ETV Bharat / state

గిరిజనుల కోసం విద్యుత్ సిబ్బంది సర్కస్ ఫీట్లు - ప్రాణాలకు తెగించి సాహసం - ap electrical Staff Adventure - AP ELECTRICAL STAFF ADVENTURE

AP Electrical Staff Adventure : ఆంధ్రప్రదేశ్​లోని అంధకారంలో ఉన్న గిరిజన గ్రామాలకు వెలుగులు తీసుకురావడానికి విద్యుత్​ సిబ్బంది సాహసం చేస్తున్నారు. వాగు మీదుగా తాడుపై ప్రమాదకరంగా నడుచుకుంటూ వెళ్లి తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

AP Electrical Staff Adventure
AP Electrical Staff Adventure (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 11:27 AM IST

Updated : Jul 27, 2024, 2:36 PM IST

Electrical Staff Adventure Walking on Wires at Alluri in AP : వాగులు, గెడ్డలు ఉప్పొంగితే రాకపోకలు బంద్‌ అయిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో గిరిజనుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిత్యావసరాలు దొరక్క అల్లాడిపోతూ ఉంటారు. ఇక విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందంటే పరిస్థితి మరింత దయనీయమని చెప్పాలి. అందుకేనేమో ఏపీ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో విద్యుత్ పునరుద్ధరణకు ఏపీఈపీడీసీఎల్​ (EPDCL) సిబ్బంది పెద్ద సాహసమే చేశారు.

సాహస ప్రయాణం : వరదల సమయంలో అత్యవసర సేవలందించే ప్రభుత్వ సిబ్బంది సాహస ప్రయాణమే చేశారు. ఎలాంటి అడ్డంకులు ఉన్నా వెరవకుండా ప్రజలకు సేవలందించి విధి నిర్వహణ పట్ల ఉన్న నిబద్ధతను విద్యుత్​ సిబ్బంది చాటుకుంటున్నారు. ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవిలో ఇటీవల వర్షాల కారణంగా సున్నంపాడు గ్రామానికి వెళ్లే విద్యుత్ లైన్‌పై చెట్లు పడిపోయాయి. దీంతో సున్నంపాడు, దేవరపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ మూర్తి ఆదేశాలతో మారేడుమిల్లి ఏఈ శ్రీనివాస్ పర్యవేక్షణలో లైన్‌మెన్ సిబ్బంది సాహసోపేతంగా పనిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేశారు.

రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు - వరదనీటిలో మునిగిన పంటలు - Rains Effects In Telangana

విద్యుత్‌ సిబ్బంది నిబద్ధత : ఈ మార్గంలో పెద్ద కొండవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనిపై వంతెన లేకపోవడంతో వాగు దాటడం ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ లైన్‌మన్లు రామయ్య, నీలన్నదొర విధి నిర్వహణే ధ్యేయంగా వాగుపై అటూ ఇటు ఉన్న చెట్లకు తాళ్లు కట్టించారు. ప్రమాదకర పరిస్థితుల్లో తాడుపై నడుస్తూ వాగు దాటారు. విద్యుత్ లైన్‌కు మరమ్మతు చేసి సరఫరా పునరుద్ధరించారు. సాహసం చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన లైన్‌మెన్ సిబ్బందిని రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ మూర్తి అభినందించారు.

ఏపీలో దంచికొడుతున్న వానలు - ఉప్పొంగుతున్న వాగులు, వంకలు - Heavy Rains in AP

డేంజర్ అలర్ట్ - ప్రమాదకరంగా వాగు దాటుతున్న వీరిని చూశారా? - Tribals Crossing canal Dangerously

Electrical Staff Adventure Walking on Wires at Alluri in AP : వాగులు, గెడ్డలు ఉప్పొంగితే రాకపోకలు బంద్‌ అయిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో గిరిజనుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిత్యావసరాలు దొరక్క అల్లాడిపోతూ ఉంటారు. ఇక విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందంటే పరిస్థితి మరింత దయనీయమని చెప్పాలి. అందుకేనేమో ఏపీ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో విద్యుత్ పునరుద్ధరణకు ఏపీఈపీడీసీఎల్​ (EPDCL) సిబ్బంది పెద్ద సాహసమే చేశారు.

సాహస ప్రయాణం : వరదల సమయంలో అత్యవసర సేవలందించే ప్రభుత్వ సిబ్బంది సాహస ప్రయాణమే చేశారు. ఎలాంటి అడ్డంకులు ఉన్నా వెరవకుండా ప్రజలకు సేవలందించి విధి నిర్వహణ పట్ల ఉన్న నిబద్ధతను విద్యుత్​ సిబ్బంది చాటుకుంటున్నారు. ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవిలో ఇటీవల వర్షాల కారణంగా సున్నంపాడు గ్రామానికి వెళ్లే విద్యుత్ లైన్‌పై చెట్లు పడిపోయాయి. దీంతో సున్నంపాడు, దేవరపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ మూర్తి ఆదేశాలతో మారేడుమిల్లి ఏఈ శ్రీనివాస్ పర్యవేక్షణలో లైన్‌మెన్ సిబ్బంది సాహసోపేతంగా పనిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేశారు.

రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు - వరదనీటిలో మునిగిన పంటలు - Rains Effects In Telangana

విద్యుత్‌ సిబ్బంది నిబద్ధత : ఈ మార్గంలో పెద్ద కొండవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనిపై వంతెన లేకపోవడంతో వాగు దాటడం ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ లైన్‌మన్లు రామయ్య, నీలన్నదొర విధి నిర్వహణే ధ్యేయంగా వాగుపై అటూ ఇటు ఉన్న చెట్లకు తాళ్లు కట్టించారు. ప్రమాదకర పరిస్థితుల్లో తాడుపై నడుస్తూ వాగు దాటారు. విద్యుత్ లైన్‌కు మరమ్మతు చేసి సరఫరా పునరుద్ధరించారు. సాహసం చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన లైన్‌మెన్ సిబ్బందిని రాజమండ్రి సర్కిల్ ఎస్ఈ మూర్తి అభినందించారు.

ఏపీలో దంచికొడుతున్న వానలు - ఉప్పొంగుతున్న వాగులు, వంకలు - Heavy Rains in AP

డేంజర్ అలర్ట్ - ప్రమాదకరంగా వాగు దాటుతున్న వీరిని చూశారా? - Tribals Crossing canal Dangerously

Last Updated : Jul 27, 2024, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.