ETV Bharat / state

సైబర్ నేరగాళ్ల​ ఉచ్చులో వైద్యుడు - స్టాక్​ మార్కెట్లో ఇన్వెస్ట్​ పేరిట రూ.74 లక్షలు మాయం - Doctor in Trap Of Cyber Criminals

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 10:44 PM IST

Cyber Crime In Jagtial : సైబర్ కేటుగాళ్లు ఎప్పుడు, ఎలా ఎటాక్ చేస్తారో అర్థం కాదు. అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్స్​, ఈ-మెయిల్స్‌లో వచ్చే ఫిషింగ్ లింక్స్‌ను క్లిక్ చేయవద్దని, స్పామ్​ కాల్స్​ వస్తే ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సైబర్​ నేరగాళ్ల ఎత్తుగడలకు చదువుకున్నవాళ్లే ముఖ్యంగా చిత్తవుతున్నారు. అటువంటి ఘటనే తాజాగా జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆశతో ఓ వైద్యుడు భారీ మొత్తంలో పోగొట్టుకున్న ఉదాంతం ఆలస్యంగా వెలుగుచూసింది.

Cyber Criminals Trap Doctor
A Doctor in Trap Of Cyber Criminals (ETV Bharat)

A Doctor in Trap Of Cyber Criminals : జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఓ పిల్లల వైద్యుడు సైబర్ నేరగాళ్ల వలలో పడి నిలువు దోపిడికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆశతో ఏకంగా రూ.74 లక్షలకు పైగా పోగొట్టుకొని తలపట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, సోషల్​ మీడియా యాప్​లో అనాధికార ఓ సైట్ లింకును డాక్టర్​ ఓపెన్ చేశాడు.

ఇంతలో అవతలి వైపు నుంచి స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏసీ మాక్స్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యాక్సిల్ స్టూడెంట్ సీ 95 గ్రూపులో చేరండంటూ ఒక లింకు వాట్సాప్​కు వచ్చింది. ఆ లింకును ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. విడతల వారీగా మొత్తం రూ.22 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత ఐపీఓ సబ్​స్క్రైబ్ చేసుకోవాలని వాట్సప్ కాల్ రావడంతో తన దగ్గర డబ్బులు లేవని బదులిచ్చాడు.

అప్పు చేసి రూ.50 లక్షలు చెల్లించి : జమ చేసిన డబ్బులు సరిపోతాయని నమ్మించడంతో సదురు వైద్యుడు ఐపీఓ సబ్​స్క్రైబ్ చేశాడు. ఆ వెంటనే రూ.50 లక్షలు కట్టాలని లేదంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందని, లైఫ్ రిస్క్​లో పడుతుందని కాలర్ చెప్పడంతో తన వద్దనున్న డబ్బులతో పాటు అప్పు చేసి రూ.50 లక్షలు చెల్లించాడు. జూన్ 26న ఐపీఓలో పెట్టిన పెట్టుబడి లాభం రూ. కోటి 27 లక్షలకు పెరిగిందని మళ్లీ ఇంకో ఐపీఓ సబ్​స్క్రైబ్ చేసుకోవాలని వాట్సప్ కాల్ వచ్చింది.

తన వద్ద డబ్బు లేదని తన డబ్బులు విత్ డ్రా చేసుకుంటానని చెప్పాడు. అలాగైతే 20% సర్వీస్ టాక్స్ చెల్లించాలని విత్ డ్రా చేసుకునే మొత్తం రూ.కోటి 27 లక్షలలో 30% డిపాజిట్ చేయాలనడంతో వైద్యుడు కంగుతిన్నాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన వైద్యుడు గత నెల నాలుగున క్రైమ్ విభాగానికి, 13న స్థానిక మెట్​పల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మెట్​పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు.

"ఒక డాక్టర్​ అయి, ఉన్నత చదువులు చదివి ఇటువంటి సైబర్​ క్రైమ్​లో ఇరుకుంటున్నారు. ఈ సైబర్​ క్రైం చేసేవాళ్లు జార్ఖండ్​, గుజరాత్ సహా​ ఇతర రాష్ట్రాల నుంచి పదో తరగతి కూడా పూర్తి చేయని కొందరు కేటుగాళ్లు ల్యాప్​టప్​లతో ఈ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్​ మీడియాలో ఈ లింక్​లు పంపి, అకౌంట్​లో ఉన్న సొమ్మునంతా స్వాహా చేస్తుంటారు. ఇందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్లే వారి ఉచ్చులో పడి, చాలా వరకు మోసపోతున్నారు."- ఉమామహేశ్వరరావు, మెట్​పల్లి డీఎస్పీ

