ETV Bharat / state

తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపేందుకు కుట్రలు జరుగుతున్నాయి : మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి - Jagadish Reddy reacts Electricity

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 7:50 PM IST

Jagadish Reddy React on Electricity Commission : తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి ఆరోపించారు. విద్యుత్​కు సంబంధించిన అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని అన్నారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Jagadish Reddy React on Electricity Commission
Jagadish Reddy React on Electricity Commission (ETV Bharat)

Ex Minister Jagadish Reddy on Electricity Inquiry Commission : విద్యుత్​కు సంబంధించిన నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అర్థమైందని కేసీఆర్​ విషయంలో ఏమీ తేల్చలేమని చెప్పి ప్రభుత్వం దొంగల్లాగా లీకులు ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్​ ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా కమిషన్​ ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తే దురదృష్టవశాత్తు కమిషన్​ తన ఉద్దేశాన్ని ముందే బయటపెట్టారని మాజీమంత్రి జగదీశ్​ రెడ్డి ఆరోపించారు. సర్కార్​ లీకులను సమర్థించేలా నేడు కొందరితో మాట్లాడించారని ఆక్షేపించారు. ఛత్తీస్​గఢ్​ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరిగిందని అన్నారు. ఆ ఒప్పందం లేకపోయి ఉంటే విద్యుత్​ కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఉత్తర భారతం నుంచి కరెంటు తీసుకోకుండా కేసీఆర్​ ఫెయిల్​ అయితే మళ్లీ సమైక్య రాష్ట్రంలో కలపాలన్నది వారి కుట్ర అని ఆరోపించారు.

అవినీతి జరిగి ఉంటే అప్పటి సీఎం రమణ్​ సింగ్​, కాంగ్రెస్​ సీఎంలు డబ్బులు ఇచ్చారా అని ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో విద్యుత్​ కేంద్రం ఎందుకు పెట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామని ఘాటుగా వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా తెలంగాణలో లేదానని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా దద్దమ్మ నేతలు నాటి లాగే ఇప్పుడు కూడా నోరెత్తకుండా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గతంలో యాదాద్రి విద్యుత్​ కేంద్రం బంద్​ చేయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోషం ఉంటే ప్రారంభోత్సవానికి పోకూడదని సవాల్​ విసిరారు.

కేసీఆర్​ను అరెస్ట్​ చేయాలనేదే బీజేపీ తొందర : ఆచార్య కోదండరాం దొంగలతో చేతులు కలిపి ఉన్న ఈర్ష్యను చాటుకుంటున్నారని మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి బండి సంజయ్​ తెలివితక్కువ తనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్​ను అరెస్ట్​ చేయాలని బీజేపీకి తొందర ఉన్నట్లుందన్నారు. కాంగ్రెస్​, బీజేపీ వేరు కాదని రేవంత్​ రెడ్డి, బండి సంజయ్​ కలిసి పని చేస్తున్నారని ఇదే ఐదేళ్లుగా చెబుతున్నామని జగదీశ్​ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

"ఐదేళ్ల నుంచి మేము చెబుతూనే ఉన్నాము బండి సంజయ్​, రేవంత్​ రెడ్డి వేర్వేరు కాదు. కాంగ్రెస్​, బీజేపీ ఒక్కటే ఈ రాష్ట్రంలో వారిరువురు కలిసే కేసీఆర్​పై కుట్రలు చేస్తున్నారు. జడ్జిని మార్చమనే హక్కు నిందితుడికి ఉంటుంది. ఆ విషయం బండి సంజయ్​ ఎలా మర్చిపోయారు. విచారించే కమిషన్​ అధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదు. ఆ విషయాన్ని కమిషన్​ ముందే బయటపెట్టింది." - జగదీశ్​ రెడ్డి, మాజీ మంత్రి

తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపేందుకు కుట్రలు జరుగుతున్నాయి : జగదీశ్​ రెడ్డి (ETV Bharat)

బీఆర్ఎస్​పై కక్షసాధింపు కోసమే విద్యుత్ కొనుగోళ్లపై విచారణ - రేవంత్​ అట్టర్​ ఫ్లాప్​ సీఎం : బాల్క సుమన్ - BRS Leader Balka Suman Comments

