ETV Bharat / state

దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురికి విముక్తి - కోర్టు క్షమాభిక్షతో 18 ఏళ్ల అనంతరం ఇళ్లకు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 11:51 AM IST

Five NRIs Released From Dubai Jail Returned To India : దుబాయ్​లో ఓ హత్య కేసులో ఇరుక్కున్న ఐదుగురికి కోర్టు క్షమాభిక్ష పెట్టింది. దీంతో 18 ఏళ్ల తర్వాత వారు సొంత ఊరికి చేరుకున్నారు.

KTR Urges UAE To Approve Mercy Petition on 5 NRIs
Five NRIs Released From Dubai Jail Returned To India
దుబాయ్​లో 18ఏళ్ల జైలు శిక్ష మాజీ మంత్రి ప్రయత్నంతో క్షమాభిక్ష

Five NRIs Released From Dubai Jail Returned To India : ఉపాధి కోసం దుబాయ్​ వెళ్లి హత్య కేసులో ఇరుక్కుని 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఐదుగురు వ్యక్తులకు అక్కడి కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. ఎట్టకేలకు ఆ వలస కార్మికులు సొంత ఊరికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఐదుగురు కూలీ చేసుకోడానికి దుబాయ్​ వెళ్లారు. నేపాల్​కు చెందిన వాచ్​మెన్​ బహదూర్​ సింగ్​ హత్య కేసులో నేరస్థులుగా మారారు. ఈ కేసులో 10 మంది ఆరోపణలు ఎదుర్కోగా, తెలంగాణకు చెందిన ఈ ఐదుగురు అందులో ఉన్నారు. దీంతో తొలుత పదేళ్లు జైలు శిక్ష విధించిన దుబాయ్​ కోర్టు, నేరం నిరూపణ కావడంతో ఆ శిక్షను 25 ఏళ్లకు పెంచింది.

ఒక తండ్రి ఐడియా.. వలస పిల్లల జీవితాలనే మార్చేసిందిగా

ఈ విషయం ఈనాడు దినపత్రిక ద్వారా 2011లో కేటీఆర్​ దృష్టికి వెళ్లడంతో వారిని రప్పించేందుకు యత్నం చేశారు. స్వయంగా నేపాల్​కు వెళ్లి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇచ్చి క్షమాభిక్ష రాయించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం మారడంతో నిబంధనలు కఠినతరం కావడంతో జాప్యం జరిగింది. బాధితులకు అక్కడి భాష తెలియకపోవడం, ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులకు కేటీఆర్​ న్యాయ పోరాటం కోసం ఆర్థిక సహాయం అందించారు. మరోసారి బాధితుడి అనారోగ్య కారణాలను చూపుతూ మాజీ మంత్రి కేటీఆర్​ ప్రయత్నించారు. వారి దీనస్థితిని గమనించిన అప్పటి మంత్రి కేటీఆర్​ క్షమాభిక్ష కింద విడిపించేందుకు ప్రయత్నించారు.

KTR Urges UAE To Approve Mercy Petition on 5 NRIs : ఎన్నో ప్రయత్నాల అనంతరం కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడంతో వలస కార్మికులు స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా ఆరు నెలల క్రితం జగిత్యాల జిల్లా వాసి విడుదల కాగా, హన్మంతు ఇటీవల 17న ఇంటికి చేరుకున్నారు. 18 ఏళ్ల తర్వాత కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో సిరిసిల్ల, రుద్రంగి, కోనరావుపేట మండలాలకు చెందిన నలుగురు నేడు స్వదేశానికి చేరుకున్నారు.

చందుర్తి మండలానికి చెందిన నాంపల్లి వెంకటి కూడా త్వరలో రానున్నట్లు దుబాయ్​లో ఉన్న వారి స్నేహితులు తెలిపారు. బాధితుల తరఫున న్యాయవాది అనురాధ అహర్నిశలు కృషి చేయగా, కేటీఆర్​ ఆర్థిక సహాయంతో పాటు తన వంతు ప్రయత్నాలు చేశారు. కేటీఆర్ (KTR) విమాన ఖర్చులు భరించి, స్వదేశానికి రప్పించడంతో శంషాబాద్​ ఎయిర్​పోర్టులో భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. కేటీఆర్ ప్రయత్నం వల్లనే తాము స్వదేశానికి చేరుకున్నామని భావోద్వేగాల మధ్య స్పష్టం చేశారు.

