ETV Bharat / state

కిషన్​రెడ్డి నువ్వే మూసీ నదిలో పడిపోతావు జాగ్రత్త : బీవీ రాఘవులు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 1:53 PM IST

CPM Politburo Member BV Raghavulu Criticizes BJP : పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీను ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం పొలిట్​ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్లేనన్న కిషన్​రెడ్డి వాఖ్యలను తప్పుపట్టారు. నువ్వే మూసీ నదిలో పడితావు జాగ్రత్త అంటూ కిషన్ రెడ్డికి వార్నింగ్​ ఇచ్చారు. హైదరాబాద్​లో ప్రారంభమైన సీపీఎం రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొన్న బీవీ రాఘవులు, బీజేపీపై విమర్శలు చేశారు.

CPM Politburo Member BV Raghavulu
CPM Politburo Member BV Raghavulu Criticizes BJP

CPM Politburo Member BV Raghavulu Criticizes BJP : వైరుధ్యాలను పక్కనపెట్టి బీజేపీను ఓడించాలని ఇండియా కూటమి నిర్ణయించిందని సీపీఎం(CPM) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. ఇండియా కూటమి నిర్ణయంతో బీజేపీకి భయం పట్టుకుందని చెప్పారు. కూటమిలోని నితీశ్​ను ఎర వేసి లాక్కున్నారని మండిపడ్డారు. హైదరాబాద్​లో ప్రారంభమైన సీపీఎం రాష్ట్రస్థాయి సమావేశం(CPm Meetings)లో పాల్గొన్న బీవీ రాఘవులు, బీజేపీపై విమర్శలు చేశారు. అలాగే తాజా రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు ఎన్నికలపై నేతలు చర్చించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్​ ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లలేదని బీవీ రాఘవులు(BV Raghavulu) పేర్కొన్నారు. ఆ తప్పిదాల వల్ల రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో కాంగ్రెస్​ అధికారం కోల్పోయిందని వివరించారు. గత తప్పిదాలను సరి చేసుకొని కాంగ్రెస్​ ముందుకు వెళుతోందని అన్నారు. బీఆర్​ఎస్​ను బీజేపీ తనవైపు తిప్పుకుంటోందని సీపీఎం సీనియర్​ నేత బీవీ రాఘవులు తెలిపారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుస్తుందని కిషన్​ రెడ్డి చెబుతున్నారని అన్నారు.

'ఆ 14 స్థానాల్లో మేమే'- గట్టి షాకిచ్చిన కేజ్రీవాల్- ఇండియా కూటమి కుదేల్​!

CPM State Level Meetings in Hyderabad : కాంగ్రెస్​, బీఆర్​ఎస్​కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నువ్వే మూసిలో పడిపోతావు జాగ్రత్త అంటూ కిషన్​ రెడ్డిని ఆయన హెచ్చరించారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని డబ్బులు లేకుండా చేశాయని ఆవేదన చెందారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం(White Paper) విడుదల చేయాలని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్​ చేశారు. లిక్కర్​ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమాన్లు వచ్చాయని, అవి సమన్లా లేక గాలమా అనేది కొద్ది రోజుల్లోనే స్పష్టమవుతుందని తెలిపారు.

అధ్యక్ష తరహా పాలన తెచ్చేందుకు బీజేపీ కుట్ర : దేశంలో అధ్యక్ష తరహా పాలన తెచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీ కుట్రలను అడ్డుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఓట్లు అమ్మకం, కొనుగోలు ద్వారా బీజేపీ స్వేచ్ఛను హరిస్తోందని మండిపడ్డారు. బీజేపీకి రూ.6000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో అందరికీ తెలుసునని విమర్శలు చేశారు.

