ETV Bharat / state

చికెన్​ బిర్యానీలో కప్ప - కంగుతిన్న గచ్చిబౌలి ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు

గచ్చిబౌలి ఐఐఐటీ మెస్​ వడ్డించిన చికెన్​ బిర్యానీలో కప్ప - ఒక్కసారిగా కంగుతున్న విద్యార్థులు - ఫొటో తీసి సోషల్​ మీడియాలో షేర్​ చేసిన విద్యార్థి - నెట్టింట వైరల్​ అవుతున్న న్యూస్

author img

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

Frog in Chicken Biryani in Hyderabad IIIT Mess
Frog in Chicken Biryani in Hyderabad IIIT Mess (ETV Bharat)

Frog in Chicken Biryani in Hyderabad IIIT Mess : బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా బిర్యానీ లేనిదే ముద్ద దిగదు. బిర్యానీ అంటేనే ఓ ఎమోషన్​. బిర్యానీ ముఖ్యంగా ఫిష్​ బిర్యానీ, మటన్​ బిర్యానీ, ప్రాన్స్​ బిర్యానీ, కుండ బిర్యానీ, దమ్​ బిర్యానీ అంటూ ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంచక్కా లాగించేస్తుంటారు. బిర్యానీ అంటే కేవలం హైదరాబాద్​కు మాత్రమే పరిమితం కాదు అన్నట్లు బిర్యానీ రెసిపీలను తయారు చేస్తారు. అందులోనూ చికెన్​ బిర్యానీ అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు యమ క్రేజ్​గా యమ్మీ యమ్మీ అంటూ లాగించేస్తుంటారు.

సాధారణంగా చికెన్​ బిర్యానీ వండాలంటే చికెన్​తో పాటు లవంగాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలుతో పాటు కొత్తి మీర, పుదీనా, నెయ్యి వేసి చేస్తుంటారు. ఇవి అన్ని పెనంలో పడిన తర్వాత చికెన్​ బిర్యానీకి వచ్చే టేస్టే అదరహో అనిపిస్తుంది. కానీ అవేమీ కాకుండా ఈ మధ్య జెర్రెలు, బల్లులు, బొద్దింకలతో కొందరు చికెన్​ బిర్యానీ చేస్తున్నారు. ఇలాంటివి చాలా చోట్లనే జరుగుతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్​లోని ఓ రెస్టారెంట్​లో చికెన్​ బిర్యానీ జెర్రీ వచ్చిందన్న వార్త సోషల్​ మీడియాతో హల్​చల్​ సృష్టించింది. ఆ జెర్రీ విషయాన్ని మర్చిపోకముందే, బిర్యానీలో చనిపోయిన కప్ప అంటూ ఓ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Frog in Chicken Biryani in Hyderabad IIIT Mess
చికెన్​ బిర్యానీలో కప్ప (ETV Bharat)

చికెన్​ బిర్యానీలో కప్ప : హైదరాబాద్​లోని గచ్చిబౌలి ట్రిపుల్​ ఐటీ మెస్​లో ఈ తంతు వెలుగు చూసింది. ఈ నెల 16న విద్యార్థులకు మెస్​లో చికెన్​ బిర్యానీ వడ్డిస్తుండగా అందులో కప్ప ప్రత్యక్షమైంది. పైగా ఆ కప్ప బతికి లేదు. చనిపోయి ఉంది. ఆ ఫొటోను చూస్తే ఏకంగా బిర్యానీతో పాటు వండేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు కంగుతిన్నారు. ఆ షాక్​ నుంచి తేరుకొని మెస్​ ఇన్​ఛార్జికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోను ఎవరో విద్యార్థి సోషల్​ మీడియా వేదిక (ఎక్స్)గా షేర్​ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. సోషల్​ మీడియాలో షేర్​ చేయడంతో ప్రస్తుతం చికెన్​ బిర్యానీలో కప్ప అని వైరల్​ అవుతుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాడైపోయిన మటన్‌తో బిర్యానీ - అల్ఫా హోటల్‌కు ఫైన్ - SECUNDERABAD ALPHA HOTEL FINED

రోగికి పెట్టిన ఆహారంలో బొద్దింక.. దిల్లీ ఎయిమ్స్​లో ఘటన!

