ETV Bharat / state

ఫైనాన్స్​ కంపెనీ వేధింపులు - తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య - షాక్​తో కుమారుడికి పక్షవాతం - Loan Harassment Couple Suicide

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Couple Suicide Due to Finance Company Harassment : నిన్నటి వరకూ వాళ్లకు అమ్మా, నాన్నా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్లు అనాథలయ్యారు. తల్లిదండ్రుల మరణ వార్త విన్న కుమారుడి గుండె విలవిల్లాడింది. మాట పడిపోయింది, పక్షవాతం వచ్చి ఆస్పత్రి పాలయ్యాడు. ఇక కుమార్తె ఒంటరి అయ్యింది. తమ్ముడి ఆలనాపాలనా చూడాలి. అమ్మానాన్నా లేరన్న బాధను దిగమింగి ముందుకు సాగాలి. ఇంతకీ వాళ్ల తల్లిదండ్రులు ఎలా చనిపోయారు అంటే?

Couple Suicide Due to Finance Company Harassment
Couple Suicide Due to Finance Company Harassment (ETV Bharat)

Couple Suicide Finance Company Harassment in Guntur District : అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో కొందరి కలలు చిధ్రమవుతుంటాయి. అనారోగ్యంతో మరికొందరు ఈ లోకాన్ని వీడాల్సి వస్తుంది. కానీ అన్నీ సరిగ్గా ఉండి, చిన్న చిన్న సమస్యలకే జడిసి జీవితాల్ని చీకటి చేసుకునే వారు అనేకం. ఈ తరహాలోనే ఆర్ధిక సమస్యలు బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి.

బాపట్ల జిల్లాలోని చదలవాడకు చెందిన పోలిశెట్టి శ్రీనివాసరావు ఓ రైతు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు. కుమార్తె బీటెక్​ పూర్తి చేయగా, కుమారుడు ఇంటర్​ చదువుతున్నాడు. ఇంటి అవసరాల రీత్యా ఓ ప్రైవేటు కంపెనీలో రూ.15 లక్షలు రుణం తీసుకున్నారు. నెలనెలా కిస్తీలు కడుతున్నాడు. కానీ సాగులో నష్టం రావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండు నెలల నుంచి వాయిదాలు చెల్లించడం లేదు.

ఇంటికి నోటీసులు : దీంతో ఫైనాన్స్​ కంపెనీ అప్పు చెల్లించాలని ఒత్తిడి చేసింది. సంస్థ ప్రతినిధులు ఇంటికి వచ్చి డబ్బు చెల్లించాలని వేధించారు. అంతటితో ఆగకుండా ఇంటికి నోటీసులు అంటించారు. దీన్ని శ్రీనివాసరావు అవమానంగా భావించాడు. అంతే ఇలాంటి పరిస్థితిలో దిక్కుతోచక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. భార్య పుష్పలతతో కలిసి గుంటూరు జిల్లా నారాకోడూరు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనివాసరావు కొన ఊపిరితో ఆసుపత్రిలో చేరారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందారు. తల్లిదండ్రుల మరణవార్త విని ఇంటర్​ చదువుతున్న కుమారుడు షాక్​కు గురై పక్షవాతం బారినపడ్డాడు. ప్రస్తుతం తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తెకు విషయం తెలిసి దిక్కుతోచని స్థితిలో పడింది.

"వ్యవసాయం చేస్తూ అమ్మ, నాన్న మమ్మల్ని చదివిస్తున్నారు. మూడేళ్ల కిందట ఓ ప్రైవేట్ సంస్థలో రూ. 15 లక్షలు రుణం తీసుకున్నారు. సాగులో నష్టాలు వచ్చి రెండు నెలలుగా వాయిదాలు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఇంటికి నోటీసులు అంటించారు. అవమానకరంగా మాట్లాడారు. దీంతో మనస్తాపానికి గురైన మా అమ్మానాన్న ఆత్మహత్య చేసుకున్నారు." -భార్గవి, కుమార్తె

తమ్ముడు అనారోగ్యం మరితం కుంగదీస్తుంది : అప్పు ఇచ్చిన సంస్థ ఇంటికి నోటీసులు అంటించి, డబ్బులు కట్టాల్సిందేనని ఒత్తిడి చేయడంతోనే పురుగులు మందు తాగి చనిపోయారని కుమార్తె కన్నీటి పర్యంతమయ్యారు. అసలే అమ్మా నాన్న చనిపోయి దిక్కుతోచని స్థితిలో తమను వదిలి వెళ్లిన బాధలో ఉన్న భార్గవిని తమ్ముడి అనారోగ్యం మరింత కుంగదీస్తుందని బంధువులు ఆందోళన చెందుతున్నారు.