కాంగ్రెస్​ పట్ల బీఆర్​ఎస్​ శత్రుపూరిత వైఖరి సరికాదు : కాంగ్రెస్​ పట్ల బీఆర్​ఎస్​ శత్రుపూరిత వైఖరి సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అవినీతి సొమ్మును కక్కించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న పన్నులు మొత్తం కేంద్రం ఖజానాకే : బీవీ రాఘవులు

CPM Leaders Comments: 'రాందేవ్​ బాబాకు సమానత్వం గురించి మాట్లాడే హక్కే లేదు..'

CPM Politburo Member BV Raghavulu Criticizes BJP : వైరుధ్యాలను పక్కనపెట్టి బీజేపీను ఓడించాలని ఇండియా కూటమి నిర్ణయించిందని సీపీఎం(CPM) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. ఇండియా కూటమి నిర్ణయంతో బీజేపీకి భయం పట్టుకుందని చెప్పారు. కూటమిలోని నితీశ్​ను ఎర వేసి లాక్కున్నారని మండిపడ్డారు. హైదరాబాద్​లో ప్రారంభమైన సీపీఎం రాష్ట్రస్థాయి సమావేశం(CPm Meetings)లో పాల్గొన్న బీవీ రాఘవులు, బీజేపీపై విమర్శలు చేశారు. అలాగే తాజా రాజకీయ పరిస్థితులు, పార్లమెంటు ఎన్నికలపై నేతలు చర్చించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్​ ఇతర పార్టీలను కలుపుకుని వెళ్లలేదని బీవీ రాఘవులు(BV Raghavulu) పేర్కొన్నారు. ఆ తప్పిదాల వల్ల రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో కాంగ్రెస్​ అధికారం కోల్పోయిందని వివరించారు. గత తప్పిదాలను సరి చేసుకొని కాంగ్రెస్​ ముందుకు వెళుతోందని అన్నారు. బీఆర్​ఎస్​ను బీజేపీ తనవైపు తిప్పుకుంటోందని సీపీఎం సీనియర్​ నేత బీవీ రాఘవులు తెలిపారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుస్తుందని కిషన్​ రెడ్డి చెబుతున్నారని అన్నారు.

'ఆ 14 స్థానాల్లో మేమే'- గట్టి షాకిచ్చిన కేజ్రీవాల్- ఇండియా కూటమి కుదేల్​!

CPM State Level Meetings in Hyderabad : కాంగ్రెస్​, బీఆర్​ఎస్​కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నువ్వే మూసిలో పడిపోతావు జాగ్రత్త అంటూ కిషన్​ రెడ్డిని ఆయన హెచ్చరించారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని డబ్బులు లేకుండా చేశాయని ఆవేదన చెందారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం(White Paper) విడుదల చేయాలని సీపీఎం పొలిట్​బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్​ చేశారు. లిక్కర్​ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమాన్లు వచ్చాయని, అవి సమన్లా లేక గాలమా అనేది కొద్ది రోజుల్లోనే స్పష్టమవుతుందని తెలిపారు.

అధ్యక్ష తరహా పాలన తెచ్చేందుకు బీజేపీ కుట్ర : దేశంలో అధ్యక్ష తరహా పాలన తెచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీజేపీ కుట్రలను అడ్డుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఓట్లు అమ్మకం, కొనుగోలు ద్వారా బీజేపీ స్వేచ్ఛను హరిస్తోందని మండిపడ్డారు. బీజేపీకి రూ.6000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో అందరికీ తెలుసునని విమర్శలు చేశారు.

కాంగ్రెస్​ పట్ల బీఆర్​ఎస్​ శత్రుపూరిత వైఖరి సరికాదు : కాంగ్రెస్​ పట్ల బీఆర్​ఎస్​ శత్రుపూరిత వైఖరి సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అవినీతి సొమ్మును కక్కించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న పన్నులు మొత్తం కేంద్రం ఖజానాకే : బీవీ రాఘవులు

CPM Leaders Comments: 'రాందేవ్​ బాబాకు సమానత్వం గురించి మాట్లాడే హక్కే లేదు..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.