Frog in Chicken Biryani in Hyderabad IIIT Mess : బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా బిర్యానీ లేనిదే ముద్ద దిగదు. బిర్యానీ అంటేనే ఓ ఎమోషన్​. బిర్యానీ ముఖ్యంగా ఫిష్​ బిర్యానీ, మటన్​ బిర్యానీ, ప్రాన్స్​ బిర్యానీ, కుండ బిర్యానీ, దమ్​ బిర్యానీ అంటూ ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంచక్కా లాగించేస్తుంటారు. బిర్యానీ అంటే కేవలం హైదరాబాద్​కు మాత్రమే పరిమితం కాదు అన్నట్లు బిర్యానీ రెసిపీలను తయారు చేస్తారు. అందులోనూ చికెన్​ బిర్యానీ అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు యమ క్రేజ్​గా యమ్మీ యమ్మీ అంటూ లాగించేస్తుంటారు.

సాధారణంగా చికెన్​ బిర్యానీ వండాలంటే చికెన్​తో పాటు లవంగాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలుతో పాటు కొత్తి మీర, పుదీనా, నెయ్యి వేసి చేస్తుంటారు. ఇవి అన్ని పెనంలో పడిన తర్వాత చికెన్​ బిర్యానీకి వచ్చే టేస్టే అదరహో అనిపిస్తుంది. కానీ అవేమీ కాకుండా ఈ మధ్య జెర్రెలు, బల్లులు, బొద్దింకలతో కొందరు చికెన్​ బిర్యానీ చేస్తున్నారు. ఇలాంటివి చాలా చోట్లనే జరుగుతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్​లోని ఓ రెస్టారెంట్​లో చికెన్​ బిర్యానీ జెర్రీ వచ్చిందన్న వార్త సోషల్​ మీడియాతో హల్​చల్​ సృష్టించింది. ఆ జెర్రీ విషయాన్ని మర్చిపోకముందే, బిర్యానీలో చనిపోయిన కప్ప అంటూ ఓ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Frog in Chicken Biryani in Hyderabad IIIT Mess
చికెన్​ బిర్యానీలో కప్ప (ETV Bharat)

చికెన్​ బిర్యానీలో కప్ప : హైదరాబాద్​లోని గచ్చిబౌలి ట్రిపుల్​ ఐటీ మెస్​లో ఈ తంతు వెలుగు చూసింది. ఈ నెల 16న విద్యార్థులకు మెస్​లో చికెన్​ బిర్యానీ వడ్డిస్తుండగా అందులో కప్ప ప్రత్యక్షమైంది. పైగా ఆ కప్ప బతికి లేదు. చనిపోయి ఉంది. ఆ ఫొటోను చూస్తే ఏకంగా బిర్యానీతో పాటు వండేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు కంగుతిన్నారు. ఆ షాక్​ నుంచి తేరుకొని మెస్​ ఇన్​ఛార్జికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోను ఎవరో విద్యార్థి సోషల్​ మీడియా వేదిక (ఎక్స్)గా షేర్​ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. సోషల్​ మీడియాలో షేర్​ చేయడంతో ప్రస్తుతం చికెన్​ బిర్యానీలో కప్ప అని వైరల్​ అవుతుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పాడైపోయిన మటన్‌తో బిర్యానీ - అల్ఫా హోటల్‌కు ఫైన్ - SECUNDERABAD ALPHA HOTEL FINED

రోగికి పెట్టిన ఆహారంలో బొద్దింక.. దిల్లీ ఎయిమ్స్​లో ఘటన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.