రుణం మొత్తం చెల్లించినా - ఆగని లోన్​యాప్​ వేధింపులు - మరో ప్రాణం బలి - Man Suicide by Loan App Harassment

లోన్​యాప్​ వేధింపులకు మరో ప్రాణం బలి - చెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్య

Couple Suicide Finance Company Harassment in Guntur District : అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో కొందరి కలలు చిధ్రమవుతుంటాయి. అనారోగ్యంతో మరికొందరు ఈ లోకాన్ని వీడాల్సి వస్తుంది. కానీ అన్నీ సరిగ్గా ఉండి, చిన్న చిన్న సమస్యలకే జడిసి జీవితాల్ని చీకటి చేసుకునే వారు అనేకం. ఈ తరహాలోనే ఆర్ధిక సమస్యలు బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి.

బాపట్ల జిల్లాలోని చదలవాడకు చెందిన పోలిశెట్టి శ్రీనివాసరావు ఓ రైతు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు. కుమార్తె బీటెక్​ పూర్తి చేయగా, కుమారుడు ఇంటర్​ చదువుతున్నాడు. ఇంటి అవసరాల రీత్యా ఓ ప్రైవేటు కంపెనీలో రూ.15 లక్షలు రుణం తీసుకున్నారు. నెలనెలా కిస్తీలు కడుతున్నాడు. కానీ సాగులో నష్టం రావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెండు నెలల నుంచి వాయిదాలు చెల్లించడం లేదు.

ఇంటికి నోటీసులు : దీంతో ఫైనాన్స్​ కంపెనీ అప్పు చెల్లించాలని ఒత్తిడి చేసింది. సంస్థ ప్రతినిధులు ఇంటికి వచ్చి డబ్బు చెల్లించాలని వేధించారు. అంతటితో ఆగకుండా ఇంటికి నోటీసులు అంటించారు. దీన్ని శ్రీనివాసరావు అవమానంగా భావించాడు. అంతే ఇలాంటి పరిస్థితిలో దిక్కుతోచక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. భార్య పుష్పలతతో కలిసి గుంటూరు జిల్లా నారాకోడూరు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనివాసరావు కొన ఊపిరితో ఆసుపత్రిలో చేరారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందారు. తల్లిదండ్రుల మరణవార్త విని ఇంటర్​ చదువుతున్న కుమారుడు షాక్​కు గురై పక్షవాతం బారినపడ్డాడు. ప్రస్తుతం తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమార్తెకు విషయం తెలిసి దిక్కుతోచని స్థితిలో పడింది.

"వ్యవసాయం చేస్తూ అమ్మ, నాన్న మమ్మల్ని చదివిస్తున్నారు. మూడేళ్ల కిందట ఓ ప్రైవేట్ సంస్థలో రూ. 15 లక్షలు రుణం తీసుకున్నారు. సాగులో నష్టాలు వచ్చి రెండు నెలలుగా వాయిదాలు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఇంటికి నోటీసులు అంటించారు. అవమానకరంగా మాట్లాడారు. దీంతో మనస్తాపానికి గురైన మా అమ్మానాన్న ఆత్మహత్య చేసుకున్నారు." -భార్గవి, కుమార్తె

తమ్ముడు అనారోగ్యం మరితం కుంగదీస్తుంది : అప్పు ఇచ్చిన సంస్థ ఇంటికి నోటీసులు అంటించి, డబ్బులు కట్టాల్సిందేనని ఒత్తిడి చేయడంతోనే పురుగులు మందు తాగి చనిపోయారని కుమార్తె కన్నీటి పర్యంతమయ్యారు. అసలే అమ్మా నాన్న చనిపోయి దిక్కుతోచని స్థితిలో తమను వదిలి వెళ్లిన బాధలో ఉన్న భార్గవిని తమ్ముడి అనారోగ్యం మరింత కుంగదీస్తుందని బంధువులు ఆందోళన చెందుతున్నారు.

రుణం మొత్తం చెల్లించినా - ఆగని లోన్​యాప్​ వేధింపులు - మరో ప్రాణం బలి - Man Suicide by Loan App Harassment

లోన్​యాప్​ వేధింపులకు మరో ప్రాణం బలి - చెరువులో దూకి విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.