ఛత్తీ‌స్​గఢ్ విద్యుత్​ కొనుగోలు ఒప్పందంపై విచారణ - మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు

Ex Minister Jagadish Reddy on Electricity Inquiry Commission : విద్యుత్​కు సంబంధించిన నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అర్థమైందని కేసీఆర్​ విషయంలో ఏమీ తేల్చలేమని చెప్పి ప్రభుత్వం దొంగల్లాగా లీకులు ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్​ ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా కమిషన్​ ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తే దురదృష్టవశాత్తు కమిషన్​ తన ఉద్దేశాన్ని ముందే బయటపెట్టారని మాజీమంత్రి జగదీశ్​ రెడ్డి ఆరోపించారు. సర్కార్​ లీకులను సమర్థించేలా నేడు కొందరితో మాట్లాడించారని ఆక్షేపించారు. ఛత్తీస్​గఢ్​ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరిగిందని అన్నారు. ఆ ఒప్పందం లేకపోయి ఉంటే విద్యుత్​ కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఉత్తర భారతం నుంచి కరెంటు తీసుకోకుండా కేసీఆర్​ ఫెయిల్​ అయితే మళ్లీ సమైక్య రాష్ట్రంలో కలపాలన్నది వారి కుట్ర అని ఆరోపించారు.

అవినీతి జరిగి ఉంటే అప్పటి సీఎం రమణ్​ సింగ్​, కాంగ్రెస్​ సీఎంలు డబ్బులు ఇచ్చారా అని ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో విద్యుత్​ కేంద్రం ఎందుకు పెట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామని ఘాటుగా వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా తెలంగాణలో లేదానని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా దద్దమ్మ నేతలు నాటి లాగే ఇప్పుడు కూడా నోరెత్తకుండా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గతంలో యాదాద్రి విద్యుత్​ కేంద్రం బంద్​ చేయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోషం ఉంటే ప్రారంభోత్సవానికి పోకూడదని సవాల్​ విసిరారు.

కేసీఆర్​ను అరెస్ట్​ చేయాలనేదే బీజేపీ తొందర : ఆచార్య కోదండరాం దొంగలతో చేతులు కలిపి ఉన్న ఈర్ష్యను చాటుకుంటున్నారని మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి బండి సంజయ్​ తెలివితక్కువ తనం, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్​ను అరెస్ట్​ చేయాలని బీజేపీకి తొందర ఉన్నట్లుందన్నారు. కాంగ్రెస్​, బీజేపీ వేరు కాదని రేవంత్​ రెడ్డి, బండి సంజయ్​ కలిసి పని చేస్తున్నారని ఇదే ఐదేళ్లుగా చెబుతున్నామని జగదీశ్​ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

"ఐదేళ్ల నుంచి మేము చెబుతూనే ఉన్నాము బండి సంజయ్​, రేవంత్​ రెడ్డి వేర్వేరు కాదు. కాంగ్రెస్​, బీజేపీ ఒక్కటే ఈ రాష్ట్రంలో వారిరువురు కలిసే కేసీఆర్​పై కుట్రలు చేస్తున్నారు. జడ్జిని మార్చమనే హక్కు నిందితుడికి ఉంటుంది. ఆ విషయం బండి సంజయ్​ ఎలా మర్చిపోయారు. విచారించే కమిషన్​ అధికారికి ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదు. ఆ విషయాన్ని కమిషన్​ ముందే బయటపెట్టింది." - జగదీశ్​ రెడ్డి, మాజీ మంత్రి

తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపేందుకు కుట్రలు జరుగుతున్నాయి : జగదీశ్​ రెడ్డి (ETV Bharat)

బీఆర్ఎస్​పై కక్షసాధింపు కోసమే విద్యుత్ కొనుగోళ్లపై విచారణ - రేవంత్​ అట్టర్​ ఫ్లాప్​ సీఎం : బాల్క సుమన్ - BRS Leader Balka Suman Comments

ఛత్తీ‌స్​గఢ్ విద్యుత్​ కొనుగోలు ఒప్పందంపై విచారణ - మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.