వలస కూలీల అవస్థలు.. నేడు బిహార్‌కు మూడు రైళ్లు

దుబాయ్​లో 18ఏళ్ల జైలు శిక్ష మాజీ మంత్రి ప్రయత్నంతో క్షమాభిక్ష

Five NRIs Released From Dubai Jail Returned To India : ఉపాధి కోసం దుబాయ్​ వెళ్లి హత్య కేసులో ఇరుక్కుని 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఐదుగురు వ్యక్తులకు అక్కడి కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. ఎట్టకేలకు ఆ వలస కార్మికులు సొంత ఊరికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఐదుగురు కూలీ చేసుకోడానికి దుబాయ్​ వెళ్లారు. నేపాల్​కు చెందిన వాచ్​మెన్​ బహదూర్​ సింగ్​ హత్య కేసులో నేరస్థులుగా మారారు. ఈ కేసులో 10 మంది ఆరోపణలు ఎదుర్కోగా, తెలంగాణకు చెందిన ఈ ఐదుగురు అందులో ఉన్నారు. దీంతో తొలుత పదేళ్లు జైలు శిక్ష విధించిన దుబాయ్​ కోర్టు, నేరం నిరూపణ కావడంతో ఆ శిక్షను 25 ఏళ్లకు పెంచింది.

ఒక తండ్రి ఐడియా.. వలస పిల్లల జీవితాలనే మార్చేసిందిగా

ఈ విషయం ఈనాడు దినపత్రిక ద్వారా 2011లో కేటీఆర్​ దృష్టికి వెళ్లడంతో వారిని రప్పించేందుకు యత్నం చేశారు. స్వయంగా నేపాల్​కు వెళ్లి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇచ్చి క్షమాభిక్ష రాయించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం మారడంతో నిబంధనలు కఠినతరం కావడంతో జాప్యం జరిగింది. బాధితులకు అక్కడి భాష తెలియకపోవడం, ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులకు కేటీఆర్​ న్యాయ పోరాటం కోసం ఆర్థిక సహాయం అందించారు. మరోసారి బాధితుడి అనారోగ్య కారణాలను చూపుతూ మాజీ మంత్రి కేటీఆర్​ ప్రయత్నించారు. వారి దీనస్థితిని గమనించిన అప్పటి మంత్రి కేటీఆర్​ క్షమాభిక్ష కింద విడిపించేందుకు ప్రయత్నించారు.

KTR Urges UAE To Approve Mercy Petition on 5 NRIs : ఎన్నో ప్రయత్నాల అనంతరం కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడంతో వలస కార్మికులు స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా ఆరు నెలల క్రితం జగిత్యాల జిల్లా వాసి విడుదల కాగా, హన్మంతు ఇటీవల 17న ఇంటికి చేరుకున్నారు. 18 ఏళ్ల తర్వాత కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో సిరిసిల్ల, రుద్రంగి, కోనరావుపేట మండలాలకు చెందిన నలుగురు నేడు స్వదేశానికి చేరుకున్నారు.

చందుర్తి మండలానికి చెందిన నాంపల్లి వెంకటి కూడా త్వరలో రానున్నట్లు దుబాయ్​లో ఉన్న వారి స్నేహితులు తెలిపారు. బాధితుల తరఫున న్యాయవాది అనురాధ అహర్నిశలు కృషి చేయగా, కేటీఆర్​ ఆర్థిక సహాయంతో పాటు తన వంతు ప్రయత్నాలు చేశారు. కేటీఆర్ (KTR) విమాన ఖర్చులు భరించి, స్వదేశానికి రప్పించడంతో శంషాబాద్​ ఎయిర్​పోర్టులో భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. కేటీఆర్ ప్రయత్నం వల్లనే తాము స్వదేశానికి చేరుకున్నామని భావోద్వేగాల మధ్య స్పష్టం చేశారు.

వలస కూలీల అవస్థలు.. నేడు బిహార్‌కు మూడు రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.