రూ.10వేలకు 20 వేలు వస్తాయన్నారు - చివరకు రూ.10కోట్లు కొట్టేశారు - Investment Fraud in Karimnagar

సోషల్​ మీడియాలో స్టాక్​​ మార్కెట్​ లింక్​​ ఓపెన్ చేశారు - రూ.3.81 కోట్లు పోగొట్టుకున్నారు - Cyber Crime In Patancheru

A Doctor in Trap Of Cyber Criminals : జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఓ పిల్లల వైద్యుడు సైబర్ నేరగాళ్ల వలలో పడి నిలువు దోపిడికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆశతో ఏకంగా రూ.74 లక్షలకు పైగా పోగొట్టుకొని తలపట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, సోషల్​ మీడియా యాప్​లో అనాధికార ఓ సైట్ లింకును డాక్టర్​ ఓపెన్ చేశాడు.

ఇంతలో అవతలి వైపు నుంచి స్టాక్​ మార్కెట్​లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏసీ మాక్స్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యాక్సిల్ స్టూడెంట్ సీ 95 గ్రూపులో చేరండంటూ ఒక లింకు వాట్సాప్​కు వచ్చింది. ఆ లింకును ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. విడతల వారీగా మొత్తం రూ.22 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత ఐపీఓ సబ్​స్క్రైబ్ చేసుకోవాలని వాట్సప్ కాల్ రావడంతో తన దగ్గర డబ్బులు లేవని బదులిచ్చాడు.

అప్పు చేసి రూ.50 లక్షలు చెల్లించి : జమ చేసిన డబ్బులు సరిపోతాయని నమ్మించడంతో సదురు వైద్యుడు ఐపీఓ సబ్​స్క్రైబ్ చేశాడు. ఆ వెంటనే రూ.50 లక్షలు కట్టాలని లేదంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందని, లైఫ్ రిస్క్​లో పడుతుందని కాలర్ చెప్పడంతో తన వద్దనున్న డబ్బులతో పాటు అప్పు చేసి రూ.50 లక్షలు చెల్లించాడు. జూన్ 26న ఐపీఓలో పెట్టిన పెట్టుబడి లాభం రూ. కోటి 27 లక్షలకు పెరిగిందని మళ్లీ ఇంకో ఐపీఓ సబ్​స్క్రైబ్ చేసుకోవాలని వాట్సప్ కాల్ వచ్చింది.

తన వద్ద డబ్బు లేదని తన డబ్బులు విత్ డ్రా చేసుకుంటానని చెప్పాడు. అలాగైతే 20% సర్వీస్ టాక్స్ చెల్లించాలని విత్ డ్రా చేసుకునే మొత్తం రూ.కోటి 27 లక్షలలో 30% డిపాజిట్ చేయాలనడంతో వైద్యుడు కంగుతిన్నాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన వైద్యుడు గత నెల నాలుగున క్రైమ్ విభాగానికి, 13న స్థానిక మెట్​పల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మెట్​పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు.

"ఒక డాక్టర్​ అయి, ఉన్నత చదువులు చదివి ఇటువంటి సైబర్​ క్రైమ్​లో ఇరుకుంటున్నారు. ఈ సైబర్​ క్రైం చేసేవాళ్లు జార్ఖండ్​, గుజరాత్ సహా​ ఇతర రాష్ట్రాల నుంచి పదో తరగతి కూడా పూర్తి చేయని కొందరు కేటుగాళ్లు ల్యాప్​టప్​లతో ఈ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్​ మీడియాలో ఈ లింక్​లు పంపి, అకౌంట్​లో ఉన్న సొమ్మునంతా స్వాహా చేస్తుంటారు. ఇందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్లే వారి ఉచ్చులో పడి, చాలా వరకు మోసపోతున్నారు."- ఉమామహేశ్వరరావు, మెట్​పల్లి డీఎస్పీ

రూ.10వేలకు 20 వేలు వస్తాయన్నారు - చివరకు రూ.10కోట్లు కొట్టేశారు - Investment Fraud in Karimnagar

సోషల్​ మీడియాలో స్టాక్​​ మార్కెట్​ లింక్​​ ఓపెన్ చేశారు - రూ.3.81 కోట్లు పోగొట్టుకున్నారు - Cyber Crime In Patancheru

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.