పరిస్థితి ఆందోళనకరం - మళ్లీ రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు

Group1 Candidates Protest At Ashok Nagar : గ్రూప్‌-1 పరీక్ష రీ షెడ్యూల్‌ చేయాలని కోరుతూ అశోక్‌నగర్‌లో అభ్యర్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైకి చేరుకుని నినాదాలు చేస్తు ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. వందల సంఖ్యలో చేరుకున్న అభ్యర్ధులు గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రూప్‌-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో అశోక్‌నగర్‌లో పోలీసు పహారా కొనసాగుతోంది.

మరోవైపు ఈనెల 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు మార్గం సుగమం అయింది. గ్రూప్‌-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే ఈనెల 21 గ్రూప్‌-1 పరీక్షలు జరగనున్నాయి.

జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థుల నిరసన : దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో 29ను రద్దు చేయాలని రాష్ట్రంలోని గ్రూప్‌-1 అభ్యర్థులు కోరుతున్నారు. జనరల్‌ కేటగిరీలోని క్యాండిడేట్స్​ కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌రిజర్వుడుగానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్‌ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌కు పిలవాలని కోరుతున్నారు.

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గ్రూప్‌-1 పరీక్షలు నిలిపివేయాలని కొందరు అభ్యర్థులు కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్‌ రద్దు చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం నియామకాలనేవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గ్రూప్​-1 అభ్యర్థులు తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్ - ఆ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

అశోక్ నగర్​లో పరిస్థితి ఆందోళనకరం - మళ్లీ రోడ్డెక్కిన గ్రూప్-1 అభ్యర్థులు

Last Updated : 40 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.